Telangana assembly elections: ఇందూరులో పోరు బహు పసందు
పసుపు, చెరకు, వరి పంటలకు, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకూ నిలయమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల జెండా ఎగరేసిన భారాస మరోసారి అదే పట్టు చూపనుందా? కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తలపడుతుండడం...
కేసీఆర్, రేవంత్ల పోటీతో ఉమ్మడి జిల్లాలో కాక
పలు స్థానాల్లో కీలకంగా మారిన భాజపా
జయాపజయాలను నిర్ణయించనున్న మైనారిటీలు
పసుపు, చెరకు, వరి పంటలకు, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకూ నిలయమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల జెండా ఎగరేసిన భారాస మరోసారి అదే పట్టు చూపనుందా? కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తలపడుతుండడం... చుట్టుపక్కల స్థానాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్థానాల్లో పోటీ ఎలా ఉంది? కల్వకుంట్ల కవిత ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న బోధన్, మిగతా నియోజక వర్గాల్లో పరిస్థితులపై పరిశీలన కథనం...
కామారెడ్డి... కదనరంగమే
ఇక్కడ అయిదుసార్లు (1994, 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2018) ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ విజయం సాధించారు. అనూహ్యంగా కేసీఆర్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్.. కేసీఆర్ తల్లిగారి ఊరు. కామారెడ్డి నియోజకవర్గం హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో వాణిజ్యపరంగా కీలకంగా మారింది. కేసీఆర్ గెలిస్తే... పారిశ్రామికంగా, సాగునీటి పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయన్న చర్చ వినిపిస్తోంది. ఇక్కడ కేసీఆర్ పోటీలో ఉండడంతో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఎల్లారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్, మెదక్, సిరిసిల్ల, వేములవాడ, దుబ్బాక నియోజకవర్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని భారాస వర్గాలు చెబుతున్నాయి. మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు రోజుకొకరు చొప్పున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వరుసగా పోటీ చేస్తూ వచ్చిన షబ్బీర్అలీ మరో నియోజకవర్గానికి తరలిపోవడంతో మైనారిటీల మద్దతు కూడగట్టేందుకు భారాస ప్రయత్నిస్తోంది. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాల్లో పూర్తి పట్టు సాధించే లక్ష్యంతో నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలవడంతో ప్రతి మండలంలో ఒక సీనియర్ నేత ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై వివాదం, భూములు కోల్పోనున్న రైతుల సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. భూములను లాక్కోవడానికే కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైందనీ ప్రచారం చేస్తున్నారు. తటస్థులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు.
భాజపా నుంచి బరిలో ఉన్న జడ్పీ మాజీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి... ధార్మిక, సామాజిక కార్యక్రమాలతో స్థానికంగా గుర్తింపు పొందారు. తానెప్పటికీ ఇక్కడే, ప్రజల మధ్యలో ఉంటానని, ‘లోకల్’నని ప్రచారంలో చెబుతున్నారు. ‘‘రమణన్నను ఎవరు అడిగినా సాయం చేస్తారు. ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. రాజకీయంగా అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు’’ అని కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు తెలిపారు.
‘కేసీఆర్ వస్తుండటంపై మేం ఆలోచన చేస్తున్నాం. గజ్వేల్ మాదిరే మా ప్రాంతం మారుతుందా... అనే చర్చ ఊర్లో నడుస్తోంది..’ అని భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన కొందరు రైతులు తెలిపారు.
‘మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీల తీరును గమనిస్తున్నాం. అంతా ఒకే తరహా హామీలే ఇస్తున్నారు’ అని బీబీపేట మండలంలో కొందరు యువకులు తెలిపారు.
ఎల్లారెడ్డి... ఎవరిదో గురి?
ఎల్లారెడ్డిలో బీసీ వర్గాల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొంది భారాసలో చేరిన ఎమ్మెల్యే జాజాల సురేందర్... మరోసారి బరిలో ఉన్నారు. రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చానని, రైతుబంధు లబ్ధిదారులు, పోడు పట్టాలు పొందిన రైతులు మద్దతుగా నిలుస్తారని నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు ఆరు గ్యారంటీలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన వి.సుభాష్రెడ్డి... భాజపా అభ్యర్థిగా నిలిచారు. బీసీ సీఎం హామీ తదితరాలను ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్లో త్రిముఖ పోటీ
భారాస అభ్యర్థి బిగాల గణేశ్గుప్తా హ్యాట్రిక్ విజయానికి కృషి చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సమీకృత మార్కెట్లు, నగర సుందరీకరణ, కళాభారతి నిర్మాణంతోపాటు నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, అధునాతన శ్మశాన వాటికలపై ప్రచారం చేస్తున్నారు. స్థానిక మరాఠీ కుటుంబాలు, మైనారిటీల ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్బిన్ హందాన్కు 30.6% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం షబ్బీర్ రాకతో మైనారిటీల మద్దతు మరింత పెరుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటూ కలిసి వస్తుందని హస్తం శ్రేణులు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఇక్కడ తమ పార్టీ బలోపేతమైందని భాజపా అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్తా అంటున్నారు. పార్టీలో యువత భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో 42.52% ఓట్లతో భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇక్కడ విజయం సాధించారు. ఆ ఓటుబ్యాంకు ఇప్పటికీ పార్టీకి పదిలంగా ఉందని భావిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్లో ద్విముఖ పోరు
బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ హ్యాట్రిక్ విజయంపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు.. వంతెనలు, రహదారుల నిర్మాణం, పోడు భూములకు పట్టాల పంపిణీని ప్రస్తావిస్తున్నారు. తాను ఆర్టీసీ ఛైర్మన్గా ఉన్న సమయంలోనే సంస్థ కార్మికులను ప్రభుత్వంలో విలీనం జరిగిందని చెబుతున్నారు. ఆయన కుమారుడు, దర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు జగన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి భారాస మాజీ ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డి బరిలో ఉన్నారు. రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రచారంలో ఆరోపిస్తున్నారు. భాజపా అభ్యర్థి దినేశ్ కులాచారి యువత అండతో ప్రచారం సాగిస్తున్నారు.
బాల్కొండ... బరిలో గెలిచేది ఎవరో?
మూడోసారి విజయానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సౌకర్యాలు, చెక్డ్యాంలు, వంతెనలు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవం పనులు, భారాస సంక్షేమ కార్యక్రమాలపై బూత్స్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ప్రముఖ ప్రైవేటు బస్సుల సంస్థ యజమాని ముత్యాల సునీల్కుమార్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీకి 41,254 ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్ ఓట్లూ కలిసి... విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పోటీలో ఉన్నారు. పసుపు బోర్డు హామీని ప్రస్తావిస్తున్నారు. పార్టీకి యువత మద్దతు పెరిగిందని చెబుతున్నారు.
ఆర్మూర్లో ముక్కోణపు పోటీ
హ్యాట్రిక్ విజయం సాధించాలని భారాస ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి, గోదావరిపై వంతెన, సిద్ధుల గుట్ట అభివృద్ధి తనకు కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. రైతులు, బీసీ వర్గాల మద్దతు తనకే ఉందని విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన పి.వినయ్కుమార్రెడ్డి... ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. నాలుగున్నరేళ్లుగా భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆ పార్టీ ఓట్లను ఎంతమేర చీలుస్తారనేది ఆసక్తిగా మారింది. భాజపా నుంచి పి.రాకేశ్రెడ్డి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కలిసి వస్తుందని అంటున్నారు.
బోధన్లో ధనాధన్
బోధన్లో మూడోసారి జెండా ఎగరేసేందుకు భారాస ఎమ్మెల్యే షకీల్ కృషి చేస్తున్నారు. మైనారిటీల కంచుకోట కావడం కలిసి వస్తుందని, నిజాంసాగర్ ఆధునికీకరణతో లబ్ధి పొందిన రైతుల ఓట్లు తమకే పడతాయని నమ్మకంగా ఉన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా కల్వకుంట్ల కవిత ఉండటం కలిసివస్తుందంటున్నారు. మైనారిటీలు ఈ దఫా తనకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్ అభ్యర్థి పి.సుదర్శన్రెడ్డి భావిస్తున్నారు. రైతు రుణమాఫీ హామీ, భారాస వ్యతిరేక ఓటుపై నమ్మకంతో ఉన్నారు. భాజపా నుంచి రైస్ మిల్లర్ల సంఘం నాయకుడు వడ్డి మోహన్రెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ మ్యానిఫెస్టో, మోదీ ఆకర్షణ పనిచేస్తాయని విశ్వసిస్తున్నారు.
బాన్సువాడ... ప్రగతి పనులు X 6 గ్యారంటీలు
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఇక్కడ ప్రచారంలో ముందున్నారు. 11 వేల రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సిద్దాపూర్, జాకోరా ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిజాంసాగర్ కాలువల అనుసంధానంతో ప్రయోజనం పొందిన బాన్సువాడ, వర్ని మండలాల్లో రైతుల మద్దతు తనకే ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ.. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర వాటాను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. యువత తమవైపే మొగ్గు చూపుతుందని చెబుతున్నారు.
జుక్కల్(ఎస్సీ)... ముగ్గురి మధ్య గట్టి పోటీ
కర్ణాటక, మహారాష్ట్రలతో సరిహద్దు ఉన్న జుక్కల్ నియోజకవర్గం.. మూడు భాషలు మాట్లాడే ప్రజలతోపాటు మత పీఠాలు, ధార్మిక కేంద్రాలకు నిలయంగా ఉంది. ఇక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హన్మంతు షిండేే... నాలుగోసారి భారాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రచారంలో సాగునీటి పథకాల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తున్నారు. ఆశావహుడైన మాజీ ఎమ్మెల్యే గంగారాంను కాదని... లక్ష్మీకాంతరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఆయన ప్రచారం చేస్తున్నారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే అరుణతార భాజపా నుంచి బరిలో ఉన్నారు. నియోజకవర్గంపై పట్టున్న అరుణతార విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
మొత్తం నియోజకవర్గాలు: 9
రిజర్వుడు స్థానం: 1 (ఎస్సీ)
గత ఎన్నికల్లో ఫలితాలు
భారాస: 8
కాంగ్రెస్: 1
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక మాటల్లేవ్
అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగిసింది. గత నెలరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లతో నెలకొన్న సందడి ముగియడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. -
ఖాజాగూడలో రూ.1.68 కోట్ల పట్టివేత
హైదరాబాద్ ఖాజాగూడలో పోలీసుల తనిఖీల్లో రూ.1.68 కోట్లు పట్టుబడ్డాయి. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్రెడ్డి కోసం ఈ నగదు తరలిస్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అంగీకరించారు. -
TS Elections: అభ్యర్థులు 2,290.. ఓటర్లు 3,26,02,799 ఎన్నికల విశేషాలివే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Elections) ప్రచారం ముగియడంతో పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
Telangana Elections: ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్: సీపీ శాండిల్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. -
KTR: తెలంగాణ ఇప్పుడెట్లుందో ఆలోచించండి.. ఆగం కాకండి: కేటీఆర్
తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత తొమ్మిదిన్నరేళ్ల ప్రయాణం కొత్త పంథాలో కొనసాగిందన్నారు. -
Vikasraj: సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ (CEO Vikasraj) తెలిపారు. -
Telangana Elections: ప్రచారం పరిసమాప్తం.. పోలింగ్పైనే రాజకీయ పార్టీల గురి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు మైకులు మూగబోయాయి. -
Karnataka govt: ‘ఉల్లంఘన కానే కాదు’.. పత్రికల్లో ప్రకటనలపై డీకే శివకుమార్
ఎన్నికళ వేళ తెలంగాణలోని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల ప్రవర్తన నియామావళి కానేకాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి తెలియజేస్తామన్నారు. -
CM Kcr: గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది.. మరింత అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్
గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా.. శ్వాసగా బతుకుతున్నానని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. (Telangana Elections) -
Sonia gandhi: ‘మీరు నా మనసుకు దగ్గరగా ఉంటారు..’ తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. -
Telangana Elections: పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలి: వికాస్ రాజ్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana elections) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas raj) తెలిపారు. -
Eatala Rajender: కేసీఆర్.. పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల రాజేందర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. -
KCR: తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సే: కేసీఆర్
50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
Hyderabad: తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
KTR: కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్: కేటీఆర్
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. -
Priyanka Gandhi: సాగునీటి ప్రాజెక్టుల్లో భారాస భారీగా అవినీతికి పాల్పడింది: ప్రియాంక గాంధీ
రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొన్నారు. -
Rahul Gandhi: భాజపా చెప్పిన చోటే మజ్లిస్ పోటీ: రాహుల్ గాంధీ
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భాజపా నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందని విమర్శించారు. -
MP Laxman: కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Revanth Reddy: అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన కార్మికులకు ఇతర దేశాల్లో అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రత్యేకం విభాగం ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పారు. -
Ashok Gehlot: భాజపా, భారాస కలిసే పనిచేస్తున్నాయ్: అశోక్ గహ్లోత్
తెలంగాణలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Madhya Pradesh: కౌంటింగ్కి ముందే పోస్టల్ బ్యాలెట్లు చూశారు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు
మధ్యప్రదేశ్లో కౌంటింగ్కు ముందే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తెరిచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
-
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’