కరోనా వారికి ఉపాధి కల్పించింది
కరోనా సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. కానీ, బిహార్లోని రంతి గ్రామస్థులకు మాత్రం ఇది ఓ చక్కని ఉపాధిని కల్పించింది. అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కరోనా విపత్తు సమయంలోనూ ఆ కుటుంబాలన్నీ సంతోషంగా...
పట్నా: కరోనా సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. కానీ, బిహార్లోని రంతి గ్రామస్థులకు మాత్రం ఇది ఓ చక్కని ఉపాధిని కల్పించింది. అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కరోనా విపత్తు సమయంలోనూ ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. కారణమేంటో తెలుసా?
రంతి.. మధుబాణి కళలకు ప్రసిద్ధి. ఇక్కడ చాలా మంది వస్త్రాలపై అల్లికలు వేస్తూ జీవనం సాగిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావం వీరిపైనా పడింది. ఆర్డర్లు లేకపోవడంతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు చాలా అవస్థలు పడ్డారు. అయితే వీరు కల్పోయిన ఉపాధి మరో రూపంలో వెతుక్కొచ్చింది. అదే మాస్క్. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించడం తప్పని సరైపోయింది. ప్రతి ఒక్కరు రెండు మూడు తమ వద్దే ఉంచుకొని, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు. తొలినాళ్లలో సర్జికల్ మాస్కులు, ఎన్95 మాస్కులు ధరించేవాళ్లు. క్రమేపీ కాటన్తో చేసిన మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి. చాలా మంది వాటినే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వాటిలో కాస్తా వైవిధ్యంగా ఉండేవాటికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఆ ప్రాధాన్యతే ఆ గ్రామస్థుల పాలిట వరంగా మారింది. మాస్కులపై చిన్నగా అల్లికలు, పెయింట్స్ వేసి దగ్గర్లోని పట్టణంలో అమ్మడం మొదలు పెట్టారు. విపరీతమైన గిరాకీ వచ్చింది. దీంతో దగ్గర్లోని వ్యాపారస్థులు వాళ్ల దగ్గర నుంచి హోల్సేల్గా కొనడం ప్రారంభించారు. దీంతో వారందరికీ చేతినిండా పని దొరికినట్లయింది. స్థానిక దస్త్కారి చేనేత పరిశ్రమ మరింత ముందుకొచ్చి వీటికి ప్రచారం కల్పించడం కోసం ప్రముఖ ఆర్టిస్టులు తయారు చేసిన మాస్కుల చిత్రాలతో ఓ కెటలాగ్ తయారు చేయించింది. అంతేకాకుండా ఆయా పెయింటింగ్స్లో ప్రావీణ్యులైన వారితో ప్రత్యేకంగా మాస్కులు తయారు చేయించి అమ్మడం ప్రారంభించింది. అక్కడి నుంచి క్రమంగా ఈ మాస్కులు ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి.
ఆయుర్వేద లక్షణాలతో మాస్కులు
కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పట్లో తగ్గే సూచనలు ఎలాగూ కనిపించడం లేదు. భవిష్యత్లోనూ మాస్కు వాడకం తప్పదేమో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్లోని మరికొన్ని టెక్స్టైల్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా ఆయుర్వేద లక్షణాలతో మాస్కులు తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎర్ర చందనం, తులసి కలబంద, నిమ్మ తదితర 108 ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మిశ్రమంలో ఈ కాటన్ వస్త్రాన్ని డైయింగ్ చేసి దానితో మాస్కులు తయారు చేస్తారు. దీనివల్ల ఆ వస్త్రం నుంచి సువాసన రావడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నెయిర్ టెక్స్టైల్ నిర్వాహకుడు శ్రీవాత్సవ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.