UNICEF: చిన్నారులపై చేయి చేసుకుంటే మారుతారా?
చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు నచ్చని కొన్ని పనులు చేస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు నచ్చని కొన్ని పనులు చేస్తుంటారు. దీంతో కొంతమంది కోపంతో వారిపై చేయి చేసుకుంటారు. అయితే దీనివల్ల తల్లిదండ్రులపై పిల్లలకు వ్యతిరేక భావన ఏర్పడటం తప్ప .. ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా పిల్లలు మొండిగా తయారయ్యే అవకాశాలున్నాయని తేలింది. ఈ మేరకు బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ ‘ ది లాన్సెట్’లో కథనం ప్రచురితమైంది. అమెరికా, కెనడా, జపాన్, రష్యా తదితర 69 దేశాల్లో దీనిపై అధ్యయనం చేశారు.
పిల్లల్ని శారీరకంగా శిక్షించడం వల్ల వాళ్ల బుద్ధి మందగిస్తుందని, స్వతంత్రత కోల్పోయామన్న భావనతో కుంగుబాటుకు లోనవుతారని అధ్యయనానికి నాయకత్వం వహించిన ఎలిజబెత్ గెర్షోఫ్ తెలిపారు. కొట్టడం వల్ల పిల్లలు మెరుగవుతారన్నది ఓ దురభిప్రాయం మాత్రమేనని చెప్పారు. దీనివల్ల వారు క్రూరంగా ప్రవర్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. దీనికి సంబంధించి అధ్యయనంలో స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆయన అన్నారు.
62 దేశాల్లో చట్ట విరుద్ధం
ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో పిల్లల్ని శారీరకంగా హింసించడం చట్ట విరుద్ధం. మరో 27 దేశాల్లో చిన్నారులపై భౌతికదాడులను ఆపేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే, 31 దేశాల్లో మాత్రం చిన్నారుల్ని కొట్టినా నేరంగా పరిగణించడం లేదు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 25 కోట్ల మంది చిన్నారులు శారీరక హింసకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్