ఇది గెలిస్తేనే ‘ట్రంప్’లకు ఫ్యూచర్..!
రాజకీయ వారసత్వం మన దగ్గరే కాదు అమెరికాలో కూడా ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఇక్కడ వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు.. అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారు. అంతదేనికి గత
ఇంటర్నెట్డెస్క్: రాజకీయ వారసత్వం మన దగ్గరే కాదు అమెరికాలో కూడా ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఇక్కడ వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు.. అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారు. అంతదేనికి గత ఎన్నికల్లో బిల్ క్లింటన్ వారసురాలిగా హిల్లరీ పోటీపడిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడన్ ముత్తాత ఎడ్వర్డ్ పెన్సిల్వేనియా సెనెట్లో సభ్యుడు. అయనది కూడా డెమొక్రాటిక్ పార్టీనే. అమెరికా రాజకీయాల్లో రూజ్వెల్ట్, కెన్నడీ, బుష్, క్లింటన్ల వారుసులు ఒక వెలుగు వెలిగారు.
కుటుంబమే ట్రంప్ బలం..
ఇప్పుడు ట్రంప్ వంతు వచ్చింది. ట్రంపు వారసులు గత నాలుగేళ్ల నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి తన వారసులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇవాంక ట్రంప్ చాలా చురుగ్గా ఉన్నారు. ఆమె భర్త జరార్డ్ కుష్నెర్ శ్వేత సౌధంలో ట్రంప్కు సీనియర్ సలహాదారుగా చేరారు. ఇక ఇవాంక కూడా అధ్యక్షుడి సలహాదారు హోదాలో తండ్రితోపాటు విదేశీ పర్యటనలకు వెళ్లి.. ప్రపంచ నేతలను కలుసుకొని కీలక చర్చల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్లన్ల విధానమైన ‘అబార్షన్లకు వ్యతిరేకత’ను సమర్థించారు. గతంలో ఆమె వైఖరి దీనికి చాలా భిన్నంగా ఉండేది.
ఇక ట్రంపు కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా ఇటీవల కాలంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో జోబైడెన్ను నేరుగా ఢీకొన్నారు. బైడన్, ఆయన కుమారుడు హంటర్పై అవినీతి ఆరోపణలు చేశారు. వీటికి కొన్ని ఆధారాలను కూడా తీసుకొచ్చారు. అసలు ప్రచారం మొదటి నుంచి చివరి వరకూ తానే బరిలో నిలిచానా అన్నట్లు జూనియర్ ట్రంప్ ప్రచారం సాగింది. ట్రంప్ వలే సోషల్ మీడియాలో ఈయన చాలా చురుగ్గా ఉన్నారు. ఇక జూనియర్ ట్రంప్ స్నేహితురాలు కింబర్లీ గ్యూఫాయిల్ అధ్యక్షుడి ప్రచారం బృందంలో కీలక వ్యక్తి. ప్రచారానికి అవసరమైన నిధుల సమీకరణలో ఆమెది కీలక పాత్ర.
మరో కుమారుడు ఎరిక్.. ‘ట్రంప్ ఆర్గనైజేషన్’పై వచ్చిన ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొనే బాధ్యతను తీసుకొన్నారు. అదే సమయంలో ఆయన భార్య లారా ట్రంప్ అధ్యక్షుడి ప్రచార బృందం అధికార ప్రతినిధిగా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఏదో ఒక రోజు ఈమె అధ్యక్ష పదవి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇవాంక, జరార్డ్లకు ప్రపంచ స్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ను గుర్తిస్తూ పలు అరబ్ డీల్స్ చేసుకోవడంలో జరార్డ్ పాత్ర కీలకం. ఆయనకు సౌదీ రాకుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ అత్యంత సన్నిహితుడు.
ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీ (రిపబ్లికన్ పార్టీ)పై పట్టు పెరిగిపోతుంది. ట్రంప్ కూడా ఒక సందర్భంలో ఇవాంకను అధ్యక్ష పదవిలో చూడాలన్న కోరికను వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఇవాంక, డొనాల్డ్ జూనియర్లలో ఎవరోఒకరు పోటీ పడవచ్చని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ట్రంప్ ఓడిపోయినా.. ఇప్పటికిప్పుడు ఆయనకు రిపబ్లికన్ పార్టీలో వచ్చే ముప్పేమీ లేదు. మరికొంతకాలం పార్టీకి పెద్దదిక్కుగా ఆయనే ఉండే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ వారసుల రాజకీయ జీవితం నల్లేరుమీద నడక కాబోదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్