జిన్పింగ్ ‘క్లీన్ప్లేట్’ వెనుక కథ..!
చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం.
భారీ కరవు దిశగా డ్రాగన్..?
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కాగా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం. దీంతో దానిని అమలు చేయడం మొదలుపెట్టారు. దీని కోసం ఎన్-1 విధానం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు ఫుడ్ యూట్యూబర్లపై ఆంక్షలు విధించారు. చాలా మంది చైనా అధికారులకు భయపడిపోయి తమ సామాజిక మాధ్యమాల్లోని వీడియోలను కూడా తొలగించడం మొదలుపెట్టారు. చైనాలో ఏదైనా ఉద్యమస్థాయిలో తీవ్రంగా అమలు చేస్తారు. దీంతో తాజాగా క్లీన్ప్లేట్ ఉద్యమం ఎటు పోతుందో అన్నది ఆందోళనకరంగా మారింది.
అసలు ఈ ‘క్లీన్ప్లేట్’ ఏమిటీ..?
ఆహార వృథాను అడ్డుకొనేందుకు తొలిసారి 2013లో ‘ఆపరేషన్ ఎమ్టీ ప్లేట్’ ప్రవేశపెట్టారు. అప్పట్లో సాధారణ ప్రజలకు కాకుండా అధికారులు.. ఇతర హైప్రొఫైల్ వ్యక్తులు మాత్రమే దీనిలో చేర్చారు. వీరు ఇచ్చే విందుల్లో ఆహార వృథా లేకుండా చూడాలనేది దీని లక్ష్యం. 2015లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లెక్కల ప్రకారం 1.8కోట్ల టన్నుల ఆహారం చైనాలో వృథాగా పోతోంది. దీంతో దాదాపు 5 కోట్ల మందికి ఏడాదిపాటు ఆకలి తీర్చవచ్చు.
తాజాగా షీ జిన్పింగ్ వుహాన్లోని కేటరింగ్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార వృథాను తగ్గించాలని ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ క్లీన్ ప్లేట్’ 2.0ను ప్రతిపాదించారు. ఈ సారి సాధారణ ప్రజలను కూడా దీనిలో భాగస్వాములను చేశారు. రెస్టారెంట్లలో ఎన్-1 విధానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఒక గ్రూపుగా వచ్చే వారు ఆర్డర్లో ఒకరికి తగ్గించాలి. అంటే 10 మంది వెళితే 9 మందికి సరిపడా ఆర్డరే ఇవ్వాలి. అంతేకాదు.. కస్టమర్లకు అవసరమైన విధంగా చిన్నచిన్న మొత్తంలో కూడా ఆర్డర్లను స్వీకరించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కూడా దీనిని చిన్నప్పటి నుంచే నేర్పించాలని నిర్ణయించారు.
గతంలో కోట్ల మంది మరణం..
చైనాకు మావో నేతృత్వం వహిస్తున్న సమయంలో దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే మొండి పట్టుదలతో గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్ విధానం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆహార పంటలు తగ్గడం.. దీనికి ప్రకృతి విపత్తులు తోడుకావడంతో కోట్ల మంది మరణించారు. చరిత్రలో మనిషి సృష్టించిన మహాకరవుగా ఇది నిలిచిపోయింది.
ఇంత అత్యవసరంగా దేనికి..?
చైనాలో ఈ సారి ఆహారధాన్యాల కరవు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలో గతేడాదితో పోలిస్తే గోధుమల సేకరణ 20శాతం తగ్గినట్లు సమాచారం. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కరవు అంశాన్ని కొట్టిపారేసింది. 120 కోట్ల కిలోల ధాన్యం అదనంగా పండించామని పేర్కొంది. కానీ దేశంలో చాలా చోట్ల ఈ ఏడాది భారీగా వరదలు ముంచెత్తడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ది గార్డియన్ కథనం ప్రకారం వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనా ఆహార అవసరాలను 30శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోపక్క భారత్, వియత్నాంలు కరోనావైరస్ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి.
ఆహార సంక్షోభం ఖాయమా..?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన కంటే ముందే గత నెలలో ఫోర్బ్స్ ఓ కథనం ప్రచురించింది. దీనిలో చైనా ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో చైనాలో ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సప్లయ్లో ఒత్తిడిని ఎదుర్కొంటేనే ఈ విధంగా ధరలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో యాంగ్జీ నదికి భారీగా వరదలు వచ్చాయి. చైనా భారీగా గోధుమలు ఉత్పత్తి చేస్తుంది. కానీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే గత పదేళ్లలో ఎన్నడు లేనంతగా గోధుములను దిగుమతి చేసుకొంది. మరోపక్క మొక్కజొన్నల ధరలు కూడా చైనాలో భారీగా పెరిగాయి. చైనా రిజర్వులోని మొక్కజొన్నలను విక్రయించిందంటే ఉత్పత్తిలో కోతపడినట్లే కదా. అంతేకాదు గత కొన్ని నెలలుగా చైనా భారీ మొత్తంలో పందిమాంసం, సోయాబీన్, సోయా మీల్, గోధుమలు, మొక్కజొన్న, నిల్వ ఆహారంను దిగుమతి చేసుకుంది. చైనాలో ఆహార కొరత వస్తే దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధినాయకత్వం తొలి ప్రాధాన్యం కూడా ఆహార భద్రతే. అందుకే ఇప్పుడు ‘క్లీన్ప్లేట్ ’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
న్యూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?