మనుషులు లేని చోట బ్యాంక్ అట!
బ్యాంక్.. ప్రజలకు నిత్యవసరాల్లో ఒకటిగా మారిన వ్యవస్థ. వ్యాపారాలకు సంబంధించిన నగదు లావాదేవీలు, జీతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చే నగదు అన్నీ బ్యాంకుల ద్వారానే సాగుతుంటాయి. అందుకే ప్రజలకు అందుబాటులో
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్.. ప్రజలకు నిత్యవసరాల్లో ఒకటిగా మారిన వ్యవస్థ. వ్యాపారాలకు సంబంధించిన నగదు లావాదేవీలు, జీతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చే నగదు అన్నీ బ్యాంకుల ద్వారానే సాగుతుంటాయి. అందుకే ప్రజలకు అందుబాటులో ఉండాలని బ్యాంకులు తమ బ్రాంచ్లను జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తుంటాయి. కానీ, మెక్సికోలోని ఓ బ్యాంక్ మాత్రం సిటీకి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్ ఇటీవల సోషల్మీడియాలో వైరల్ అయింది. అయితే, అటు ఇటు పోయి.. ఈ విషయంలో ఆ దేశాధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యూవల్ లోపెజ్పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ అసలు ఆ బ్యాంక్ను అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు? అధ్యక్షుడిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి?
బాంకో డెల్ బెయిన్స్టార్కి మెక్సికోలో ప్రముఖ బ్యాంక్గా పేరుంది. దేశాధ్యక్షుడి సూచన మేరకు ఈ బ్యాంక్ గతేడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారానే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుంటాయి. అయితే, ఈ బ్యాంక్ ఇటీవల చిహువాహువా నగర ప్రజల కోసం ఓ బ్రాంచ్ ఏర్పాటు చేయలనుకుంది. ఈ మేరకు నగరానికి కొంచెం దూరంలో మనుషులు లేని ఎడారిలాంటి ప్రాంతంలో ఒక భవంతిని నిర్మించి బ్రాంచ్ ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్లో ఈ బ్రాంచ్ను ప్రారంభించనున్నారట. చిహువాహువా నగరంలోని లబ్ధిదారులు, వ్యాపారాలు నగదు లావాదేవీల కోసం ఎటువంటి రవాణా సౌకర్యం, సరైన రోడ్డు మార్గంలేని ఈ బ్రాంచ్కు వెళ్లాల్సి ఉంటుందట. దీంతో ఈ బ్రాంచ్ ఏర్పాటుపై నెటిజన్లు సోషల్మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మనుషులే లేని చోట బ్యాంక్ ఏమిటని, బ్యాంక్ను చేరుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్రాంచ్ని నిర్మిస్తూ దేశాధ్యక్షుడు ప్రజల డబ్బును వృథా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. డబ్బులు ఆదా చేయడానికి ఆయన తీసుకొచ్చిన ‘ఫోర్త్ ట్రాన్స్ఫార్మెషన్’కు విరుద్ధంగా ఈ చర్య ఉందని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్రాంచ్ ఏర్పాటుపై బ్యాంక్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. తాము మొదట నగరంలోని నియోవొ కేసస్ గ్రాండీస్ మున్సిపాలిటీలో బ్రాంచ్ ఏర్పాటు చేయాలని భావించారట. అయితే, స్థానిక మేయర్ వారికి బ్రాంచ్ ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి నిరాకరించారట. దీంతో మెక్సికన్ ఆర్మీకి చెందిన స్థలాన్ని బ్యాంక్కు కేటాయించడంతో ఈ నిర్మానుష్య ప్రాంతంలో బ్రాంచ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రజలు బ్యాంక్కి రావడానికి మార్గం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి