కిమ్ మిస్టరీ.. మంచికా.. చెడుకా!
కిమ్ జోంగ్ ఉన్.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. గరమ్ మసాలా.. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలో పత్రికల పతాకశీర్షికల్లో కూడా కిమ్ తరచూ వస్తుంటారు. ఈ యువ నియంత ఉక్కు పిడికిలిలో
* అణ్వాయుధాల భద్రతపై ఆందోళన
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కిమ్ జోంగ్ ఉన్.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. సంచలనమే. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలోని పత్రికల పతాక శీర్షికల్లో కూడా కిమ్ తరచూ వస్తుంటారు. ఈ యువ నియంత ఉక్కు పిడికిలిలో ఉ.కొరియా విలవిల్లాడిపోతోంది. తాజాగా ఆయన ఏం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ఆయన కొన్నాళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించడం మానేశారు. దీంతో కిమ్ కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. ఆయన సోదరి కిమ్ యో జోంగ్ మెల్లిగా అధికార దండాన్ని అందుకొంటున్నారు. ఇటీవల ఉ.కొరియాకు చెందిన విదేశీ వ్యవహారాలను చూసేందుకు ఆమెను నియమించారు. దీంతో అమెరికా, దక్షిణకొరియాతో నేరుగా ఆమే డీల్ చేయనుంది. ఇది ఇటీవల ప్రకటించారు కానీ.. గత కొన్ని నెలలుగా ఆమే ఈ వ్యవహారాలు చూస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ద.కొరియా నుంచి గాలి బుడగల్లో సందేశాలను ఉ.కొరియాలోకి వదులుతుండటంపై కిమ్ సోదరి మండిపడ్డారు. ‘‘అధినేత, పార్టీ, ప్రభుత్వం నుంచి దఖలుపడ్డ ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను. శత్రుదేశం(దక్షిణ కొరియా)పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల్ని అమలు చేయాలని సదరు విభాగాధిపతికి ఆదేశిలిచ్చాను. దేశ పౌరుల అసంతృప్తిని చల్లార్చేందుకు త్వరలోనే మా సైన్యం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఆ దిశగా నేను ఎటువంటి సంకేతం ఇచ్చినా ఇక తదుపరి నిర్ణయం ఆర్మీ చీఫ్ చేతిలోకి వెళ్లిపోతుంది ’’ అని తన ప్రకటనలో కిమ్ యో జోంగ్ పేర్కొన్నారు. అలాగే, సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన అనుసంధాన కార్యాలయాల్ని మూసివేస్తామని కూడా హెచ్చరించారు. ఈ స్థాయి ఆదేశాలు ఇచ్చారంటే ఆమె చేతిలో అప్పటికే ఎంత అధికారం ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికే కిమ్ ఒక సారి అదృశ్యమై.. మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.
స్థూల కాయంతో అవస్థలు..
కిమ్ జోంగ్ ఉన్ స్థూల కాయం కారణంగా కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్నారు. ఆయనకు మద్యం, సిగరెట్ల అలవాటు ఉంది. గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో శస్త్రచికిత్స చేయించుకొన్నట్లు ఏప్రిల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మే 2న సన్చాన్ ప్రాంతంలో ఎరువుల కంపెనీ ప్రారంభం నిమిత్తం ఆయన ప్రజల ముందుకొచ్చినట్లు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. అప్పట్లో దానికి సంబంధించి చిత్రాలను కూడా విడుదల చేసింది. తాజాగా దక్షణ కొరియా రాజకీయ వ్యవహారాల శాఖలో ఓ మాజీ ఉన్నతాధికారైన చాంగ్ సాంగ్ మిన్ కిమ్ కోమాలో ఉన్నారని బాంబు పేల్చారు. ఇటీవల ప్రజల ముందుకు వచ్చింది కూడా వాస్తవం కాదని.. అవి పాత దృశ్యాలని ఆయన పేర్కొన్నట్లు ‘న్యూయార్క్ పోస్టు’ పత్రిక కథనంలో పేర్కొంది.
అందుకేనా బయట పెట్టంది..?
కిమ్ జోంగ్ ఉన్ వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆయన వారసుల ఎంపిక పూర్తి కాలేదు. నియంతలు కొన్నేళ్ల ముందుగానే తమ వారసులు అధికారంపై పట్టు సాధించేలా చేస్తుంటారు. ఉ.కొరియా 72ఏళ్ల చరిత్రలో కిమ్ తాత కిమ్ జోంగ్ ఇల్ తన వారసుడిగా కిమ్ జోంగ్ ఇల్ -2ను 20 ఏళ్ల ముందే సిద్ధం చేశారు. ఆ తర్వాత 1994లో ఆయన అధికారం చేపట్టారు. తాజాగా కిమ్ కూడా కొన్నేళ్ల ముందు నుంచే అధికారంపై పట్టు సాధించారు. ఆ తర్వాత 2011లో కిమ్ జోంగ్ ఇల్-2 మరణానంతరం అధికారం చేపట్టారు. కానీ, ఇప్పుడు అలా జరగలేదు. కిమ్ ముగ్గురు బిడ్డల్లో ఎవరూ అధికారం చేపట్టే వయసులో లేరు. దీంతో కిమ్ చెల్లి యో జోంగ్కు చేతికి అధికార పగ్గాలు ఒక్కోటిగా చేరుతున్నాయి.
పోటీ వస్తారని చంపి..
కిమ్ తన తండ్రి వైపు నుంచి వారసత్వానికి అవకాశం ఉన్న వారిని.. పోటీపడతారనే అనుమానంతో మొదట్లోనే అంతమొందించారు. వీరిలో ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ చుల్ ఉన్నారు. మలేషియా రాజధానిలోని విమానాశ్రయంలో ప్రాంక్ చేస్తున్నామని.. ఇద్దరు మహిళలకు 90 డాలర్లు ఇస్తామని ఆశచూపి రెండు వేర్వేరు రసాయనాలను చుల్ ముఖంపై ఒకేసారి వేయించారు. ఆ రెండు కలిసి విషపూరితంగా మారి అతడు మరణించాడు. దీనిని ‘బైనరీ ఫామ్’ విధానం అంటారు. ఈ ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది.
ఇక 2013లోనే కిమ్ తన అంకుల్ చాంగ్ సాంగ్ థేక్ను బహిరంగ సమావేశం నుంచి బలవంతంగా అరెస్టు చేయించాడు. థేక్కు సహకరించిన ఇద్దరినీ కూడా ఆయన కళ్ల ముందే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో కాల్చి హతమర్చారు. ఆ తర్వాత చాంగ్ను కిమ్ చంపించి తలను బహిరంగ ప్రదర్శనకు పెట్టారని 2019లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
వారసత్వ పోరు తప్పదా..?
ఒక వేళ కిమ్ వారసత్వం విషయంలో ఆయన సోదరి, మరో అంకుల్ కిమ్ ప్యాంగ్ ఇల్కు మధ్య పోటీ ఉండొచ్చు. కిమ్ ఇప్పటికే సోదరిని ముందుకు తీసుకొచ్చాడు. కానీ, ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్ జోంగ్ ఇల్ సంతానంలో మిగిలింది కిమ్ ప్యాంగ్ ఇల్ -2 మాత్రమే. 40 ఏళ్లపాటు ఆయన వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసి ఇటీవలే ఉ.కొరియాకు తిరిగి వచ్చారు. కిమ్కు సలహాదారుగా ఉన్నారు. వారసత్వ అవకాశం ఆయనకు కూడా ఉంది. కానీ, ఆయన కిమ్ సోదరికి పోటీగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రపంచానికి అణ్వాయుధాలే తలనొప్పి..
కిమ్ వంటి నియంత హఠాత్తుగా చనిపోతే రాజ్యాధికారం కోసం సైనిక తిరుగుబాటులు.. అంతర్యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పురషాధిపత్యం ఉన్న ఉ.కొరియా సమాజంలో కిమ్ సోదరి అధికారం చేపడితే ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకుడు సుమీ టెర్రి వాషింగ్టన్ పోస్టుకు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఆయన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సీనియర్ సీఐఏ విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. ఇదే జరిగితే ఉ.కొరియా వద్ద ఉన్న అణుబాంబులు ప్రమాదకరమైన శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఉ.కొరియాలో భారీ సంఖ్యలో రసాయన, జీవ ఆయుధాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి రాజకీయ అస్థిరత ప్రపంచానికి పెనుప్రమాదమే తెచ్చిపెడుతుంది. అక్కడి నుంచి ఆ పోరు ఎటువంటి రూపైనా తీసుకోవచ్చు. ఈ క్రమంలో అగ్రదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికైతే కిమ్ సోదరి రాజకీయంగా క్రమంగా శక్తిమంతురాలిగా మారుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!