Zojila tunnel : ‘జోజిలా’.. ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గం!
ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూకశ్మీర్ (Jammu kashmir), లద్ధాఖ్లో (Ladakh) అభివృద్ధి పరుగులు పెడుతోంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి.
భౌగోళికంగా కీలకమైన శ్రీనగర్-లేహ్ హైవే (ఎన్హెచ్1)పై అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నారు. జమ్మూకశ్మీర్లో (Jammu kashmir) రూ.25వేల కోట్ల వ్యయంతో 19 సొరంగాల (Tunnels) నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా 6.5 కిలోమీటర్ల పొడవైన ‘జడ్-మోర్’ టన్నెల్, సమీప రహదారి నిర్మాణం కోసం రూ.2680 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు జోజిలా టన్నెల్ (Zojila tunnel) నిర్మిస్తున్నారు. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ (Ladakh) మధ్య రవాణా సులభతరం చేసేందుకు ఈ జోజిలా టన్నెల్ ఎంతో కీలకం కానుంది.
ఏంటీ జోజిలా టన్నెల్?
నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే జోజిలా టన్నెల్కు ఇండియాలో, ఆసియాలోనే అతి పొడవైన రహదారి సొరంగ మార్గంగా గుర్తింపు దక్కనుంది. దీని పొడవు 14.15 కిలోమీటర్లు. 7.57 మీటర్ల ఎత్తులో ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. రహదారితో కలిపి దీనికి రూ.6800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఆసియాలోనే పొడవైన బై-డైరెక్షనల్ టన్నెల్ అని చెబుతున్నారు. ఇందులో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణం చేయవచ్చు.
కశ్మీర్లోని గాందార్బల్, లద్ధాఖ్లోని కార్గిల్ జిల్లా డ్రాస్ పట్టణానికి మధ్యలో జోజిలా పాస్ ఉంది. ఈ పాస్లోని కొండలను తొలిచి జోజిలా టన్నెల్ను నిర్మిస్తున్నారు. అలా చేయడం ద్వారా ‘జడ్-మోర్’ టన్నెల్ మార్గాన్ని జోజిలా టన్నెల్తో అనుసంధానం చేయవచ్చు. ఈ రెండు టన్నెళ్లకు మధ్య 18.475 కిలోమీటర్ల హైవేను అభివృద్ధి చేస్తున్నారు. అవసరం మేరకు 3 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి. మిగతా మార్గం మొత్తం కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ హైవేలో ఐదు వంతెనలు, రెండు స్నో గ్యాలరీలను నిర్మిస్తున్నారు.
సొరంగం ఎందుకు?
ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లద్ధాఖ్లోని లేహ్ చేరుకోవాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. పైగా ఎత్తయిన జోజిలా పాస్ పర్వత మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ ప్రయాణానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్ అందుబాటులోకి వస్తే 20 నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో జోజిలా వద్ద ఎక్కువగా మంచు కురుస్తుంటుంది. హిమపాతాలు చోటు చేసుకుంటాయి. కొండ చరియలు విరిగి పడుతుంటాయి. కొన్ని సార్లు వాహనాలు కూడా రోడ్డు మీద నుంచి జారి అదుపుతప్పుతుంటాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేస్తారు. దాంతో కనీసం ఐదు నెలలపాటు దేశంలోని మిగతా భూభాగంతో అవతలి వైపు ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి. జోజిలా పాస్ను మూసివేస్తే విమాన ప్రయాణమే దిక్కు. ఆ ఖర్చును సామాన్యులు భరించలేరు. అందుకే జోజిలా టన్నెల్ను ప్రతిపాదించారు. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే అన్ని కాలాల్లోనూ ప్రయాణం సులభతరం అవుతుంది. ఇది పౌరులకే కాదు.. మిలటరీకి కూడా కీలక మార్గం అవుతుంది. 2026 కల్లా ఈ రహదారి అందుబాటులోకి రానుంది.
ప్రమాదాలకు అడ్డుకట్ట
ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడం వల్ల కశ్మీర్-లద్ధాఖ్ ప్రయాణ సమయం తగ్గుతుంది. బాల్తాల్ నుంచి మినామార్గ్కు 40 కిలోమీటర్ల దూరం ఉంది. నూతన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే ఆ దూరం 13 కిలోమీటర్లు కానుంది. దాంతో సుమారు గంటన్నర సమయం ఆదా అవుతుంది. మునుపటిలా శ్రమతో కూడిన ప్రయాణం కూడా ఉండదు. గతంలో జోజిలా మార్గం ఓ మృత్యుదారిలా ఉండేది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. టన్నెల్ రాకతో ప్రమాదాలు నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
స్మార్ట్ వ్యవస్థ
ఈ జోజిలా సొరంగ నిర్మాణంలో స్మార్ట్ టన్నెల్ వ్యవస్థను వాడుతున్నారు. అందులో భాగంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ను అనుసరిస్తున్నారు. ఈ విధానంలో సీసీటీవీ, రేడియో కంట్రోల్, నిరంతర విద్యుత్తు సరఫరా, వెలుతురు సౌలభ్యం ఉంటాయి. అ అధునాతన సాంకేతికతను వినియోగించడం ద్వారా భారత ప్రభుత్వానికి సుమారు రూ.5వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!