మన ఆరోగ్యానికి ‘తేనె’లొలుకు
తేనె ఎంత తియ్యగా ఉంటుందో.. ఆరోగ్యానికి అంత మంచిది. ప్రస్తుత కరోనా కాలంలో శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. దాని కోసం తాజా కాయగూరలు, పండ్లు, మాంసాహారం భోజనంలో తీసుకోవాలి. వాటితోపాటు తేనెను సేవిస్తే...
ప్రస్తుత కరోనా కాలంలో శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఔషధ గుణాలున్న తేనె చాలా అవసరం. ఎన్నో పోషకాలు ఉన్న తేనెను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి తేనెతో చేకూరే లాభాలు ఏంటో మనమూ ఓసారి చూద్దామా..
చర్మ సౌందర్యానికి...
చర్మ సౌందర్యానికి తేనె చాలా చక్కగా పని చేస్తుంది. చక్కెర, నిమ్మ రసంతోపాటు తేనెను కలిపిన మిశ్రమాన్ని దూదితో ముఖానికి పట్టించాలి. కొంతసేపటి తర్వాత కడిగేస్తే చర్మం నిగనిగలాడుతుంది. తేనీరులో కానీ, గోరువెచ్చని నీటిలో ఓ స్పూను తేనె కలుపుకొని తాగితే వాతం చేయకుండా ఉంటుంది.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా...
సాధారణంగా టీ, కాఫీలలో చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర కలిపిన తేనీరును సేవించలేరు. అలాంటి వారి కోసం తేనె వాడటం చాలా మంచిది. ఎలాంటి వారైనా తేలిగ్గా తీసుకోగలిగిన తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అలాగే కుకీలు, కేక్లు, పేస్ట్రీల తయారీకి చక్కెర బదులు తేనెను వినియోగిస్తే మంచిది. తేనెతో తయారు చేస్తే ఇటు ఆరోగ్యానికి ఉపయోగంతోపాటు మిఠాయిలు భలే రుచిగా ఉంటాయి. 100 గ్రాముల తేనె పరిమాణంలో 300 కేలరీలు ఉంటాయి.
కంటికి చాలా మంచిది...
శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే తేనెను సేవించడం వల్ల తగ్గించుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఊపిరి తీసుకోవడానికి సహకరిస్తుంది. ఒక టీ స్పూన్ తేనె, స్పూన్లో ఎనిమిదో వంతు దాల్చిన చెక్క పౌడర్ను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. క్యారెట్స్, ఆకు కూరలు తినడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు. అలానే తేనె కూడా చాలా మంచిది. క్యారెట్ జ్యూస్లో కాస్త తేనెను కలుపుకొని తాగితే కంటి చూపు మెరుగయ్యే అవకాశం ఉంది. తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్న వారు తేనె వాడితే సత్ఫలితాలు పొందుతారు. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి జుట్టుకు పట్టించి మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల తలలో వచ్చే దురదలు, చుండ్రు తగ్గించుకోవచ్చు.
గాయానికి పూతగా తేనె
ప్రమాదవశాత్తూ శరీరంలో ఎక్కడైనా గాయమైతే వెంటనే పసుపు, టించర్, ఇతర ఆయింట్మెంట్ను పూస్తాం. తేనె కూడా యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. గాయం అయిన చోట కాస్త తేనెను అద్దితే బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. గాయం త్వరగా మానేందుకు దోహదం చేస్తుంది. అలర్జీల నుంచి రిలీఫ్ను ఇస్తుందని పలువురు నేచురోపతి వైద్యులు పేర్కొన్నారు. తేనెలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కెరలు నేరుగా రక్త ప్రవాహంలో కలవడం ద్వారా సత్వర శక్తి శరీరానికి వస్తుంది. క్రీడాకారులకు తేనె అవసరం చాలా ఉంటుంది.
డైటింగ్ చేసేటప్పుడు..
డైటింగ్ చేసేవారు క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవిస్తూ ఉంటారు. గ్రీన్టీలో కాస్త తేనెను కలుపుకొని తాగితే ఎంతో మంచిది. మెటబాలిజమ్ (జీవక్రియ) సక్రమంగా పని చేయడంలో తేనె ఉపకరిస్తుంది. మీకు నిద్ర సరిగా పట్టడం లేదా..? అయితే తేనె సేవిస్తే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. తేనెలోని చక్కెరలు విడుదల చేసే సెరోటోనిన్ నిద్ర వచ్చేందుకు సాయపడుతుంది. అసందర్భంగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఓ టీ స్పూన్ తేనెను సేవిస్తే మేలు. తేనెను తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు కాసేపటికి ఆగిపోయే అవకాశం ఉంది.
ముఖారవిందం కోసం..
ఏదైనా ఫంక్షన్స్, బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఫేషియల్ చేయించుకుంటాం. అయితే వివిధ రకాల క్రీములను ముఖానికి పూసి ఫేస్ స్క్రబ్తో క్లీన్ చేస్తారు. అయితే ఫేస్ స్క్రబ్ అనేవి ఎక్కువగా రసాయనాలతో తయారు చేసినవే. తేనె మాత్రం సహజసిద్ధమైన యాంటీ బయాటిక్ కావడం వల్ల ముఖంపై ఉండే నిర్జీవ కణాలు, బ్యాక్టీరియాను వందశాతం తొలిగిస్తుంది. ఫేషియల్ను శుభ్రం చేసుకోవాలంటే కాస్త కొబ్బరి నూనెలో తేనెను కలిపి ముఖాన్ని రుద్దితే సరిపోతుంది. సహజ సిద్ధమైన ఫేస్ స్క్రబ్గా తేనె పని చేస్తుంది. అలాగే ముఖం మీద వచ్చే మచ్చలు తగ్గేందుకు తేనె చాలా ఉపయోగకరం. కాస్త తేనె, బేకింగ్ సోడాను పాలు, వేడినీటిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
ఎన్నో రకాల నొప్పులకు మందు..
నెలలు నిండే కొద్దీ గర్భిణులకు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు మందులను వాడటం బదులు పాలలో తేనె కలుపుకుని తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది. అలానే ఉదయం, రాత్రి వేళల్లో వచ్చే కడుపు నొప్పికి తేనె బాగా పనిచేస్తుంది. స్వచ్ఛమైన తేనెను సేవించడం వల్ల డయేరియా, గ్యాస్ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. అల్లంతో కలిపి తేనెను వాడితే చాలా మంచిది. తేనెను ఆహారంలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగు పడుతుంది. గొంతులో ఇబ్బందిగా ఉంటే కాస్త తేనెను వేసుకుంటే మందుల కంటే చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సీ ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?