ఆటస్థలాల్లో ‘ఆనందం’ సృష్టిస్తోంది!
ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం.. తరగతులు వినాలన్నా, నచ్చింది చదవాలన్నా, ఆటలు ఆడాలన్నా అన్నింటికీ స్మార్ట్ఫోన్ ఉంది. కానీ ఆరు బయట ఆడే ఆటలు చిన్నారులని శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలవంతుల్ని చేస్తాయి. చదువులోనూ చురుకుగా మారుస్తాయి.
చిత్రాలు: ఫేస్బుక్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం.. తరగతులు వినాలన్నా, నచ్చింది చదవాలన్నా, ఆటలు ఆడాలన్నా అన్నింటికీ స్మార్ట్ఫోన్ ఉంది. కానీ ఆరు బయట ఆడే ఆటలు చిన్నారులని శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలవంతుల్ని చేస్తాయి. చదువులోనూ చురుకుగా మారుస్తాయి. అందుకే పిల్లలను ఆడించేందుకు ఏదైనా చేయాలనుకుంది ఓ యువతి. దానికోసం ఆటస్థలాలను నిర్మించింది. అందుకోసం ఏకంగా ఓ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. పనికిరాని వస్తువులను క్రీడా సామగ్రిగా తీర్చిదిద్దుతోంది. ఆమే 29 ఏళ్ల పూజా రాయ్. తనకలాంటి ఆలోచన ఎలా వచ్చింది?క్రీడా వస్తువులను ఎలా తయారు చేస్తుంది?ఇంతకీ ఏంటా సంస్థ? తెలుసుకుందాం.
సంస్థ ఏర్పాటుకు కారణం!
పూజ ఐఐటీ ఖరగ్పూర్లో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసిస్తున్న రోజులవి. అక్కడికి దగ్గరలోనే ఓ పాఠశాల ఉండేది. సుమారు 250మంది చిన్నారులు అందులో చదివేవారు. దగ్గరలో స్థలం ఉన్నా చిన్నారులు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ లేదు. ఎలాగైనా వారికోసం ఓ ఆటస్థలం నిర్మించి, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకుంది. ఆ ఆలోచనను తన మిత్రులతో పంచుకుంది. అందరూ కలిసి ఆట స్థలాన్ని నిర్మించేందుకు పనికిరాని టైర్లు, డ్రమ్లను ఉపయోగించుకున్నారు. వాటిని పునర్నిర్మించి ఆటవస్తువులుగా మార్చి అందంగా తీర్చిదిద్దారు. అలా ఖాళీగా ఉన్న స్థలం కాస్త పిల్లల ఆటస్థలంగా మారిపోయింది. అందులో ఆడుతున్న చిన్నారుల నవ్వుల్ని చూస్తూ మురిసిపోయింది పూజ. అలా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక ఆటస్థలాలను నిర్మించి ఎంతోమంది చిన్నారుల ముఖాలను నవ్వులతో నింపేస్తోంది. అంతేకాదు, ఆటస్థలాలను నిర్మించడమే తన కెరీర్గా మార్చుకుంది. అందుకు ‘ఆంథిల్ క్రియేషన్స్’ అనే సంస్థను స్థాపించింది. ఖరగ్పూర్లో నిర్మించిన ప్లేగ్రౌండ్ వంటిది వేర్వేరు ప్రాంతాల్లోని కాలనీలు, పాఠశాలల్లో నిర్మించమని పిలిచినపుడు దేశవ్యాప్తంగా ఎంత తక్కువ స్థలాలు అందుబాటులో ఉన్నాయో ఆ సంస్థ గ్రహించింది.
పాత టైర్లు, ట్రక్లు చాలు
పాత అరిగిపోయిన టైర్లు ఏం పనికొస్తాయనుకుంటే పొరపాటే. అవి దాదాపు ‘లెగో బ్లాక్స్’ వలే ఉంటాయి. వీటిని సింపుల్గా మీరు కూర్చునే కుర్చీగానూ మార్చేయొచ్చు. ఓ ఆటస్థలాన్ని కట్టేయొచ్చు. అదే చేసిందీ సంస్థ. పాత అరిగిపోయిన ట్రక్ టైర్లను వాడి ఏనుగులు, ఆక్టోపస్, బైక్లు, కొండలు తదితర ఆట వస్తువులను తయారు చేశారు. సుమారు పదేళ్ల వరకూ మన్నికతో ఉంటాయవి. అంతేకాదు, వాటికి నిర్వహణ అవసరం లేదు. మరికొన్ని ఆట వస్తువులను సృష్టించేందుకు ఇనుప చక్రాలను వినియోగించారు. ముందుగా ఆట స్థలంలో ఏ నిర్మాణాలను చేయాలనే దానిపై ప్రేరణ పొందేలా ఈ సంస్థ బృందం అక్కడి పాఠశాల విద్యార్థులతో చర్చించి, వారికి కావాల్సినవేంటో తెలుసుకుంటుంది. దానికనుగుణంగా ఆటస్థలాన్ని తీర్చిదిద్దుతారు. దాంతోపాటు వివిధ వర్క్షాప్లు నిర్వహించి పాడైన టైర్లను తిరిగి ఎలా వినియోగించుకోవచ్చో ప్రజలకి తెలియజేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ..
అలా ఖరగ్పూర్లో మొదటి ఆట స్థలం నిర్మించిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రతో పాటు సుమారు 17కి పైగా రాష్ట్రాల్లో ఆటస్థలాలను నిర్మించారు. తక్కువ ఆదాయ వర్గాలలోని కమ్యూనిటీల్లో ఈ ఆటస్థలాలను నిర్మించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోంది. అందుకు మహీంద్రా వంటి అనేక కార్పొరేట్ సంస్థలతో కలిసి పని చేస్తోంది. టైర్లు, కేబుల్ డ్రమ్లు తదితర వ్యర్థాలను రీసైకిల్ చేసి, ఆట వస్తువులుగా మలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ అక్కడ 100కి పైగా ఆట స్థలాలను ఏర్పాటు చేసింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ నిర్మాణాల్లో అక్కడి పిల్లలు, ప్రజలను భాగస్వాముల్ని చేస్తోంది. దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లోని మురికివాడల్లో నివసించే చిన్నారులకోసం వారికి దగ్గరి ప్రాంతాల్లోనే ఆటస్థలాలను నిర్మించింది. అంతేకాదు, ‘తిండి, గుడ్డతో పాటు ఆటలు పిల్లల హక్కు’ అని నమ్ముతూ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ను కలిసి, రొహింగ్యా శరణార్థుల కోసమూ ఆటస్థలాన్ని నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ కార్యక్రమాల నుంచి నిధులు సమకూరుతుంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచీ నిధులు లభిస్తాయి. కేవలం ఆటస్థలాలు మాత్రమే కాకుండా నగరాలను శుభ్రంగా మార్చేందుకూ కృషి చేస్తుందీ సంస్థ.
లాక్డౌన్ సమయంలోనూ..
అన్నింటిలాగే ఈ సంస్థ కూడా కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడింది. పాఠశాలలు మూసేయడంతో వారి కార్యక్రమాలు ఆగిపోయాయి. లాక్డౌన్తో పిల్లలు ఆటస్థలానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో పిల్లలకు సాయం చేసేందుకు ‘ప్లే ఇన్ ఎ బాక్స్’ను అభివృద్ధి చేసిందీ సంస్థ. ఇది ఆరు విభిన్న అభివృద్ధి అంశాలను లక్ష్యంగా చేసుకుని బొమ్మలు, ఆటలను కలిగి ఉన్న పెట్టె. దీంతో చదువుతోపాటు ఆటలూ ఆడొచ్చు. ఇప్పటికి వేయికి పైగా ఈ పెట్టెలను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి