ఏమవుతుందో ఏమో.. చైనా ఆందోళన..!
త్రీగోర్జెస్ డ్యామ్.. చైనాకు కలికితురాయి..మానవ సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ.. ఇక్కడ యాంగ్జీ నదిలో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. అంతరిక్షం నుంచి సాధారణ
* గుబులు పుట్టిస్తున్న త్రీగోర్జెస్ డ్యామ్
* వరదతో విరుచుకుపడుతున్న యాంగ్జీ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
త్రీగోర్జెస్ డ్యామ్.. చైనాకు కలికితురాయి.. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ.. ఇక్కడ యాంగ్జీ నదిలో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ డ్యామ్లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు.. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరో వైపు చూస్తే వణుకు పుట్టక మానదు. ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు వస్తున్నాయి. ఇక్కడ వరద పెరిగిన సమయంలో దిగువకు విడుదల చేసే నీటి దెబ్బకు లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. భారీగా పంటలు మునిగిపోతున్నాయి. ఒక సారి డ్యామ్ బద్దలై లక్షల మంది మరణించిన చరిత్ర చైనాకు ఉంది.. ఈ సారి అదే పునరావృతం అవుతుందేమోనని ఆందోళన పడుతోంది.
చరిత్రలో ఎన్నడూ లేనంత వరద..
ఏప్రిల్- సెప్టెంబర్ వర్షాకాలం చైనాకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది యాంగ్జీ నది బేసిన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి ఎన్నడూలేనంతగా వరద వస్తోంది. 2003లో ఈ డ్యామ్ పూర్తైన తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో నీరు చేరింది. గురువారం ఉదయం 8గంటల నాటికి సెకన్కు 73,000 క్యూబిక్ మీటర్ల ఇన్ఫ్లో వస్తోంది. ఈ విషయాన్ని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దీని చరిత్రలోనే అత్యధికం. ఈ డ్యామ్పై భాగంలోని మూడు డ్యామ్లు కూడా దీని ఆధీనంలోనే ఉంటాయి. ఇక్కడ వందేళ్లలో ఒక సారి వచ్చే వరదల తీవ్రత ఎంతగా ఉంటుందంటే 244 బిలియన్ క్యూబిక్మీటర్ల నీరు వస్తుంది. ఇది ఇజ్రాయెల్ వద్ద మృత సముద్రంలోని నీటికి రెండింతలు. ఈ వరదలో కేవలం 9 శాతం మాత్రమే ఈ డ్యామ్లో నిల్వ చేయగలరు. అంటే మిగిలిన నీరు రెండు మూడు నెల్లలో కిందకు వదలాల్సిందే..! ఈ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 40 కోట్ల మంది చైనీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ. ఈ నెలలో 9 కోట్ల మంది వరదకు ప్రభావితమయ్యారు. 2.5లక్షల ఎకరాలు నీటమునిగిపోయాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు పలు మార్లు డ్యామ్ గేట్లను ఎత్తారు.. అయినా కానీ, నీటి మట్టం ఏమాత్రం తగ్గడంలేదు. డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది.
లక్షల మంది నిరాశ్రయులు..
గత వారం రోజుల్లో దాదాపు ఇక్కడ వరద బాగా పెరిగిపోయింది. యాంగ్జీ పరివాహక ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న 71 మీటర్ల బుద్ధ విగ్రహం కాళ్లను నది నీళ్లు తాకాయి. 1949 తర్వాత ఈ స్థాయికి నీరు ఎప్పుడూ చేరలేదు. ఇప్పటికే దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి తోడు డ్యామ్ వద్ద భారీగా నీరు నిలవడంతో బ్యాక్ వాటర్ ప్రాంతలు కూడా నీటమునిగాయి.
భూకంపాల హాట్జోన్లో నిర్మాణం..
ఈ డ్యామ్ నిర్మాణంపై మొదటి నుంచి పర్యావరణవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మిస్తున్న ప్రదేశం భూకంపాలకు అత్యంత అనువైంది. ఇక్కడ 2003 నుంచి ఇప్పటి వరకు 3,429 భూకంపాలు నమోదైనట్లు చైనా భూకంపాల అధ్యయన కేంద్రం పేర్కొంది. మరోపక్క భారీ వరదతోపాటు కొట్టుకొచ్చే బురద వెనుక భాగాన చేరడంతో డ్యామ్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకు డ్యామ్పై అధికారులు 80 భారీ బీటలను కనుగొన్నారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసమే 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేల మట్టం చేసింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించారు. ఇంత చేసినా డ్యామ్ అనుకున్న స్థాయి ఫలితాలు చైనాకు ఇవ్వడంలేదు. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్కు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు. ఇంత పెద్ద డ్యామ్ నిర్మించినా చైనా దాహం తీరలేదు. 2019 నాటికి 23,841 డ్యామ్లు చైనాలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వాటిల్లో 41శాతానికి ఇది సమానం. వీటిల్లో అత్యధికంగా 2,000 సంవత్సరం తర్వాత నిర్మించినవే.
గతంలో డ్యామ్ ప్రమాదాలు..
చైనాలో డ్యామ్లు కుప్పకూలడం కొత్తేమీ కాదు. ఇక్కడ 1975 ఆగస్టులో యల్లో నదిపై బాన్క్యో డ్యామ్ కుప్పకూలింది. వాస్తవానికి ఈ డ్యామ్ ఎత్తును ఇష్టానుసారం పెంచడమే ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో లక్షల మంది మరణించినట్లు చెబుతారు. అనధికారిక లెక్కల ప్రకారం మృతల సంఖ్య 2.4లక్షలు. చైనా అంకెలు మాత్రం వేలల్లోనే ఉంటాయి. ఈ డ్యామ్ కూలడంతో చరిత్రలోనే మూడో అతిపెద్ద వరదలు సంభవించాయి. 30 నగరాల్లోనే 1.15 కోట్ల మంది దీని దెబ్బకు నిరాశ్రయులయ్యారు. 12వేల చదరపు కిలోమీటర్లు నీటమునిగాయి.
త్రీగోర్జెస్ డ్యామ్ ప్రారంభించిన ఏడాదే కొండచరియలు విరిగి పడి 24 మంది మరణించారు. ఇప్పుడు వరదలు ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో వస్తున్నాయి. ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు తలెత్తినా చైనాలో జలప్రళయం తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్