Telangana Elections: చట్టాన్ని, ఈసీని కాంగ్రెస్ బేఖాతరు చేస్తోంది: భారాస
ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తోందని సీఈవో వికాస్ రాజ్కు భారాస ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: చట్టాన్ని, ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ బేఖాతరు చేస్తోందని భారాస (BRS) ఆరోపించింది. ఈ మేరకు భారాస ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేసింది. (Telangana Elections) అనంతరం భారాస లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ (Congress) ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఉల్లంఘనలపై సీఈవోకు నాలుగు ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారన్నారు. ‘‘హింసను ప్రేరేపించేలా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి, సునీల్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టాలి’’ అని సీఈవోను కోరినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mizoram Election Results: మిజోరంలో ZPM జయకేతనం.. సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి
Mizoram Election Results: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జోరంథంగా సహా పలువురు మంత్రులు ఓటమిపాలయ్యాారు. -
BRS: తెలంగాణ భవన్లో భారాస ముఖ్యనేతల భేటీ
తెలంగాణ భవన్లో భారాస (BRS) ముఖ్యనేతలు సమావేశమయ్యారు. -
Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడికి..: డీకే శివకుమార్
కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. -
Hyderabad: ముగిసిన సీఎల్పీ సమావేశం.. కీలక నేతలతో డీకే శివకుమార్ భేటీ
కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. -
Congress: కాసేపట్లో సీఎల్పీ భేటీ.. నేడు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం?
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ (Congress).. నేడు సీఎం అభ్యర్థిని నిర్ణయించనుంది. -
Chhattisgarh: కేవలం 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం..
Chhattisgarh: ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ తాజా ఎన్నికల్లో అత్యల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భూపేశ్ బఘేల్ సర్కారుకు గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. -
Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ
Mizoram Election Results: మిజోరం శాసనసభ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ ఆధిక్యంలో ఉంది. -
Congress: అప్పటికప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని..
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో 30 మందికి పైగా భారాస, భాజపాల నుంచి బయటకు వచ్చినవారే. భారాస అభ్యర్థులను ప్రకటించే సమయానికి మూడోవంతు స్థానాలకు బలమైన అభ్యర్థులు లేక ఆందోళనలో ఉన్న కాంగ్రెస్లోకి పలువురు వచ్చి చేరి టికెట్లు... -
Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు
రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. తొలిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు బరిలో నిలిచారు. -
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర
మధ్యప్రదేశ్లో భాజపా విజయం కోసం సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన కృషి వెల కట్టలేనిది. ఓ దశలో తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నా.. ఆయన మనోధైర్యం కోల్పోలేదు. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి మరోసారి అధికార పీఠానికి బాటలు వేశారు. -
Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల నుంచి పోటీ చేసిన పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపించారు. -
ఆ కుటుంబాల్లో ఆనందం రెండింతలు
ఈ ఎన్నికల్లో భార్యాభర్తలు.. మామాఅల్లుళ్లు.. అన్నదమ్ములు...తండ్రీకొడుకులు.. ఇలా అనేక మంది కుటుంబసభ్యులు విజయం సాధించి ఉమ్మడిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. -
Janasena: డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. -
Telangana Election Results: అప్పుడలా.. ఇప్పుడిలా..!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శాసనసభకు జరిగిన మూడో దఫా ఎన్నికలు ఇవి. రెండు సార్లు భారాస గెలవగా.. తాజాగా మూడో సారి కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో భారాస 63 స్థానాలతో అధికారం చేపట్టింది. -
Telangana Elections: తొలి అడుగులోనే సంచలన గెలుపు
ఈసారి ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అనూహ్యంగా తొలిసారి అవకాశం దక్కించుకుని.. విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు. -
Telangana Election Results: 51 మంది అభ్యర్థులకు 50% పైగా ఓట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపా, ఎంఐఎంలలో 51 మంది అభ్యర్థులు మెరుగైన ఓట్లు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతానికిపైగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే 39 మంది ఉన్నారు. -
ఇద్దరు మినహా ఫిరాయింపుదారులందరి ఓటమి
గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి గెలుపొంది భారాస(అప్పటి తెరాస)లోకి ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే మళ్లీ శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. -
BRS: భారాసకి కొరుకుడుపడని 6 స్థానాలివే..
భారాసకు ఇప్పటికీ రాష్ట్రంలో 6 స్థానాలు కొరుకుడు పడలేదు. 2001లో పార్టీ ఆవిర్భవించగా అప్పటి నుంచి సాధారణ, ఉప ఎన్నికలు ఎన్నింటినో ఎదుర్కొంది. -
Venkata Ramana Reddy: జెయింట్ కిల్లర్.. రమణారెడ్డి
ఇద్దరు కొదమ సింహాల్లాంటి నేతలు. ఆ ఇద్దరూ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు అధినేతలు. ఒకరు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉండగా, మరొకరు తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాల్లో ఉన్నవారు. -
Congress: తెలంగాణ ఎన్నికలు.. అడుగడుగునా కాంగ్రెస్ అధిష్ఠానం ముద్ర!
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వెనుక పార్టీ అధిష్ఠానం పకడ్బందీ వ్యూహం బాగా పనిచేసింది. విజయమే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యనేతలను ఐక్యంగా... -
Telangana Election Results: మూడు పార్టీల నుంచి పోటీ చేసినా ఆదరించారు
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి!
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్లో ఉంటున్నారు: గౌతమ్కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
-
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం