దోమలు కుడుతున్నాయా? అయితే ఇలా చేయండి!
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ నీరు చేరిపోతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా తదితర వ్యాధులు సోకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకుండా కొన్ని రకాల దోమలు కుడితే బొబ్బలు కట్టి విపరీతమైన మంట పుడుతుంది...
దోమల నివారణకు పంచసూత్రాలు
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ నీరు చేరిపోతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా తదితర వ్యాధులు సోకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకుండా కొన్ని రకాల దోమలు కుడితే బొబ్బలు కట్టి విపరీతమైన మంట పుడుతుంది. దోమల నుంచి రక్షణ పొందడానికి మార్కెట్లో రకరకాల మందులు లభ్యమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ మించి మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలతోనే దోమల నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా?
1. కర్పూరంతో పరార్
సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడతారు. కానీ, ఓ చిన్నప్లేటులో కర్పూరాన్ని తీసుకొని, మూసిఉన్న గదిలో కనీసం 30 నిమిషాలపాటు ఉంచినట్లయితే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయట.
2. వెల్లుల్లి వాసనకు ఇంటి బయటే
అందరి వంటింట్లో వెల్లుల్లి కనిపిస్తుంది. వీటిలో దోమలను నివారించే చాలా ఔషధగుణాలున్నాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ ద్రావణాన్ని ఇంట్లో పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అయితే ఆ ద్రావణం గాఢత కొద్దిసేపట్లోనే పోతుంది కాబట్టి.. మనం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు.
3. కాఫీ పౌడరుతో కనిపించకుండా పోతాయ్
తెల్లారితే కాఫీ తాగనిదే కొందరికి రోజు ప్రారంభం కాదు. దాదాపు అన్ని ఇళ్లల్లోనూ కాఫీ పౌడరు ఉంటుంది. దీనికి కూడా దోమల్ని తరిమే చేసే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నిలకడగా ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. మీ పరిసరాల్లో నీరు నిలిచిపోయినట్లయితే అందులో కొంత కాఫీ పౌడర్ చల్లండి. దీనివల్ల దోమ లార్వాలు చనిపోతాయి.
4.లావెండర్ నూనెతో దరిచేరవు
లావెండర్ నూనె వాసనను దోమలు భరించలేవు.అందువల్ల దీనిని దోమల నుంచి రక్షణగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనూ, పరిసర ప్రాంతాల్లో లావెండర్ నూనెను పిచికారీ చేస్తే దోమలు దరి చేరవు. అవసరమైతే కొద్ది మొత్తంలో నూనెను చర్మానికి కూడా రాసుకోవచ్చు. కాకపోతే, ఆ వాసన భరించగలగాలి.
5.పుదీనాతో పరార్
పుదీనా..వంటల్లో సువాసన కోసం ఎక్కువగా వాడతాం. పుదీనా పచ్చడి కూడా ఎంతో ఆరోగ్యకరం. ఎన్నో ఔషధ గుణాలు దీని సొంతం. ఈ ఆకులంటే దోమలు ఆమడ దూరం ఎగిరిపోతాయి. దీనిలోని ఔషధగుణాలు పరిసరాల్లో ఉండే దోమలను నివారిస్తాయి. ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకుల్నిగానీ, లేదా పుదీనా ఆయిల్ను ఉంచినట్లయితే.. దాని నుంచి వెలువడే పరిమళం వల్ల దోమలు దరి చేరవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు