మెదడును చదివే పరికరం వచ్చేసింది!
శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్లో ఓ కంప్యూటర్ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు...
ఇంటర్నెట్డెస్క్: శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్లో ఓ కంప్యూటర్ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇలా అన్ని అవయవాల పని తీరును నిర్ధిష్టంగా అంచనా వేయవచ్చు. కానీ, మానవ మెదడు ఎలా పని చేస్తుంది? ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాడీ కణాలు ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అది కూడా సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘కెర్నల్’ అనే అంకుర సంస్థ దీని కోసం ప్రత్యేకంగా హెల్మెట్ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే వీలుంటుంది.
అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ తాజాగా తాము రూపొందించిన హెల్మెట్లను పదుల సంఖ్యలో మార్కెట్లోకి తీసుకురానుంది.వీటి విలువ 50 వేల డాలర్లు. అయితే మెదడును చదివే టెక్నాలజీ ఇప్పటికే కొంతవరకు అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో మెదడును పని తీరును తెలుసుకునే ఎలక్ట్రానిక్ యంత్రాలు భారీ పరిమాణంలో పెద్ద మొత్తంలో స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంతేకాకుండా ఎవరి మెదడును పరీక్షించాలనుకున్నారో ఆ వ్యక్తి ఆ గదిలోనే ఉండాల్సి ఉంటుంది. కానీ, అభివృద్ధి చేసిన పరికరం మాత్రం హెల్మెట్ పరిమాణంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడకు కావాలంటే అక్కడికి దీనిని తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది.
కెర్నల్ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. 1. ఫ్లో 2. ఫ్లక్స్. ఫ్లో - బ్రెయిన్ ఇంటర్ఫేస్ ద్వారా మెదడు రియల్ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాలను కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది. హెల్మెట్కు అమర్చిన యూఎస్బీ కేబుల్ ద్వారా కంప్యూటర్కు కనెక్ట్ చేసినట్లయితే మెదడు పని తీరును తెరపై వీక్షించవచ్చు.
ఫ్లక్స్ హెల్మెట్ ద్వారా మెదడులోని నాడీకణాల (న్యూరాన్లు) వేగాన్ని పరిశీలించవచ్చు. ఏ పని చేస్తున్నప్పుడు న్యూరాన్లు ఎలా ప్రతిస్పందిస్తు్న్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సంతోషంగా ఉన్నప్పుడు, బాధ సమయంలోనూ, కోపం వచ్చినప్పుడు ఇలా వివిధ సందర్భర్లాల్లో నూరాన్లు ఎలా స్పందిస్తున్నాయో, దానికి అనుగుణంగా మెదడు ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకునే వీలుంటుంది.అయితే ఈ రెండు హెల్మెట్లు కలిపి 50 వేల డాలర్లా? లేదా ఒక్కో హెల్మెట్ ధర 50 వేల డాలర్లా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎలా పని చేస్తుంది?
హెల్మెట్ లాంటి పరికరాన్ని వ్యక్తి తలకు అమరుస్తారు. హెల్మెట్లోని లేజర్ కిరణాలు పుర్రె ద్వారా మెదడులోకి ప్రవేశిస్తాయి. మెదడులో కోట్ల సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనకు ఎలాంటి భావోద్వేగం కలిగినా ఇవి ప్రతిస్పందిస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనల్నింటికీ ఇవే మూలం. అందువల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్ కిరణాలు న్యూరాన్ల పని తీరును పసిగట్టి ఆ ప్రక్రియను రికార్డు చేస్తాయి. ‘మాగ్నెటోఎన్స్ఫలోగ్రఫీ’ ద్వారా మెదడు పని తీరును చిత్రీకరిస్తాయి. ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నామో ఇవి తెలుసుకుంటాయి.ఫ్లో హెల్మెట్ పరికరం ద్వారా రక్తంలోని ఆక్సిజన్స్థాయిలను కూడా తెలుసుకోవచ్చు. తొలుత వీటిని మెదడుపై పరిశోధన చేసే సంస్థలకు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా ప్రవేటు వ్యక్తులు ఆసక్తి ఉంటే కొనుగోలుచేయవచ్చని కెర్నల్ సంస్థ సీఈవో జాన్సన్ వెల్లడించారు.
నష్టమూ ఉంటుందా?
కెర్నల్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరాల వల్ల నష్టమూ ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, తమ సిబ్బందితో వీటిని ధరింపజేసి వారి మనసులో ఏముందో తెలుసుకునే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పరికరాలను సక్రమ మార్గంలో ఉపయోగిస్తే ఎంతో మేలుంటుందని కెర్నల్ యాజమాన్యం చెబుతోంది. ముఖ్యంగా మానసిక రోగుల స్థితిని అంచనా వేసి వారిని మామూలు మనుషులుగా చేసేందుకు దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.