CM KCR: కాంగ్రెస్ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా?: సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో భారాస గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూరు సభ అనంతరం స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు.
నల్గొండ, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్: వచ్చే ఎన్నికల్లో భారాస గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాశక్తి ముందు ఎవరూ నిలువలేరన్నారు. మానకొండూరు సభ అనంతరం స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి, భూమాత తెస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా?అని ప్రశ్నించారు. ధరణిని బంద్ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయన్నారు.
కాంగ్రెస్ పాలన బాగుంటే తెదేపా పుట్టేదా?: కేసీఆర్
నకిరేకల్లో ఏ ఎమ్మెల్యే గెలుస్తారో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం బాగోలేకపోతే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. అభ్యర్థి వ్యక్తిత్వంతో పాటు పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ‘‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సాధన కోసమే భారాస పుట్టింది. స్వరాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేసి అనేక మంది జైలు పాలయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో 400 మందిని కాల్చి చంపారు. 2001లో మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఇస్తామని చెప్పి 2004లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వకుండా 15 ఏళ్లు బాధపెట్టారు’’ అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ జమానాలో రైతు బంధు అనేది విన్నామా?
అవకాశం ఇచ్చిన వారు ఏం చేశారు? మరోసారి అవకాశం ఇస్తే ఇంకేం చేస్తారనే విషయాలను ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని స్టేషన్ ఘన్పూర్ సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘పదేళ్ల పాటు భారాస అధికారంలో ఉంది. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేసింది? స్టేషన్ ఘన్పూర్కు ఏం చేశాం? అనేది ప్రజలు ఆలోచించాలి. స్టేషన్ ఘన్పూర్ అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? మీరే ఆలోచించండి. కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇవాళ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ జమానాలో రైతు బంధు అనేది విన్నామా? రైతుల కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు. తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇందిరమ్మ రాజ్యంలో ధనికుడు మరింత సంపాదించుకున్నాడు. లేనోడు మరింత పేదోదయ్యాడు’’ అని కేసీఆర్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
12 రాష్ట్రాల్లో అధికారంలో భాజపా
తాజా శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ను నిలబెట్టుకోవడంతోపాటు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో విజయకేతనం ఎగురవేయడంతో భాజపా దేశంలో 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లయింది. ఇక కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకు (హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ) పడిపోయింది. -
మరో ‘సారీ’!
రాజకీయ నేపథ్యమున్న నేతలకు చట్టసభల్లో ‘అధ్యక్షా..!’ అని పిలవాలనే కోరిక ఉండటం సహజం. ఆ అవకాశం కోసం కొందరు నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. -
భారాస అప్రజాస్వామిక పరిపాలనకు తిరస్కారం
రాష్ట్రంలో పదేళ్ల భారాస అప్రజాస్వామిక పరిపాలన, అవకాశవాద వైఖరిని ప్రజలు తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భారాస సర్కార్పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుని విజయం సాధించడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. -
ఆ కుటుంబాల్లో ఆనందం రెండింతలు
ఈ ఎన్నికల్లో భార్యాభర్తలు.. మామాఅల్లుళ్లు.. అన్నదమ్ములు...తండ్రీకొడుకులు.. ఇలా అనేక మంది కుటుంబసభ్యులు విజయం సాధించి ఉమ్మడిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. -
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్లు వేర్వేరుగా అభినందనలు తెలిపారు. -
కాంగ్రెస్ వార్కి రూం కలిసొచ్చింది!
వార్ రూం.. కాంగ్రెస్కు కలిసొచ్చిన వేదిక. ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలు, ఎత్తుగడలతో పార్టీ శ్రేణులను నడిపించడంలో కీలకపాత్ర పోషించింది. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గాంధీభవన్ వేదికగా పార్టీ ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది. -
మామా.. మజాకా!
మధ్యప్రదేశ్లో భాజపా విజయం కోసం సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన కృషి వెల కట్టలేనిది. ఓ దశలో తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నా.. ఆయన మనోధైర్యం కోల్పోలేదు. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి మరోసారి అధికార పీఠానికి బాటలు వేశారు. -
మరో ‘యోగి’ అవుతారా!
రాజస్థాన్లో కీలక పదవి చేపట్టడానికి మరో ‘యోగి’ సిద్ధమవుతున్నారా.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిలా కాషాయ దుస్తులు ధరించే బాబా బాలక్నాథ్ ముఖ్యమంత్రి అవుతారా.. అంటే అవకాశాలున్నాయని చెప్పవచ్చు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అనూహ్య విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో పలువురు నిలుస్తున్నారు. -
హ్యాట్రిక్ విజేతలు 12 మంది
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మంది అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. వారిలో తొమ్మిది మంది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన వారే. -
2-2 ఫలితాన్నిచ్చిన జోడో
కాంగ్రెస్ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. -
పంచవ్యూహాలు పాశుపతాస్త్రాలై..!
‘దాదాపు రెండు దశాబ్దాలుగా భాజపాదే అధికారం. ప్రజల్లో దానిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది’.. ‘సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రాభవం తగ్గింది. ఆయన్ను సొంత పార్టీ అధినాయకత్వమే పెద్దగా పట్టించుకోవడం లేదు’.. -
మూడు పార్టీల నుంచి పోటీ చేసినా ఆదరించారు
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. -
ముఖ్యమంత్రులు ఎవరు?
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థులపై ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఛత్తీస్గఢ్లో సంచలనం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఛత్తీస్గఢ్లో తలకిందులయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలూ ఘోరంగా విఫలమయ్యాయి. -
విజేతలే వీరే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు వీరే... -
సెమీఫైనల్స్లో సూపర్హిట్
పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్ అనదగ్గ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో- ఓట్ల లెక్కింపు జరిగిన నాలుగింటిలో మూడింటిని గెలుచుకొని భాజపా మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. -
కారుకు బ్రేకులు ఎందుకు పడ్డాయబ్బా..!
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వచ్చే సానుకూల ఓటుతో తప్పక విజయం సాధిస్తామనే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. -
‘స్పీకర్’ సెంటిమెంట్కు చెల్లు
స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి సెంటిమెంట్ను అధిగమించారు. శాసన సభాపతిగా పనిచేసిన వారు మళ్లీ గెలవరన్న సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు అదే జరిగింది. -
మధ్యప్రదేశ్లో భాజపా జయభేరి
భాజపాకు మధ్యప్రదేశ్ కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. -
శాసనసభకు తొమ్మిదిసార్లు ఎన్నికైన కేసీఆర్
భారాస అధినేత కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో ఎమ్మెల్యేతోపాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల గెలవడంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. -
మూడు రాష్ట్రాల్లో ఒక శాతం కంటే తక్కువగా నోటాకు ఓట్లు
శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లోని ఓటర్లు ఒక శాతం కంటే తక్కువగా నోటావైపు మొగ్గుచూపారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.