ఆ అణు ప్రమాదం.. కట్టప్ప పనే..!
ఇరాన్ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులైలో మొదట్లో ఇరాన్లోని నాన్తెజ్ అణు భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్కు అంతుచిక్కలేదు.
పేలుళ్లకు వెన్నుపోటే కారణమన్న ఇరాన్
ఇదే తొలిసారి కాదు..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఇరాన్ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులై మొదట్లో ఇరాన్లోని నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రంలో భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజిలు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్కు అంతుచిక్కలేదు. ఒక దశలో ఇజ్రాయిల్కు చెందిన ఎఫ్35 యుద్ధవిమానాలు దాడులు చేశాయని అనుమానించింది. ఈ పేలుళ్లపై దర్యాప్తు చేసిన ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చివరికి ఇది వెన్నుపోటుగా తేల్చాయి. కచ్చితంగా ఇది కంప్యూటర్లను హ్యాక్చేసి చేశారా.. లేక ఎవరైనా కావాలని చేశారా అనేదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. గతంలో కూడా ఈ అణుకేంద్రంపై భారీగా సైబర్ దాడులు జరిగాయి. ఆ దెబ్బకు ఇరాన్ కొన్నేళ్లపాటు కోలుకోలేదు.
నాన్తెజ్ అంత కీలకమైందా..
టెహ్రాన్కు దాదాపు 250 మైళ్ల దూరంలో నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం-238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన యూ-235ను తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజిలు అనే పరికరాలను వాడతారు. ఇలాంటి వేలకొద్దీ సెంట్రిఫ్యూజిలను ఉపయోగించి నెలల కొద్దీ యురేనియంను శుద్ధి చేస్తేకానీ అణుబాంబుకు సరిపడా యురేనియం తయారు కాదు. ఈ సెంట్రిఫ్యూజిలు పనిచేయడానికి ఉపయోగించే కంప్యూటర్లను దెబ్బతీస్తే.. ఆ సెంట్రిఫ్యూజిలు కూడా పనికిరాకుండా పోతాయి. ఇప్పుడు నాన్తెజ్లో ఇరాన్ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజిలను ఉపయోగిస్తోంది. తాజా దాడిలో ఎన్ని దెబ్బతిన్నాయో తెలియరాలేదు.
గతంలో స్టక్స్ నెట్ దెబ్బకు విలవిలా..
గతంలో ఇరాన్ అణుకార్యక్రమాన్ని అమెరికా దెబ్బకొట్టింది. ఇరాన్లోని ‘నాన్తెజ్’ యురేనియం శుద్ధి కేంద్రానికి సామగ్రిని సరఫరా చేసే నాలుగు సంస్థలను అమెరికా ‘స్టక్స్నెట్’ అనే డిజిటల్ ఆయుధంతో లక్ష్యంగా చేసుకొంది. ఆ సంస్థల్లోని ఒక దానికి చెందిన ఉద్యోగి తన పెన్డ్రైవ్ను ‘నాన్తెజ్’ అణుకేంద్రంలోని కంప్యూటర్కు అనుసంధానించాడు. అంతే, దాదాపు 984 ‘గ్యాస్ సెంట్రిఫ్యూజి’లు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా ఇరాన్ ఇప్పటికీ అణుకార్యక్రమంలో పురోగతి సాధించలేని స్థితికి చేరింది. తాజా దాడితో ‘స్టక్స్నెట్’ ఘటన మరోసారి కళ్లముందు మెదిలింది.
‘ఎయిర్గ్యాప్’ను ఛేదించిందెవరు..?
సాధారణంగా ఏ దేశంలోనైనా అత్యంత కీలకమైన విభాగాల్లో పనిచేసే కంప్యూటర్లను హ్యాకర్ల నుంచి కాపాడటానికి ఇంటర్నెట్కు అనుసంధానించరు. ఇలాంటి స్థితిని ‘ఎయిర్ గ్యాప్’ అంటారు. ఈ స్థితిలో ఉన్న కంప్యూటర్లలోకి వైరస్ ప్రొగ్రామ్ను చొప్పించాలంటే ఎవరో ఒకరు ఆ కంప్యూటర్లను ఆపరేట్ చేసి ఉండాలి. స్టక్స్ నెట్ ఘటనలో కూడా ఓ ఉద్యోగి కీలక కంప్యూటర్లకు పెన్డ్రైవ్ అనుసంధానించడంతో వైరస్ వ్యాపించింది. ఈ సారి ఎవరు చేశారో ఇరాన్ గుర్తించలేదు.
గతంలో ఇరాక్లో ‘ఆపరేషన్ ఒపెరా’
ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్ రియాక్టర్ను బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7వ తేదీ ఇజ్రాయెల్కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్ విమానాలు ఆ అణు రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్ ముగిసిపోయింది. ఒక చిన్న ఏమరపాటు అణుకేంద్రాలకు ఎంత ముప్పో ఈ ఘటన చెబుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు