చీకట్లో వెలుగై..!
పుట్టుకతోనే అంధుడు కానీ, సంకల్పం ముందు అంధత్వం ఓడి ఐఏఎస్ అయినవారొకరు..చూపులేకపోయినా ఇతరుల చూపును ఆకర్శిస్తూ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా గుర్తింపు పొందినవారు మరొకరు..
చిత్రాలు: వారి ఫేస్బుక్ అధికారిక ఖాతా నుంచి..
పుట్టుకతోనే అంధుడు కానీ, సంకల్పం ముందు అంధత్వం ఓడి ఐఏఎస్ అయినవారొకరు..
చూపులేకపోయినా ఇతరుల చూపును ఆకర్శిస్తూ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా గుర్తింపు పొందినవారు మరొకరు..
కనిపించకపోయినా తన ఆలోచనా పరిజ్ఞానంతో ప్రముఖ కంపెనీకి సీఈఓ బాధ్యతలు చేపట్టినవారు ఇంకొకరు. ..ఇలా ఆలోచనలకు అంధత్వం అడ్డు రాదని నిరూపించిన వారు ఎందరో.. తమ ఆలోచనలకు కార్యరూపం దాల్చి నిలిచి గెలిచినవారెందరో.. చేయాల్సింది ప్రయత్నం మాత్రమే.. అలా ప్రయత్నంతో మొదలెట్టి ఇప్పుడు ఎంతో మంది చూపులేనివారికి వెలుగై నిలిచింది బెంగళూరుకు చెందిన మధు సింఘాల్. చూపులేని వారు పడే ఇబ్బందులు తనకు బాగా తెలుసు. ఎందుకంటే తనూ అంధురాలే. కళ్లులేవనే కారణంతో చదువు, ఉద్యోగం, ఉపాధి ఇలా అన్నీ కోల్పోయి ఇంటికే పరిమితమవుతున్న వారెందరో.. వారికి వారిలోని సామర్థ్యాన్ని గుర్తు చేసి, జీవితంలో ఎదిగేందుకు చూపు అక్కర్లేదు, సాధించాలనే దృఢమైన సంకల్పం ఉంటే చాలు వ్యక్తిగతంగా ఎదగొచ్చు, అవకాశాలు సృష్టించుకోవచ్చు. అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే తన పని. అందుకే మిత్ర జ్యోతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. గత 30ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా ఏంతో మంది కళ్లులేనివారికి సంకల్ప బలముందని గుర్తుచేసింది. వారికి తోడై నిలుస్తోంది.
వెలుగునిస్తోంది..
హరియాణాలో జన్మించిన మధు క్లాసికల్ మ్యూజిక్లో ఉన్నత విద్యని అభ్యసించింది. సంగీతంలో అధ్యాపకురాలిగా స్థిరపడాలనుకుంది. కానీ తనలా చూపులేని వారికి తను చేయాల్సింది ఎంతో ఉందని విధి ఆమెను బెంగళూరు పంపింది. అక్కడ తన సోదరితో కలిసి అంధులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంది. ఇక ఎలాగైనా చూపులేని తనలాంటి వారికి వెలుగై నిలవాలని నిర్ణయించుకుంది. 90లలో అంధులు చదువుకోవడం అంటే అంత సులభం కాదు. వారికంటూ ప్రత్యేక పుస్తకాలూ ఉండేవికావు. పాఠశాలల్లోనూ బ్రెయిలీ లిపికి అంతగా ప్రాముఖ్యం ఉండకపోయేది. ఈ ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసిన వారెందరో.. కాస్తో కూస్తో ఆసక్తి కొద్ది చదువుకున్న వారికి ఒక్క టెలిఫోన్ ఆపరేటర్ తప్ప ఏ ఉద్యోగమూ లభించేది కాదు. మరి దీనికి పరిష్కారం..? అది కనుగొనే వేటలో పడింది మధు. ఫలితం మిత్ర జ్యోతి. ఈ సంస్థ ద్వారా దృష్టి లోపం ఉన్న ఎంతో మందికి చదువు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పిస్తొంది.
ప్రారంభం ఇలా..
మొదట్లో మిత్రుల సహాయంతో ఓ చిన్న గ్యారేజీని సంస్థకి వేదికగా మార్చుకుని కొంత మందితో కలిసి ఓ పెద్ద టేప్రికార్డర్ సహాయంతో ఆడియో పాఠ్యాంశాలను రికార్డు చేసింది. అవసరమున్న వారికి ఆ ఆడియో క్యాసెట్లను ఇచ్చేవారు. కొంత కాలానికి సీడీల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. తదుపరి టెక్నాలజీ అభివృద్ధితో రికార్డింగ్ డివైజ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాఠ్యాంశాలు, ఇతర పుస్తకాలను ఆడియోలుగా మార్చి అందుబాటులో ఉంచుతున్నారు. అలా చిన్న గ్యారేజీగా ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు అధునాతన గ్రంథాలయంగా మారింది.
అందుబాటులో ఇవి..
కేవలం చదువే కాదు, అంధులకోసం అనేక కార్యక్రమాలు నడుపుతోంది మధు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విభిన్న రంగాల్లో శిక్షణనిస్తోంది. దేశవిదేశాలనుంచి అనేక మంది చూపులేని వారు శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. విద్యా వనరుల కేంద్రాన్ని స్థాపించి దీని ద్వారా బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసిన పుస్తక గ్రంథాలయం, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నవలలు, పత్రికలు వివిధ భాషల్లో ఆడియోల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకు చాలా మంది వాలంటీర్లు తమ స్వరాన్నిచ్చి పుస్తకాలను రికార్డు చేస్తున్నారు. ఈ మధ్యే డిజిటల్ రంగంలోకీ అడుగుపెట్టింది తన సంస్థ. ఇక పోటీ పరీక్షలు, ఇతర ఉద్యోగాలకు ఇతరులతో పోటీ పడాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిదే. అందుకే కంప్యూటర్ పరిజ్ఞానంలోనూ శిక్షణనిచ్చేలా కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చూపులేని వారు తమ కాళ్లపై తాము నిలబడేలా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు స్వతంత్ర జీవన నైపుణ్యాల శిక్షణా కేంద్రం, మహిళల కోసం మహిళా సాధికారత కేంద్రాన్ని స్థాపించి విద్యా, వసతి అందిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడంలో దాతల సహాయం మరవలేనంటారు మధు.
ఉద్యోగ కల్పన
కేవలం శిక్షణ మాత్రమే కాదు. చూపులేని వారికి ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. ఏయే రంగాల్లో అవకాశాలున్నాయి. వారి అర్హతలు, వారి ఆసక్తికి తగిన ఉద్యోగాలను కల్పించేలా ప్లేస్మెంట్ సెల్ని ఏర్పాటు చేశారు. టీసీఎస్, ఐబీఎం, సిస్కో వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలూ వీరికోసం నియామకాలు చేపడతాయి. ఇప్పటికీ వేయి మందికి పైగా ఈ ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఉద్యోగాలు దక్కించుకున్నారు.
లాక్డౌన్ కాలంలోనూ..
లాక్డౌన్తో అన్ని సంస్థల వలే మూడునెలలు మిత్రజ్యోతినీ మూసివేయాల్సి వచ్చింది. కానీ వారి సేవలను మాత్రం అలాగే కొనసాగించారు. గ్రామీణ ప్రాంతంలోని చూపులేనివారికి రేషన్, ఇతర అత్యవసర వస్తువులు, చదువుకునేందుకు డిజిటల్ పుస్తకాలు, సీడీలు అందించారు. ప్రస్తుతం సంస్థ తెరుచుకున్నా పరిస్థితులు సహకరించపోవడంతో ఈ మెయిల్ ద్వారానే కావాల్సిన సమాచారం, సీడీలు చేరవేస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ