క్యాన్సర్ సైనికులం మనమే కావాలి!
క్యాన్సర్ నివారణ మన బాధ్యతే. ఇప్పుడంతా ఇలాంటి సంకల్పమే తీసుకోవాలి. ప్రపంచ క్యాన్సర్ దినం సందేశం ఇదే. క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది మరి.............
నేడు (ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినం
క్యాన్సర్ నివారణ మన బాధ్యతే. ఇప్పుడంతా ఇలాంటి సంకల్పమే తీసుకోవాలి. ప్రపంచ క్యాన్సర్ దినం సందేశం ఇదే. క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది మరి. జన్యుమార్పులతో క్యాన్సర్ రావటం నిజమే అయినా.. వీటి పాత్ర 5-10 శాతమే. పొగాకు, మద్యం అలవాట్లతో ముడిపడిన క్యాన్సర్లు 27 శాతానికి పైగా ఉన్నాయంటే వీటి నివారణకు మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం లేదనే అర్థం. ఆహార విహారాల్లో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ దరిజేరకుండా కాపాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి క్యాన్సర్ అంటే ఏంటి? దీనికి దోహదం చేస్తున్నవేంటి? నివారణ మార్గాలేంటి? అనేవి ఒకసారి తెలుసుకుందాం.
క్యాన్సర్ అంటే?
కణజాలం అనవసరంగా, ఆగకుండా విపరీతంగా వృద్ధి చెందటమే క్యాన్సర్. సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనప్పుడు విభజన చెందుతుంటాయి. అవసరం తీరాక విభజన ఆపేస్తాయి. ఈ ప్రక్రియకు అవసరమైన సంకేతాలను.. అంటే ఒక ‘మీట’లాంటిదాన్ని కణాలే రూపొందించుకుంటాయి. క్యాన్సర్ కణాల్లోనే కాదు.. వీటి నుంచి పుట్టుకొచ్చిన కణాల్లోనూ ఈ ‘మీట’ ఉండదు. ఫలితంగా కణాలు తామరతంపరగా వృద్ధి చెందుతూ వస్తుంటాయి. పక్కనున్న కణాలన్నింటినీ ఛేదించుకుంటూ విస్తరిస్తుంటాయి. ఇదే క్యాన్సర్ కణితి.
క్యాన్సర్కు దారితీసే అంశాలేంటి?
జన్యుమార్పులే కాదు.. జన్యు వ్యక్తీకరణను దెబ్బతీసేవన్నీ క్యాన్సర్ కారకాలుగా పరిణమిస్తాయి. ఇందులో మన జీవనశైలే కీలకపాత్ర పోషిస్తుంది. మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన గతి తప్పిన ఆహార విహారాలు, పరిసరాల ప్రభావంతో ముడిపడినవే.
అధిక బరువు: ఊబకాయం గలవారి శరీరంలో నిరంతరం కణస్థాయిలో స్వల్పంగా వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) కొనసాగుతుంది. అలాగే రక్తంలో ఇన్సులిన్, ఇన్సులిన్ మాదిరి గ్రోత్ హార్మోన్ల మోతాదులూ ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు, కొవ్వు మూలంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగానూ ఉత్పత్తి అవుతుంటుంది. ఇవన్నీ పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ, అండాశయ, క్లోమ, కాలేయ, అన్నవాహిక, కిడ్నీ, ప్రోస్టేట్, పిత్తాశయ క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తాయి.
- బరువు నియంత్రణలో ఉంచుకోవటం, అధికంగా పెరుగుతున్నట్టయితే తగ్గించుకోవటం మంచిది.
పొగాకు వాడకం: పొగాకులో సుమారు 7వేల రకాల విషతుల్య రసాయనాలుంటాయి. వీటిల్లో 400 రకాలు క్యాన్సర్కు దారితీసేవే. మొత్తం క్యాన్సర్లలో 22% పొగాకు మూలంగా తలెత్తుతున్నవే. పొగాకుతో నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లే కాదు.. మెడ, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయ, క్లోమ, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లూ పుట్టుకొస్తాయి.
- సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చకపోవటం.. ఇతరులు వదిలిన పొగను పీల్చకపోవటం.. గుట్కా, జర్దా వంటివి నమలకపోవటం వంటి జాగ్రత్తలతో వీటిని నివారించుకోవచ్చు.
మద్యం తాగటం: మద్యం ఒంట్లోకి చేరుకున్నాక అసిటల్డిహైడ్గా మారుతుంది. ఇది డీఎన్ఏను, కణాల మరమ్మతు ప్రక్రియను దెబ్బతీస్తుంది. మద్యం తాగటం వల్ల నోరు, మధ్య గొంతులోని కణాలు దెబ్బతిని, క్యాన్సర్ కారకాలు తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. మద్యంతో నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, కాలేయ, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ.
- మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ మద్యం అలవాటుంటే మితిమీరకుండా చూసుకోవాలి.
వైరల్ ఇన్ఫెక్షన్లు: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్కు దారితీయొచ్చు. హెచ్పీవీ వైరస్తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావొచ్చు. ఇది జననాంగ, మలద్వార, నోరు, గొంతు క్యాన్సర్లకూ కారణమవుతుంది.
- ఒకరు వాడిన బ్లేడ్లు, సిరంజీల వంటివి వాడకుండా చూసుకోవటం, సురక్షిత శృంగారం వంటి జాగ్రత్తలతో హెపటైటిస్ బి, సి బారినపడకుండా చూసుకోవచ్చు. జననాంగ శుభ్రత, విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండటం ద్వారా హెచ్పీవీని అడ్డుకోవచ్చు. హెపటైటిస్ బి, హెచ్పీవీ ఇన్ఫెక్షన్ల నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆహార అలవాట్లు: మాంసాహారం, కొవ్వు పదార్థాలు అతిగా తింటే క్యాన్సర్లు తలెత్తే ప్రమాదముంది. శాకాహారుల్లో ప్రతి వెయ్యిమందిలో 15-35 మందికి.. శాకాహారం, మాంసాహారం రెండూ తినేవారిలో 35-75 మందికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుండగా.. పూర్తిగా మాంసాహారమే తినేవారిలో 195-210 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తాయి.
- వీలైనంత వరకు శాకాహారం తినటం మేలు. మాంసాహారులైతే మితం పాటించాలి.
హెచ్చరిక సంకేతాలపై కన్నేయండి
* మలమూత్ర విసర్జనలో మార్పులు
* పుండ్లు మానకుండా దీర్ఘకాలంగా వేధిస్తుండటం
* ఒంట్లో ఎక్కడైనా అసహజ రక్తస్రావం
* అకారణంగా బరువు, ఆకలి తగ్గటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది పడటం
* అదే పనిగా అజీర్ణంతో బాధపడుతుండటం
* పుట్టుమచ్చలు, పులిపిర్లలో కొత్తగా అసహజ మార్పులు
* దగ్గు, గొంతు బొంగురుపోవటం ఎంతకీ తగ్గకపోవటం
* ఒంట్లో ఎక్కడైనా గడ్డలు ఏర్పడటం. ముఖ్యంగా నొప్పి లేకుండా గడ్డల సైజు పెరుగుతుండటం
* నిస్సత్తువ, తీవ్రమైన అలసల, బలహీనత
* రొమ్ముల ఆకారంలో మార్పులు, గడ్డలు, నొప్పి
* రాత్రిపూట తీవ్రంగా చెమట్లు పట్టటం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు