చైనా ఆశలు రెండుగంటల్లోనే ఫసక్..!
‘మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. అప్పుడు భారత్ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..’ ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్..
మిలమిలలాడే రాకెట్ లాంఛర్లతో డ్రాగన్ మూకకు స్వాగతం
మెరుపు వేగంతో శిఖరాలు స్వాధీనం చేసుకొన్న భారత దళాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. అప్పుడు భారత్ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..’ ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్.. ఆ రోజు రాత్రి మాల్డో-రజాంగ్లాకు అవసరమైన సరంజామాతో శిబిరం నుంచి బయల్దేరిన చైనా దళాలకు గట్టి షాక్ తగిలింది. మిలమిలలాడే రాకెట్ లాంఛర్లతో భారత దళాలు కనిపించాయి. ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా భారత్ బెదరకపోవడంతో హెచ్చరికగా కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. గల్వాన్ వద్ద భారత్ చేసిన ప్రతిదాడి గుర్తొచ్చిందో ఏమో చైనా దళాలు కాళ్లీడ్చుకొంటూ తిరిగి తమ స్థావరానికి చేరుకొన్నాయి.. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కేవలం 120 నిమిషాల్లో ముగించింది.
ఆలోచనా తీరు మారడంతో...
గల్వాన్ ఘటనకు ముందు భారత్ దళాలు కొంత ఆత్మరక్షణ శైలిని అనుసరించేవి. 1962 యుద్ధం తర్వాత భారత్ అనుసరించే ఈ శైలిని చైనా వాడుకొంది. తరచూ మన భూభాగాలను చిన్నచిన్న ముక్కలుగా ఆక్రమించడం మొదలుపెట్టింది. గల్వాన్ ఘటన తర్వాత జులై 3న ప్రధాని మోదీ లద్దాక్లో పర్యటించారు. ఈ సందర్భంగా నార్తన్ కమాండర్ వైకే జోషీ, 14 క్రాప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ దశలో ప్రధాని ‘చైనా ఏం చేసింది.. ఏం చేయబోతోందో నాకు అనవసరం.. మీరు ఏం చేశారు.. ఏం చేయబోతున్నారనే దానిపైనే నాకు ఆసక్తి’ అని తేల్చిచెప్పారు. అనంతరం మోదీ 17 క్రాప్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్మీలో మౌంటేన్ స్ట్రైక్ గ్రూప్ ఇదొక్కటే. చైనాతో డీల్ చేయడానికి దీనిని అక్కడకు తరలించారు.
మోదీ పర్యటన ఓ రకంగా భద్రతా దళాలకు స్వేచ్ఛనిచ్చింది. అప్పటి నుంచి వ్యూహం మారిపోయింది. చైనా ఆధీనంలోని భూభాగాన్ని విడిపించాలంటే.. చైనాకు కీలకమైన చోట మనం పట్టుబిగించాలని నిర్ణయించారు. చైనాకు కీలకమై పర్వత శిఖరాలను భారత్ ఆధీనంలోకి తీసుకురావాలనుకున్నారు. దీనికి తోడు ఆర్మీచీఫ్ ముకుంద్ నరవాణేకు గతంలో చైనాతో డీల్ చేసి అనుభవం ఉంది. అది భారత్ వ్యూహాలకు బాగా ఉపయోగపడింది. మన దళాలు నిశ్శబ్ధంగా ఓ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇది కేవలం అత్యున్నత స్థాయిలోని వారికి మాత్రమే తెలుసు. ఆ ఆపరేషన్లో పాల్గొనే దళాలకు కూడా ఏం చేయబోతున్నారో తెలియదు. మెల్లగా ఎల్ఏసీ వెంట భారత్ అదనపు బలగాలను తరలించడం మొదలుపెట్టింది. మరోపక్క భారత నావికాదళం మలక్కా జలసంధికి వెళ్లే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేసింది. అప్పటికే ఉన్న మౌంటేన్ స్ట్రైక్ డివిజన్కు అదనంగా మరింత మంది పర్వతయోధులను రంగంలోకి దించింది. వీరందరినీ ఆపరేషన్కు సిద్ధం చేసే బాధ్యతను జీవోసీ 17 క్రాప్స్ లెఫ్టినెంట్ జనరల్ సవ్నీత్ సింగ్కు అప్పజెప్పారు. వీరే కాదు.. వివిధ విభాగాలకు చెందిన దళాలు భారీగా లద్దాక్ చేరడం మొదలైంది.
విఫలమైన కాలయాపన
చర్చలతో కాలయాపన చేయాలని చైనా వ్యూహం పన్నింది. పాంగాంగ్ వద్ద ఫింగర్ 4, 5ను చైనా వీడే విషయమై చాలా రౌండ్లపాటు చర్చలు జరిగినా అవి విఫలం అవుతూ వచ్చాయి. అనుకున్నట్లే జరుగుతుండటంతో చైనా మితిమీరిన ఆత్మవిశ్వాసంలోకి వచ్చింది. కొవిడ్, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న భారత్కు ఈ దళాల మోహరింపు తలకుమించిన భారంగా మారి.. ఇక చేతులు ఎత్తేస్తుందని భావించింది. ఒక్క తూటా కాల్చకుండానే విజయం సాధించొచ్చని అంచనా వేసుకొంది. కానీ, దీనికి భిన్నంగా.. భారత్ కూడా చైనానే బేరానికి వచ్చేట్లు చేయాలని నిర్ణయించింది. అందుకే ఈ సారి సరస్సుకు దక్షిణ ఒడ్డున ఎత్తైన శిఖరాలను లక్ష్యంగా చేసుకొంది.
ఆగస్టులో వేగంగా మార్పులు..
ఆగస్టు నాటికి మౌంటేన్ డిజిన్ జవాన్లు అక్కడి పరిస్థితులకు అలవాటుపడిపోయారు. దీంతోపాటు చైనా కదలికలపై నిఘాపెట్టారు.. వస్తున్న సమాచారం ఆధారంగా ప్రణాళికల్లో మార్పులు చేసుకొన్నారు. ఆగస్టు 24న ఒక ప్లాన్ అమలు చేయడానికి అత్యున్నత నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అదే సమయంలో భారత్ దేనికైనా సిద్ధంగా ఉందని.. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రకటించారు.
మరోపక్క క్షేత్రస్థాయిలోని కంపెనీ కమాండర్లు, ప్లాటూన్ కమాండర్లు తామ ప్లాన్ అమలుకు అవసరమైన మార్గాలను గుర్తించి..వాటికి సమీపంలోనే మోహరించారు. కీలక బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ శిఖరాల స్వాధీనాన్ని కేవలం 120 నిమిషాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పదాతి దళాన్ని చైనా వాయుసేన విమానాలు అడ్డుకొంటే ఎదుర్కొనేందుకు ఇగ్లా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులను సిద్ధం చేశారు. కొన్ని దళాలు పర్వత పాదాల వద్ద హైమొబిలిటీ వాహనాలను సిద్ధంగా ఉంచాయి.
ఉన్నతాధికారుల నుంచి అమలుకు ఆదేశాలు వెలువడగానే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళాలు 120 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కీలకమైన శిఖరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నాయి. అనంతరం దాదాపు 2,000 మందితో కూడిన ఒక సైనిక విభాగం ఆ ప్రదేశానికి చేరుకొన్నాయి. వీరి వద్ద ఫ్రాన్స్ తయారు చేసిన మిలన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, కార్ల గుస్తోవ్ రాకెట్ లాంఛర్లు ఉన్నాయి. ఇవి చైనా వాహనాలను తునాతునకలు చేయగలవు.
అదే సమయంలో మాల్డోలోని స్థావరం నుంచి బయల్దేరిన చైనా దళాలు మార్గం మధ్యలో భారత దళాలను చూసి ఖంగుతిన్నాయి. అయినా ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో భారత్ వైపు నుంచి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో చైనా దళాల భ్రమలు పటాపంచలై వాస్తవాంలోకి వచ్చాయి. వాస్తవానికి డ్రాగన్ బలగాలు మాల్డో నుంచి రజంగ్ లా వరకు చుట్టుపక్కల ప్రాంతాలపై తమ పట్టు పెంచుకోవాలనుకొన్నాయి. ఇది పూర్తిఅయితే స్పంగూర్ వద్ద డ్రాగన్ పట్టు పెరిగిపోతుంది. కానీ, భారత దళాలు పూర్తిస్థాయి ఆయుధాలతో అక్కడ దర్శనమివ్వడంతో తిరిగి మాల్డో స్థావరానికి వెళ్లిపోయాయి. ఫలితంగా దాదాపు యాభైఏళ్ల తర్వాత చైనా నేర్పిన విద్యను భారత దళాలు దానికే రుచి చూపించాయి. ఇప్పుడు చర్చల టేబుల్ వద్ద భారత్ కూడా బలంగా బేరం చేసే అవకాశం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’