పాయే.. మళ్లీ పాక్ పరువు పాయే..!
అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పాలంటే గుండెలు తీసిన బంటై ఉండాలి.. పాకిస్థాన్ అటువంటిదే.. ఐక్యరాజ్యసమితిలో నిస్సిగ్గుగా అసత్యాలు పలికిన ఘనత
ఐరాసలో అబద్ధాలతో ఇరకాటం
‘అక్రమ్’ను నమ్ముకుంటే ఇంతే..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పాలంటే గుండెలు తీసిన బంటై ఉండాలి.. పాకిస్థాన్ అటువంటిదే.. ఐక్యరాజ్యసమితిలో నిస్సిగ్గుగా అసత్యాలు పలికిన ఘనత ఆ దేశానికి ఉంది.. ఈ క్రమంలో అవసరమైతే అక్కడి పాక్ ప్రతినిధులు కన్నీరు పెట్టుకొని కూడా డ్రామాను రక్తికట్టించిన సంఘటనలున్నాయి. తాజాగా అటువంటి ఘటనే చోటు చేసుకొంది.
అసలేం జరిగింది..?
ఐరాసలో పాక్ దౌత్యవేత్త అయిన మునీర్ అక్రమ్ ఈ నెల 24న ఓ ట్వీట్ చేశాడు. ‘ఉగ్రవాదం కారణంగా అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు’ అనే నివేదికపై పాక్ ప్రతినిధి భద్రతా మండలిలో ఓ ప్రకటన చేశారన్నది దాని సారాంశం. ఈ ట్వీట్కు నాలుగు ప్రకటన కాపీలను కూడా జత చేశారు. ఉగ్రవాదం ముప్పుపై పాక్ ప్రకటన..? ఆశ్చర్యపోకండి. పాక్ ప్రతినిధి ఆ ప్రకటనే చేయలేదు. ఈ విషయాన్ని ఐరాసలోని భారత దౌత్యబృందం ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. వీటిల్లో పాకిస్థాన్ లేదు. భారత్ ఉంది. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతను ఇండోనేషియా చూసుకుంటోంది. పాక్ భద్రతా మండలిలో సభ్యదేశం కాదు. చర్చ జరిగిన రోజు సభ్యులు కాని వారికి ఆహ్వానం కూడా లేదు. ఆ రోజు మాట్లాడే దేశాల జాబితాలో పాకిస్థాన్ లేదు. ఈ విషయాన్నే భారత బృందం మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఐదు భాగాలుగా పాక్ అబద్ధాలను ఎండగట్టింది.
పాక్ ప్రకటనలో అబద్ధాలు..
మొదటి అబద్ధం : ‘‘మేము సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా లక్ష్యంగా మారాం’’ ఇది పాక్ కొన్నేళ్లుగా వల్లె వేస్తున్న పచ్చి అబద్ధం. భారత్.. పాక్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పేందుకు ఆడే నాటకం. ఐరాస ఆంక్షల జాబితాలోని అత్యధిక మంది ఉగ్రవాదులు పాక్లోనే ఉంటారు. పాక్ ప్రధానే స్వయంగా ఐరాస వేదికపై తమ దేశంలో దాదాపు 50వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని అంగీకరించారు.
రెండో అబద్ధం: అల్ఖైదాను తమ ప్రాంతంలో లేకుండానే చేశామని పాక్ చెప్పింది. అసలు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా బలగాలు చంపిందే పాక్ గడ్డపైన. లాడెన్ అక్కడ కొన్నేళ్ల బట్టి ఉన్నా పాక్ బయట ప్రపంచానికి తెలియనీయలేదు. పైగా లాడెన్ను పాక్ ప్రధాని అమరవీరునిగా అభివర్ణించాడు.
మూడో అబద్ధం: భారత్ ఉగ్రవాదులును ప్రోత్సహించి పాక్లోకి చొప్పిస్తోందని ఆరోపించింది. ఇందుకు కిరాయి మూకను ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి సీమాంతర ఉగ్రవాదానికి పాక్ పెట్టింది పేరు. ఇరాన్, అఫ్గాన్, భారత్లోకి కిరాయి మూకలను పంపిన చరిత్ర పాకిస్థాన్కు ఉంది. ఒక రకంగా పాక్ ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం బాధపడుతోంది.
నాలుగో అబద్ధం: ఐరాస 1267 ఆంక్షల జాబితాలో భారతీయులు ఉన్నారని పాక్ పేర్కొంది. నిజానికి 1267 ఆంక్షల జాబితా అనేది అందరికి అందుబాటులో ఉండే పత్రం. దీనిలో భారతీయులు ఎవరూ ఉండరు. దీనిని ఆధారాలను చూసి ఐరాస తయారు చేస్తుంది. అంతేకాగానీ కేవలం ఆరోపణల ఆధారంగా కాదు.
ఐదో అబద్ధం: భారత్ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకొంది. మైనార్టీల భద్రతపై మొసలి కన్నీరు కార్చింది. అసలు పాక్లోనే మైనార్టీల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1947తో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ మిగిలిన మూడు శాతం అనేది చాలా తక్కువ. భారత్లో పరిస్థితి భిన్నంగా ఉంది.
గతంలో తప్పుడు ఫొటోలతో ఆరోపణలు
గతంలో మలీహా లోధీ ఐరాసలో పాక్ ప్రతినిధిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి అబద్ధాలే చెప్పారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల్లో గాయపడ్డవారి ఫొటోలను కశ్మీరీ బాలికగా చూపే యత్నం చేశారు. అప్పట్లో కూడా భారత దౌత్య బృందం దీనిని సమర్థంగా తిప్పికొట్టింది.
ఉగ్రవాదానికి మద్దతుదారుడు ఈ అక్రమ్
ప్రస్తుతం అబద్ధాలు వల్లేవేసిన పాక్ రాయబారి మునీర్ అక్రమ్కు క్రిమినల్ చరిత్ర కూడా ఉంది. మునీర్ గతంలో 2003 నుంచి 2008 వరకు ఐరాసలో పాక్ రాయబారిగా పనిచేశారు. అమెరికాలో ఒక మహిళతో సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమే అతడిపై కేసు పెట్టింది. దీంతో దౌత్యవేత్తలకు ఉండే ఇమ్యూనిటీని వాడుకొని అమెరికాలో అరెస్టు నుంచి బయటపడ్డాడు.
* గతంలో కశ్మీర్లో ఉగ్రవాదాన్ని స్వతంత్ర పోరాటంగా పేర్కొన్నాడు.
* రచయిత సల్మాన్ ఖుర్షీద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
* భారత్ ఉగ్రవాదుల మాతృభూమి అంటూ వ్యాఖ్యలు చేశాడు.
* కశ్మీర్ను భారత్లో అఫ్గానిస్థాన్గా వర్ణిస్తూ పాక్ పత్రిక డాన్లో వ్యాసం రాశాడు. హురియత్ స్థానంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకత్వం వహించాలని ఉచిత సలహా ఇచ్చాడు. అప్పట్లో బెనజీర్ భుట్టో హత్యను ఐరాసలో ప్రస్తావించడానికి నిరాకరించాడని అక్రమ్ను నాటి పాక్ అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్దారీ తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. -
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM