కిడ్నీలపై ‘సిలికా’టు!
తాగునీరు, గాలి ద్వారా వ్యాప్తి
చెరకు, వరి వ్యర్థాల ధూళితోనూ ముప్పు
ప్రమాదకర ఖనిజంపై అంతర్జాతీయ పరిశోధన
అధ్యయనంలో తెలుగు వైద్యుడు గంగాధర్ భాగస్వామ్యం
ఉపరితల జలాలే మేలంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పేదలు, ధనికులనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కిడ్నీ దెబ్బకు కుదేలవుతున్నారు. బీపీ, షుగర్ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది. ‘సిలికా’తో కలుషితమైన నీరు మూత్రపిండాలపై విషం చిమ్ముతోందని తాజా పరిశోధనలో తేటతెల్లమైంది. లోతైన బోరు నీటిని తాగడం, దాంతో పండించిన వరి, చెరకులను తినడం, గ్రానైట్ ధూళి కణాలను పీల్చడం వంటి పరిస్థితుల వల్ల శరీరంలోకి సిలికా చేరి.. మూత్రపిండాల ముప్పు అధికమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా, మెక్సికో, స్వీడన్, బ్రిటన్, థాయిలాండ్, భారత్ తదితర దేశాల్లో సాగిన పరిశోధనలో మన దేశం నుంచి శ్రీరామచంద్ర మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ (తమిళనాడు), నిమ్స్ (హైదరాబాద్) భాగస్వాములయ్యాయి. నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ తాడూరి గంగాధర్ ఇందులో పాలుపంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, చీమకుర్తి, ఉద్దానం ప్రాంతాలు, ఒడిశా, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. మూడేళ్లుగా ఎలుకలపై చేసిన ప్రయోగాలతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలకు సిలికాతో కూడిన నీటిని, సిలికా దుమ్ముతో నిండిన గాలిని అందించారు. దీంతో వాటి మూత్రపిండాలు చెడిపోయినట్లు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే దుష్ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన పత్రం జూన్ 14న ప్రఖ్యాత వైద్యపత్రిక ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’లో ప్రచురితమైంది.
తెలుగు రాష్ట్రాల్లో వ్యాధి విజృంభణ
* తెలంగాణలో ఏటా కొత్తగా సుమారు 20 వేల మంది మూత్రపిండ వ్యాధుల బారిన పడుతుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో 5-6 వేల మందికి డయాలసిస్ అవసరమవుతోంది. రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వ పథకాల ద్వారా ఏటా రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. గత ఎనిమిదేళ్లలో బాధితుల సంఖ్య సుమారు ఆరింతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే. 50 ఏళ్ల లోపు వారు మరో 25 శాతం మంది ఉంటున్నారు.
* ఆంధ్రప్రదేశ్లో ఏటా దాదాపు 50 వేల మందికి కొత్తగా మూత్రపిండాల వ్యాధి సోకుతోంది. వీరిలో 10 వేల మందికి పైగా డయాలసిస్ రోగులుంటున్నారు. కిడ్నీ రోగుల్లో కాళ్లకు నీరు చేరడం, కళ్ల కింద ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొత్తగా కనుగొన్న కారణాలతో వ్యాధిగ్రస్థులయ్యేవారిలో ఈ లక్షణాలేవీ తొలిదశలో కనిపించకపోవడం గమనార్హం.
ఖనిజంతో ప్రమాదం
* అధ్యయన ప్రాంతాల్లోని బాధితుల్లో అత్యధికులు దీర్ఘకాలంగా భూగర్భ జలాలను తాగుతున్నారు. పంట పొలాలకూ వాడుతున్నారు. ఆ జలాల్లో ప్రమాదకరమైన ‘సిలికా’ వంటి ఖనిజాలున్నట్లు గుర్తించారు.
* చెరకు, వరి గడ్డిని కాల్చినప్పుడు వచ్చే పొగ, దుమ్ములో సిలికా అధికంగా ఉంటుంది. ఆ ధూళిని పీల్చడం మరో కారణం.
* గ్రానైట్ రాళ్ల పనుల్లో వెలువడే సిలికా రేణువుల వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతింటాయని తేలింది.
ఉపరితల జలాలే మేలు
- ఆచార్య డాక్టర్ తాడూరి గంగాధర్, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్
సిలికా.. మూత్రపిండాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని మా పరిశోధనలో వెల్లడైంది. లోతుగా బండలను చీల్చుకుంటూ బోర్లు వేసినప్పుడు ప్రమాదకరమైన ఖనిజాలు నీటిలో కలుస్తాయి. 300- 400- 600 మీటర్ల లోతు బోర్లలోని నీటిని వాడడం వల్ల ఖనిజ సాంద్రత పెరిగి కిడ్నీ జబ్బులొస్తున్నాయి. ఆ నీటిలోని సిలికా.. వరి ధాన్యం, చెరకు గడలపై పేరుకుపోతుంది. అందుకే తాగుకు, సాగుకు చెరువులు, కుంటల ద్వారా వచ్చే భూ ఉపరితల జలాలను వాడడమే శ్రేయస్కరం. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు.. ఉపరితల జలవనరుల నుంచే అందిస్తున్నారు. దీనివల్ల సిలికా ప్రమాదం తగ్గుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rajagopal Reddy: అదేం భాష.. తెలంగాణ సమాజం తలదించుకుంటోంది: రాజగోపాల్రెడ్డి
-
Sports News
CWG 2022 : అమ్మాయిల ఫైనల్ పోరు సమయంలో.. రోహిత్ సేన ఇలా..
-
India News
India Corona: కొనసాగుతోన్న హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
-
Movies News
Rajeev Kanakala: ‘లవ్స్టోరీ’లో బాబాయ్ పాత్ర.. ఇబ్బంది పడ్డా! : రాజీవ్ కనకాల
-
Ap-top-news News
Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస