తన ఏడాది జీవితాన్ని రికార్డు చేశాడు!
ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించిన ‘బిగ్ బాస్’ కార్యక్రమం గురించి అందరికి తెలిసిందే కదా..! కొందరిని ఓ ఇంట్లోకి పంపి అటుఇటుగా 70-100 రోజులపాటు ఉంచుతారు. ఆ ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం తింటున్నారు? ఇలా వారి
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించిన ‘బిగ్ బాస్’ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే కదా..! తెలుగులోనూ నాలుగో సీజన్ రాబోతోంది. ఈ కార్యక్రమంలో కొందరిని ఓ ఇంట్లోకి పంపి అటు ఇటుగా ఓ 100 రోజులపాటు ఉంచుతారు. ఆ ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం తింటున్నారు? ఇలా వారి జీవితంలోని 100 రోజులను ఆ ఇంట్లో అమర్చిన పదుల సంఖ్యలో కెమెరాలు రికార్డు చేస్తుంటాయి. అదే తరహాలో ఓ వ్యక్తి ఏకంగా ఏడాదిపాటు తన జీవితాన్ని రికార్డు చేశాడు. తిరిగి ఆ వీడియోలు చూసుకుంటే తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెబుతున్నాడు.
అమెరికాకు చెందిన మైఖేల్ గేర్రీకి కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన తర్వాత ఏం చేయాలో తోచలేదట. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడట. అయితే ఒకతను వారం పాటు లైవ్ స్ట్రీమింగ్ పెట్టడం చూసి తానూ అలా ప్రయత్నించాలని భావించాడు. దీంతో గతేడాది జనవరిలో తన ఇంట్లో బాత్రూమ్ సహా.. అన్ని గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకొని తను గడిపే ప్రతి క్షణాన్నీ రికార్డు చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు గోడలకు అమర్చిన కెమెరాలు.. కంప్యూటర్ ముందు కూర్చుంటే వెబ్కెమెరా.. బయటకు వెళ్తే తన భుజంపై, చేతిలో కెమెరాలు పెట్టుకొని రికార్డు చేయడం మొదలుపెట్టాడు. ఉదయం లేవగానే కాలకృత్యాల నుంచి పడుకునే వరకు.. పడుకున్న తర్వాత కూడా గేర్రీ తనను తాను రికార్డు చేసుకున్నాడు. ఎంతోమంది డిజిటల్ కంటెంట్ను రూపొందిస్తున్నారని, అందుకే తన రికార్డింగ్ వీడియోలనే డిజిటల్ కంటెంట్గా మార్చి సోషల్మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టు చేసినట్లు గేర్రీ చెప్పుకొచ్చాడు. అలా ఏడాదిపాటు తన జీవితాన్ని రికార్డు చేశాడు.
ఎప్పటికప్పుడు రికార్డు చేసిన వీడియోలను చూసుకోవడం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని గేర్రీ అంటున్నాడు. మొదట్లో ఎంతో బద్ధకంగా ఉంటూ ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే అతను.. క్రమంగా మారిపోయాడట. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకున్నాడట. అంతేకాదు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా పోయిందట. ఏడాది జీవితం రికార్డింగ్ పూర్తయిన తర్వాత గేర్రీ తన అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు తన ఆలోచనలను సోషల్మీడియాలో పంచుకుంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు