logo

Tirumala: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన(రూ.300)టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది.

Updated : 21 May 2022 11:53 IST

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన(రూ.300)టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే కోరింది. మొత్తం 13.35లక్షల టికెట్లకు గానూ ఉ.11గంటల వరకు 3.50లక్షల టికెట్లు బుక్‌ అయ్యాయి. 

సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతున్నట్లు తితిదే వెల్లడించింది. నిన్న శ్రీవారిని 71,119 మంది దర్శించుకోగా.. 37,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.91కోట్లుగా నమోదైనట్లు తితిదే తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని