ఈ సంగీతం ముగిసేది 2640వ సంవత్సరంలోనే!
సంగీతంతో ప్రయోగాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకే సంగీతాన్ని వివిధ వాయిద్యాలతో వినిపిస్తుంటారు. టెంపోను పెంచి.. తగ్గించి సంగీతాన్ని రూపొందించేవాళ్లు ఉంటారు. ఆపకుండా కొన్ని గంటల పాటు వాయిద్యాలను వాయించేవారూ
ఇంటర్నెట్ డెస్క్: సంగీతంతో ప్రయోగాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకే సంగీతాన్ని వివిధ వాయిద్యాలతో వినిపిస్తుంటారు. టెంపోను పెంచి.. తగ్గించి సంగీతాన్ని రూపొందించేవాళ్లు ఉంటారు. ఆపకుండా కొన్ని గంటల పాటు వాయిద్యాలను వాయించేవారూ ఉంటారు. కానీ, ఓ సంగీతాన్ని అత్యంత నెమ్మదిగా వాయించగలమని ఓ సంగీతకళాకారుడు చెప్పగా.. దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు కొందరు సంగీత కళాకారులు. ఆయన సృష్టించిన ఓ సంగీతాన్ని అత్యంత నెమ్మదిగా వాయించేలా ఓ పరికరాన్ని రూపొందించారు. గత 19 ఏళ్లుగా నెమ్మదిగా వాయిస్తున్న ఈ పరికరం.. సంగీతంలోని నోట్స్ను పూర్తి చేయాలంటే మరో ఆరు శతాబ్దాలకుపైగా సమయం పట్టనుందట.
అమెరికాకు చెందిన జాన్ కేజ్ అనే సంగీత కళాకారుడు 1985లో పియానోతో ‘యాస్ స్లో యాస్ పాజిబుల్(ఏఎస్ఎల్ఎస్పీ)’పేరుతో ఓ సంగీతాన్ని రూపొందించాడు. దానిని 20 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు వాయించొచ్చు. అయితే 1987లో ఇదే సంగీతాన్ని బొంగు రూపంలో ఉండే కీబోర్డు ‘ఆర్గాన్’తో మరోసారి రూపొందించారు. ఈ సంగీతంలో ఉండే ఒక్కో నోట్ను ఎంత నెమ్మదిగా వాయించొచ్చనే విషయాలను కేజ్ వివరంగా తెలిపారు. ఆయన మరణించిన తర్వాత 1997లో ‘యాస్ స్లో యాజ్ పాజిబుల్’ను అత్యంత నెమ్మదిగా వాయించాలని కొందరు సంగీతకళాకారులు నిర్ణయించారు. చర్చలు, పరిశీలన అనంతరం ఈ సంగీతాన్ని ఆర్గాన్లో అత్యంత నెమ్మదిగా వాయిస్తే 639 సంవత్సరాలు పడుతుందని లెక్కగట్టి.. ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ఆర్గాన్2/ఏఎస్ఎల్ఎస్పీ ప్రాజెక్టు కోసం జర్మనీలోని హల్బర్సాట్లోని సెయింట్ బుచర్డి చర్చిని ఎంపిక చేసుకున్నారు. 2001 సెప్టెంబర్ 5న ప్రత్యేకమైన వాయిద్య పరికరం ఆర్గాన్ను ఏర్పాటు చేశారు. ఇది కర్ర బొంగులతో రూపొందించిన సంగీత వాయిద్యం. పరికరంలోని ఒక్కో కర్ర బొంగు సంగీతంలోని ఒక్కో నోట్ను వినిపిస్తుంటాయి. దీంతో ఎఎస్ఎల్ఎస్పీలోని సంగీతంలో ఉండే నోట్స్ను బట్టి వాటిని అమర్చుతున్నారు. తొలి నోట్ పెట్టినా సంగీతం మొదలయ్యే ముందు వచ్చే నిశ్శబ్దమే 2003 ఫిబ్రవరి వరకు సాగింది. ఆ తర్వాత నోట్స్ మార్చడానికి వారి ప్రణాళిక ప్రకారం కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతోంది. ఈ మధ్య కాలంలో అయితే సెప్టెంబర్ 5న ఆర్గాన్లో ఒక నోట్ను మార్చారు. మళ్లీ 2022 ఫిబ్రవరి 5న నోట్ మార్చనున్నారు. ఇలా ఈ సంగీతం ఏళ్ల తరబడి కొనసాగుతూ 2640లో ముగియనుంది. ఈ సంగీతాన్నే నెమ్మదిగా వాయించేందుకు కొందరు సంగీతకళాకారులు గతంలో ప్రయత్నించారు. 2009లో డయానే లుచీస్ అనే సంగీత కళాకారుడు ఈ సంగీతాన్ని 14 గంటల 56నిమిషాలు వాయించాడు. అదే ఏడాది మరొకరు 9-12 గంటలపాటు వాయించారు. కానీ, ఒక సంగీతాన్ని 639 సంవత్సరాలు వాయించడమనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!