China : సామాజిక మాధ్యమాలపై డ్రాగన్ నిఘా.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుందట!
చైనాలో (china) ఇంటర్నెట్ (Internet) వినియోగం సహా మొత్తం సామాజిక మాధ్యమాలను (social media) డ్రాగన్ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది. దాంతో రాజకీయ విమర్శలు, తప్పుడు సమాచార వ్యాప్తి, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు ఇలా ఏవి కనిపించినా వెంటనే వాటిని తొలగిస్తోంది.
చైనా సైబర్స్పేస్ రెగ్యులేటర్(సీఏసీ) రెండు నెలల పాటు సామాజిక మాధ్యమాలపై (social media) నిఘా పెట్టి 14 లక్షల పోస్టులను డిలీట్ చేసింది. సుమారు 67 వేల ఖాతాలను తొలగించింది. సోషల్ మీడియాను ఆసరా చేసుకొని తప్పుడు సమాచార వ్యాప్తి, అక్రమ లాభార్జన, అధికారుల పేరుతో నకిలీ ఖాతా తెరవడం వంటి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఏసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న పౌరులను డ్రాగన్ ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తోందో తెలుసుకోండి.
గ్రేట్ ఫైర్ వాల్
చైనా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ‘గ్రేట్ ఫైర్ వాల్’ అనే అధునాతన వ్యవస్థను వినియోగిస్తోంది. విదేశీ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాలను ఆ దేశ పౌరులు వినియోగించకుండా ఈ వ్యవస్థ కట్టడి చేస్తుంది. ఈ ఫైర్వాల్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులో ఉన్న ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిని సైతం బ్లాక్ చేయగలదు. ఇక ఇంటర్నెట్లో దొరికే సమాచారం మొత్తాన్ని చైనా నెటిజన్లు పొందకుండా ఇది వడపోస్తుంది.
స్వదేశీ సామాజిక మాధ్యమాలు
తమ దేశ పౌరులు కేవలం విదేశీ సామాజిక మాధ్యమాలపై ఆధారపడకుండా సొంత సామాజిక మాధ్యమాలను చైనా అభివృద్ధి చేసింది. వీ చాట్, వీబో, క్యూక్యూ ప్లాట్ఫామ్స్ ఆ కోవకు చెందినవే. అయితే వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఎవరైనా హద్దుమీరితే వెంటనే ప్రభుత్వానికి సమాచారం వెళ్తుంది.
సెన్సార్, కంటెంట్ కంట్రోల్
ఆన్లైన్లో లభ్యమయ్యే కంటెంట్ను సెన్సార్ చేయడానికి, పర్యవేక్షించడానికి చైనా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కంటెంట్ మోడరేటర్లను ఉపయోగిస్తుంది. వీరు అభ్యంతకరంగా కనిపించిన పోస్టులను వెంటనే తొలగిస్తారు. ఆటోమేటెడ్ సిస్టమ్ల సహాయంతోనూ కంటెంట్ సెన్సార్ జరుగుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ పోస్టులు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోస్టులను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తారు. ఇలా తొలగించే వాటిలో మానవహక్కులు, టిబెట్, తైవాన్, తియానన్మెన్ స్క్వేర్ అంశాలు, అధికారుల నిర్ణయాలను సవాల్ చేసే పోస్టులు కూడా ఉంటాయి.
అసలు పేరు ఉంటేనే..
సామాజిక మాధ్యమాల్లో ముసుగు తొడుక్కొని చెలరేగిపోయే వారు చాలా మంది ఉంటారు. అసలు పేరు కాకుండా నకిలీ పేరుతో ఖాతాలు తెరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు అసలు పేరుతోనే సామాజిక మాధ్యమ ఖాతా ఉండాలనే నిబంధన పెట్టారు. పైగా ఖాతా తెరవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. దాంతో మితిమీరి ప్రవర్తించే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఆన్లైన్ వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని గుర్తించడం సులభమైంది.
నిరంతర నిఘా, పర్యవేక్షణ
చైనా అధికారులు సామాజిక మాధ్యమాలపై విస్తృత నిఘా పెట్టారు. కొన్ని కీవర్డ్లు ఉపయోగించి సమాచారాన్ని వడపోస్తున్నారు. ఫొటోలను గుర్తిస్తున్నారు. కృత్రిమ మేధ అల్గారిథంతో నెటిజన్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. దాంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పోస్టులు, సమాజంలో అశాంతిని రగిలించే పోస్టులను వేగంగా గుర్తించి వాటికి చెక్ పెడుతున్నారు.
సెల్ఫ్ సెన్సార్షిప్
చైనాలో ఇన్ని నిబంధనలు ఉన్నాయని తెలిసి చాలా మంది ‘సెల్ఫ్ సెన్సార్షిప్’ పాటిస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సున్నితమైన అంశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించడానికి వెనకాడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ చర్చలు చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.
బీజింగ్ తొలి నుంచీ తమకు ఇబ్బంది కలిగించే ఎలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసినా.. అలాంటి పౌరులను గుర్తించి అరెస్టు చేస్తోంది. కమ్యూనిస్టు ప్రభుత్వానికి, సైన్యానికి సంబంధించి చేసే పోస్టులు వైరల్గా మారితే తక్షణమే చర్యలు తీసుకుంటోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM