కశ్మీర్లోకి టర్కీ విషం..!
పాకిస్థాన్ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది.
* బయటపెట్టిన గ్రీకు పత్రిక
* భారత్ దెబ్బకు నిస్సహాయ స్థితికి పాక్ ఉగ్రసంస్థలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని గ్రీకు జర్నలిస్టు ఆండ్రెస్ మౌంటుజోర్లియస్ తన కథనంలో పేర్కొన్నాడు. పెంటపోస్టగ్మా అనే గ్రీకు పత్రిక ఈ మేరకు విస్తృత కథనాన్ని ప్రచురించింది. ఇది ఇప్పుడు సంచలనం రేపుతోంది. దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్ చేయాలన్నది టర్కీ పన్నాగంగా దీనిలో వెల్లడించారు. ఇందుకు కశ్మీర్ను పావుగా వాడుకోవడానికి సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం అజర్ బైజన్- అర్మేనియా యుద్ధంలో పాల్గొనేందుకు కిరాయి మూకలను పాక్, టర్కీలు ఉసిగొల్పిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కశ్మీర్లో ఉగ్రవాదులను రాష్ట్రీయ రైఫిల్స్ ఏరివేయడం.. బీఎస్ఎఫ్ సరిహద్దులను బిగించడంతో పాక్ మూకలకు పాలుపోవడంలేదు.
సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగింత..?
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగించినట్లు గ్రీకు పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్ సిరియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిందని వెల్లడించింది. దీని నాయకుడు అబూ ఎమ్సా ఐదు రోజుల క్రితమే ఆఫ్రిన్లో తన బృంద సభ్యులతో సమావేశమై కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్లు ఈ పత్రిక పేర్కొంది. కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇస్తారని అబు వెల్లడించాడు. కశ్మీర్ కూడా కరభాకు వలే పర్వత ప్రాంతమని పేర్కొన్నాడు. అంతేకాదు.. కశ్మీర్ వెళ్లాలనుకునేవారి పేర్లను టర్కీ అధికారులు నమోదు చేసుకొన్నారని ఆ పత్రిక వెల్లడించింది. ఇలాంటి కార్యక్రమాలనే ఎజాజ్, గెరాబ్లుస్, బప్, అఫ్రిన్,ఇడ్లిబ్ ప్రాంతాల్లో నిర్వహించారని పేర్కొంది. ఈ కథనాన్ని దిల్లీలోని టర్కీ రాయబారి ఓజ్కాన్ ట్రోన్లర్ ఖండించారు. గ్రీకు పత్రిక ఆధార రహిత కథనం ప్రచురించిందని పేర్కొన్నారు.
జైషేకు ‘సరుకు’ పంపిణీ కష్టమైంది..
కశ్మీర్ సరిహద్దులను పూర్తిగా మూసివేయడం.. సరిహద్దు వాణిజ్యాన్ని ఆపివేయడం.. సెన్సర్లు, కెమెరాలు ఇతర నిఘా సాధనాల వినియోగాన్ని బలగాలు గణనీయంగా పెంచాయి. దీంతో పాక్ నుంచి ఆయుధ సరఫరా కష్టంగా మారిపోయింది. ఇటీవల జమ్ము నగ్రోటా టోల్ ప్లాజ వద్ద ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ తర్వాత జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ రవూఫ్ అష్గర్ కశ్మీర్లోని తమ శ్రేణులకు పంపిన ఓ సందేశం బయటకు పొక్కింది. దీనిలో ‘వస్తువులు’ పంపడం కష్టంగా మారింది అని పేర్కొన్నాడు. జైషే చీఫ్ మసూద్ అజర్కు అష్గర్ చిన్నతమ్ముడు. మసూద్ చికిత్స చేయించుకుంటుండటంతో.. ఇప్పుడు జైషేకు అష్గర్ అనధికారిక చీఫ్గా వ్యవహరిస్తున్నాడు.
చైనా డ్రోన్లు వినియోగం..
ఆయుధ రవాణాకు పాక్ డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టింది. చైనాలో తయారైన పెద్ద డ్రోన్లను వినియోగించడం ప్రారంభించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి సంచారం గణనీయంగా పెరిగినట్లు సమాచారం. కశ్మీర్లో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంజాబ్ ప్రాంతంలో జారవిడిచి.. అక్కడి నుంచి కశ్మీర్కు తరలిస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేసే అంశాలను కూడా పాక్ ఐఎస్ఐ ఏప్రిల్లో లష్కరే , జైషే కమాండర్లతో చర్చించింది. అక్టోబర్లో ఇలాంటి డ్రోన్లను భారత్ కూల్చింది.
సొరంగాలు తవ్వుకొని..
నవంబర్ 19న భారత్లో ప్రవేశించిన ఉగ్రవాదులు కంచెను తెంచుకొని రాలేదు. పకడ్బందీగా తవ్విన ఓ 200 మీటర్ల సొరంగంలో నుంచి భారత్లోకి అడుగు పెట్టారు. సరిహద్దుల వెంట సొరంగాలు కొత్తేమీ కాదు. కానీ.. ఇటీవల కాలంలో మాత్రం వీటి వినియోగం పెరిగిపోయింది. ఇటీవల ఎన్కౌంటర్ సమయంలో స్వాధీనం చేసుకొన్న 11 ఏకే7 తుపాకులను ఈ మార్గంలో తరలించారు. దీంతోపాటు ఎటువంటి కవ్వింపు చర్య లేకుండా పాక్ వైపు కాల్పులు మొదలయ్యాయంటే చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నట్లే అన్న విషయం భద్రతా దళాలు గుర్తించాయి. ముజఫరాబాద్లో లష్కరే క్యాంపులు, ఖైబర్ కనుమల్లో హిజ్బుల్ ముజాహుద్దీన్ మూకలకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో మరో ఉగ్రసంస్థ అల్ బదర్ మాత్రం బంగ్లాదేశ్ మార్గంలో భారత్లోకి చొరబడాలనే పన్నాగాలు పన్నుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు