Seethakka: అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు.

Updated : 21 Nov 2023 08:08 IST

బ్యాలెట్‌పై తన ఫొటో చిన్నగా ఉందని ఆగ్రహం

ములుగు, న్యూస్‌టుడే: ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క)(Seethakka) సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. అంతకుముందు ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌ అక్కడికి చేరుకొని సముదాయించినా.. స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌ సూచన మేరకు నాయకులు సీతక్క మరో ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ఫొటోను బ్యాలెట్‌పై పొందుపరుస్తామని సమాధానమిచ్చి రిటర్నింగ్‌ అధికారి వెళ్లిపోయారు. కానీ ఆయన హామీలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు నిరసన కొనసాగించారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలో ప్రచారం నిర్వహించిన సీతక్క అర్ధరాత్రి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడి.. అక్కడే బైఠాయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాత్రి 2 గంటలు దాటినా సీతక్క ఆందోళన కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని