Huzurabad By Election: జీ ‘హుజూర్’ ఎవరికో!
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస, భాజపా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అభ్యర్థులు, పార్టీల్లోనే కాదు, ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇండియా-పాకిస్థాన్...
ఉప ఎన్నికలో నువ్వా నేనా?
చెమటోడుస్తున్న అభ్యర్థులు
భారీగా ఖర్చుపెడుతున్న పార్టీలు
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న బరి
హుజూరాబాద్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస, భాజపా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అభ్యర్థులు, పార్టీల్లోనే కాదు, ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉన్నంత ఉత్కంఠ ఇప్పుడున్నదని కొందరు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీలు అత్యధిక మొత్తం ఖర్చు చేస్తున్న నియోజకవర్గంగా హుజూరాబాద్ నిలిచిపోయే అవకాశం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నా తెరాస, భాజపాల మధ్యనే ముమ్మర పోరు నెలకొంది. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రానున్న వారం రోజులు పార్టీలకు కీలకం కానున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నిక అధికార తెరాసకు, ఈటలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈటల భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, తెరాస తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి విద్యార్థి నాయకుడు వెంకట్ పోటీలో ఉన్నారు. 2.36 లక్షల మంది ఓటర్లు ఈ నెల 30న అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. కులాల వారీగా సంఘాలతో సమావేశాలు, విందులు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలుకుబడి కలిగిన నాయకులను తమవైపు తిప్పుకోవడంలో పార్టీలు పూర్తిగా తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఒకవైపు నుంచి ఇంకోవైపునకు మారారు. వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు.. ఇలా అందరికీ స్థాయిని బట్టి పార్టీలు భారీగా ముట్టజెప్తున్నట్లు ప్రచారంలో ఉంది. గెలవడానికి తాను పెట్టిన ఖర్చు ఇప్పుడు ఒకేసారి వచ్చిందని ఓ ఎంపీటీసీ సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీల్లో కూడా ప్రధాన చర్చ ఎన్నికల గురించే. తమ సమస్యల గురించి, పార్టీల గురించి మాట్లాడుతూనే ఎన్నికల్లో డబ్బు గురించి కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ‘మా ఊర్లో ఫలానా నాయకుడికి అందిందంట, మావరకు ఇంకా రాలేదు, పోలింగ్కు ముందు ఇస్తారేమో’ అని పలువురు పేర్కొనడం గమనార్హం. మా మండలంలో సర్పంచి పదవికి పోటీ చేసిన ఓ అభ్యర్థి రాత్రికి రాత్రే రూ.రెండువేల నోట్లు పంచి గెలిచారు, ఈ ఎన్నికలోనూ డబ్బు ప్రధాన పాత్ర పోషించవచ్చని కమలాపూర్లోని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు.
పట్టు నిలబెట్టుకునేందుకు తెరాస..
సుదీర్ఘకాలం గెలిచిన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. వరుసగా ఆ పార్టీ తరఫున గెలిచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఈటల ప్రత్యర్థిగా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రి హరీశ్రావు నియోజకవర్గంలోనే మకాం వేసి అన్నీ తానై వ్యవహరిస్తోన్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కో మండలానికి ఇద్దరేసి ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిలుగా పెట్టి గ్రామాలవారీగా వ్యూహరచన చేస్తున్నారు. పథకాల లబ్ధిదారులతో మాట్లాడడంతో పాటు గ్రామంలో సమస్యలుంటే పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేకచోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీల లాంటి పనులు చేశారు. తెరాస తరఫున గెలిచి ఈటల వైపు వెళ్లిన పలువురిని వెనక్కు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం చేసి చాలా వరకు సఫలీకృతమైనట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామాల్లో ఓ మేరకు పట్టున్న నాయకులను కూడా తిప్పుకోవడానికి గట్టి ప్రయత్నం జరిగింది. ఆయా కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను లేదా నాయకులను పిలిపించి వారితో మాట్లాడించడం.. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంపై తెరాస పట్టు బిగిస్తోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రెండేళ్లు ఏ పనులైనా తామే చేయగలమన్న అభిప్రాయాన్నీ ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
పనులు.. పరిచయాలే ఊతంగా ఈటల
తన రాజకీయ భవిష్యత్తుకు సవాలుగా మారిన ఉపఎన్నికలో గెలవడానికి ఈటల ఆత్మాభిమానాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచి పోరాడుతున్నారు. రాజీనామా చేయకముందు నియోజకవర్గంలో తనతో ఉన్న నాయకులు ఇప్పటికీ వెంటనడిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్కు ముందే గ్రామాల వారీగా పర్యటనలు చేసిన ఆయన ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు. అధికార పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉండటం, 2014 నుంచి ఇటీవలి కాలం వరకు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం కూడా దీని పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గాన్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోరాడుతోంది. భాజపా కూడా కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. గ్రామాల వారీగా ఉన్న పరిచయాలు, వివిధ వర్గాలతో ఉన్న సత్సంబంధాలు, గ్రామాల్లో ఏదో ఒకపని చేసి ఉండటం, ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం ఈటలకు ఉపయోగపడతాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈటల వ్యక్తిగత పలుకుబడిపైనే భాజపా ఎక్కువగా ఆధారపడింది.
ఆలస్యంగా కాంగ్రెస్..
ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఆలస్యంగా రంగ ప్రవేశం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన కౌశిక్రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ పార్టీ బలహీనపడింది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్ను బరిలోకి దింపింది. ప్రచారం జోరు పెంచుతున్నా, హోరాహోరీ పోరాడుతున్న రెండు పార్టీల మధ్య ఏ మేరకు ప్రభావం చూపగలరన్న చర్చ సాగుతోంది. ఈ పార్టీకి ఓట్లు పెరిగితే అది ప్రధాన పోటీదారుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ నామమాత్రంగానే ఉంది.
దళిత బంధు ప్రభావమెంత?
ఒక్కో దళిత కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారికి నచ్చిన ఉపాధి పనిని ఎంచుకోవడానికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ఇది హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఉపఎన్నికలో ఈ పథకం ప్రభావం ఎంత ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి సర్వే తర్వాత ఇక్కడ 24,267 దళిత కుటుంబాలున్నట్లు తేల్చారు. ఇందులో 16 వేలకు పైగా కుటుంబాలకు రూ.పదిలక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశంతో తాత్కాలికంగా ఆగిపోయిన ఈ పథకాన్ని నవంబరు రెండో తేదీన ఫలితాల తర్వాత ప్రారంభించవచ్చు. భాజపా ఫిర్యాదువల్లే ఎన్నికల కమిషన్ పథకాన్ని నిలిపివేసిందని తెరాస ప్రచారం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేదని భాజపా పేర్కొంటోంది. పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా ఈ పథకంపై అధికార పార్టీ ఆశలు పెట్టుకొంది. దీని ద్వారా వచ్చే మొత్తంతో ఇల్లు కట్టుకోవడంతోపాటు భూమి కొనుక్కుంటానని వంగపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పేర్కొన్నారు. అయితే దళితేతరుల్లోని కొందరు ఈ పథకంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వాళ్లకు ఇవ్వడం మంచిదే , కానీ మేం కూడా పేదోళ్లమే, మాకు కూడా ఇలాంటి సాయం చేయాలి కదా?’ అని ఒక మహిళ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!