మరో మహమ్మారికి నిరోధం: గబ్బిలాల వేట!
గబ్బిలాలను పట్టుకోండి..మరో ప్రపంచ మహమ్మారిని నివారించడంలో సహాయపడండంటూ బ్రెజిల్లో శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక మిషన్ చేపట్టారు.
శాస్త్రవేత్తల ముమ్మర ప్రయోగాలు
రియో డి జనైరో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి గబ్బిలాల నుంచే వచ్చినట్లు భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటివరకు కచ్చితమైన రుజువులు లేనప్పటికీ.. మరో మహమ్మారి సంక్రమణను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఇందుకోసం ‘గబ్బిలాలను పట్టుకోండి..మరో ప్రపంచ మహమ్మారిని నివారించడంలో సహాయపడండంటూ’ ఓ ప్రత్యేక మిషన్ చేపట్టారు. ఫియోక్రూజ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గబ్బిలాలను పట్టుకొని, వాటిపై అధ్యయనం చేసేందుకు వాటికోసం గాలింపు మొదలుపెట్టారు. గబ్బిలాల్లో ఇతర ప్రమాదకర వైరస్లు ఏమైనా ఉన్నాయా? అని కనుగొనే లక్ష్యంతో ప్రారంభించన తాజా అధ్యయనంతో మరో మహమ్మారి విజృంభించకుండా ముందుగానే గుర్తించవచ్చని భావిస్తున్నారు.
విశ్వవ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న విలయం వల్ల ప్రపంచదేశాలు పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఒక్కచోట ఇలాంటి వైరస్ బయటపడితే స్వల్ప కాలంలోనే యావత్ ప్రపంచం మొత్తం సోకుతుందని ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో మానవులలో అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ప్రాణాంతక ఇతర వైరస్లను గుర్తించడం, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే లక్ష్యంతో శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రమాదకర వైరస్లకు కారణమయ్యే గబ్బిలాలపై బ్రెజిల్లో శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
అసాధారణ రోగనిరోధక శక్తి..
‘రహస్యమేమిటంటే.. గబ్బిలాలు అసాధారణ రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. తద్వారా వాటికి ఎగిరే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది’ అని మోంటానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమాలజిస్ట్ రైనా ప్లోరైట్ పేర్కొన్నారు. ఇలా ఎగరడం వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు వాటికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వీటితో పాటు ఆ సమయంలో వాటి జీవక్రియ రేటు కూడా పదహారు రెట్లు పెరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ వ్యాధికారకాల నుంచి గబ్బిలాలకు అదనపు రక్షణ కలిగిస్తాయని రైనా ప్లోరైట్ అభిప్రాయపడ్డారు. ఇలా వాటి రోగనిరోధక శక్తి రహస్యాలు, వాటిలో వైరస్ల నివాసం వంటి అంశాలను మరింత అర్ధం చేసుకునేందుకు తాజా పరిశోధన దోహదం చేస్తుందని కెనడా యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ మెక్మాస్టర్ పేర్కొన్నారు. తద్వారా గబ్బిలాల నుంచి మానవులకు వైరస్ల సంక్రమణ, చికిత్సా విధానాల వ్యూహాల్లోనూ ఈ పరిశోధనా సమాచారం దోహదపడుతుందని తెలిపారు.
వైరస్లపై భారత్లోనూ పరిశోధనలు..
వైరస్లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలు చాలాకాలంగా పరిశోధనలు చేపడుతున్నాయి. అయితే, వీటికి నిధులు కేటాయించడంలో అంతగా శ్రద్ధ చూపకపోవడం, అత్యవసరంగా పరిగణించకపోవడంతో ఇవి మరుగున పడిపోతున్నాయి. భారత్లోనూ దాదాపు 25 వైరస్ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్రం ఓ ప్రణాళికను రూపొందించింది. బయోడైవర్సిటీ హ్యూమన్ వెల్-బీయింగ్ పేరుతో 2018లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రస్తుతం పెండింగ్లో ఉండిపోయింది. అయితే, దీన్ని వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిశోధనలు ముమ్మరంగా కొనసాగించడం వల్ల ప్రమాదకర వైరస్లను ఆదిలోనే గుర్తించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
సంక్రమణ తగ్గించాలంటే..?
గబ్బిలాల నుంచి మానవులకు వైరస్లు సోకుతున్నాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిని చంపే ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే, వీటిపై దాడి చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఒక్కోసారి మనకే ఇబ్బందులు ఎదురౌతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గబ్బిలాలపై అపోహల వల్లే ప్రజలు అలాంటి చర్యలకు పాల్పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో గబ్బిలాలు కూడా కీలకంగా వ్యవహరిస్తాయని స్పష్టంచేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న వంటి మరికొన్ని రకాల పంటలను నాశనం చేసే కీటకాలను తినడానికి అడవిలోని గబ్బిలాలు ఎంతో అవసరమని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీటినుంచి వచ్చే వ్యాధులను నిరోధించడానికి వాటికి మానవులు, పశువులకు వాటితో సంబంధాలను తక్కువగా ఏర్పరచుకోవడమే సరైన విధానమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే, కరోనా వైరస్పై మూలాలపై ఇప్పటికే పరిశోధనలు కొనసాగుతున్నాయి. థాయ్లాండ్లోనూ ఇప్పటికే గబ్బిలాలపై పరిశోధనలు జరుపుతున్నారు. అయితే, కరోనా వైరస్ గబ్బిలాల నుంచి సోకినట్లు ఇంకా రుజువు కానప్పటికీ గబ్బిలాల నుంచి గుర్రాలకు అనంతరం మానవులకు వైరస్ సోకిన దాఖలాలు ఉన్నాయి. 1994 సంవత్సరంలో హండ్రా వైరస్ను తొలిసారిగా గుర్తించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకిన వారిలో దాదాపు 60శాతం మంది ప్రాణాలు కోల్పోగా, వైరస్ బారిన పడ్డ 75శాతం గుర్రాలు కూడా మరణించాయని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.
ఇవీ చదవండి..
గబ్బిలాల కోసం దేశమంతా వేట!
గబ్బిలం గుట్టు విప్పింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్