పుర్రెలా కనిపించాలని చెవులు కత్తిరించుకున్నాడు
శరీరం మొత్తం టాటూలు వేసుకోవడం.. విభిన్నంగా ఉండాలనో.. మరింత అందంగా కనిపించాలనో శరీరంలోని అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం విదేశాల్లో సర్వసాధారణమే కానీ.. పైన కనిపిస్తున్న వ్యక్తి చేసిన పని మాత్రం ఎవరూ చేయలేరు.. చేయడానికి
ఇంటర్నెట్ డెస్క్: శరీరం మొత్తం టాటూలు వేసుకోవడం.. విభిన్నంగా ఉండాలనో.. మరింత అందంగా కనిపించాలనో అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకోవడం విదేశాల్లో సర్వసాధారణమే కానీ.. పైన కనిపిస్తున్న వ్యక్తి చేసిన పని మాత్రం ఎవరూ చేయలేరు.. చేయడానికి సహసించరనే చెప్పాలి. ఏం చేశాడంటారా..! తన ముఖం పుర్రెలా కనిపించాలని ఏకంగా తన చెవులను తొలగించుకున్నాడు మరి.
టాటూలు వేయించుకోవడం.. సర్జరీలకు చేయించుకోవడం వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొందరు నమ్ముతారు. అలాంటి వ్యక్తే జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో. గత కొన్నాళ్లుగా సాండ్రో తన శరీరంపై అనేక చోట్ల టాటూలు వేయించుకున్నాడు. అయితే కొన్నాళ్ల కిందట అతడి ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలనుకున్నాడట. ఈ క్రమంలో చెంపలపై పుర్రె దవడల్లా టాటూలు వేయించుకున్నాడు. కరోనా రాకముందు రూ. 5లక్షల వరకు ఖర్చు చేసి తన రెండు చెవులను తొలగించుకున్నాడు. వాటిని ఓ జార్లో భద్రపర్చి ఇంట్లో పెట్టుకున్నాడు.
ప్రస్తుతం చెవులు లేకుండా సాండ్రో ముఖం కాస్త భయంకరంగా ఉన్నా.. సోషల్మీడియాలో అతడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు తనని విచిత్ర వ్యాధితో బాధపడుతున్న వాడిలా భావిస్తున్నా అవన్నీ పట్టించుకోనని అంటున్నాడు. తన ముఖాన్ని చూస్తే తనకు ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉంటుందని, మరో శస్త్రచికిత్స చేయించుకొని ముక్కును కూడా తొలగించుకుంటానని వెల్లడించాడు. పుర్రెలా కనిపించడం కోసం ఏదైనా చేస్తానని అంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం