National Project : సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఏ ప్రాతిపదికన జాతీయ హోదా ఇస్తుందంటే..!
ఇటీవల కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే ఏయే అంశాలను పరిశీలిస్తుందో తెలుసుకుందామా..
దేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని నిర్మాణ దశలో.. మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం పురోగమించడానికి నీటిపారుదల ప్రాజెక్టులు(Irrigation Project) ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే వాటికి కేటాయించాల్సిన నిధులు కూడా భారీ మొత్తంలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా(National Project) లభించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుంది. ప్రాజెక్టు జరుగుతున్న పనులను కేంద్ర జలసంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది.
దేశంలోని అత్యధిక జాతీయ ప్రాజెక్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ డిమాండు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు(cost) కేటాయించినట్లు మోదీ ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం నాలుగు అంశాలను పరిశీలిస్తుంది. అందులో ఏదో ఒక అర్హత కలిగి ఉంటే పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే..
1. అంతర్జాతీయ స్థాయిలో.. అంటే పొరుగు దేశంతోనైనా సరే కలిసి నిర్మించేలా ఆ ప్రాజెక్టు స్వరూపం ఉండాలి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి వాటాను దేశం వాడుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఎక్కడ కడుతున్నారు? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తవుతుంది అనే సమగ్ర సమాచారం ఉండాలి. దాంతో దేశీయ అవసరాలు తీరతాయి. ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలున్నాయని భావిస్తే కేంద్ర జలశక్తి శాఖ అందుకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంటుంది.
2. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి(water) అవసరాలు తీర్చే అంతర్ రాష్ట్రాల ప్రాజెక్టులు. రాష్ట్రాల మధ్య తగాదాల కారణంగా ఖర్చుల విభజన, పునరావాసం(rehabilitation), విద్యుత్ ఉత్పత్తి(power) అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్రం సమస్యను తీరుస్తుంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల(rivers) అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులు కూడా ఈ కోవలోకి వస్తాయి.
3. ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఉండి.. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే ప్రాజెక్టులు. రాష్ట్రంలోని ప్రజల సాగునీటి అవసరాలు తీర్చగలగాలి. ముఖ్యంగా రెండు లక్షల హెక్టార్లకు(hectare) మించి పొలాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదు. ప్రాజెక్టులోని నీరు తిరిగి ప్రాజెక్టులో చేరే విధంగా ‘హైడ్రాలజీ’(hydrology) అనుకూలత కలిగి ఉండాలి.
4. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ(ఈఆర్ఎం) ప్రాజెక్టులు. అంటే అప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టును పొడిగించడం లేదా పునరుద్ధరణ పనులు చేస్తే కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి రావాలి.
అనుమతులు.. అనుకూలతలు
పైన పేర్కొన్న అర్హతలు ఉంటే జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అర్హత ఉన్నంత మాత్రం కేంద్రం అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వదు. ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే..
- కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే జాతీయ హోదా సాధ్యమవుతుంది.
- సాగునీటి సలహా సంఘం ప్రాజెక్టు అనుకూలతల్ని పరిశీలిస్తుంది. దాని నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
- వరద ముంపు నివారణ, బహుళసార్థక ప్రాజెక్టుల నిర్వహణ చూసే జలవనరుల శాఖ(డీవో డబ్ల్యూఆర్) ఆమోదం తెలపాలి.
- నిర్దేశించిన ప్రమాణాలు ప్రాజెక్టులో ఉన్నాయని నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనం(ఆర్డీ&జీఆర్) సంతృప్తి చెందాలి.
- పెట్టుబడులకు తగిన అనుమతులు ఉండాలి. ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనే విషయంపై హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ సిఫారసులు రావాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నిధుల లభ్యత గురించి అంచనా వేయాలి.
- ఇక జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. కేంద్రం వాటా అన్ని రాష్ట్రాలకు స్థిరంగా ఉండదు. ఆయా ప్రాంతాల వెనుకబాటు ఆధారంగా ఎంత వాటా ఇవ్వాలన్న విషయంపై ఇదివరకే కొన్ని ప్రమాణాలున్నాయి.
కేంద్రం 90: రాష్ట్రం 10..
8 ఈశాన్య రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం), 2 హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లకు ఈ నిష్పత్తి ప్రకారం వాటా నిధులు విడుదవుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నిధుల పంపిణీ నిష్పత్తిలో తేడా ఉంటుంది.
నీటిపారుదల కోసం కడుతున్న ప్రాజెక్టులే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడం కోసం కడుతున్న వాటికి కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాలు తీరడం, నదులు, రిజర్వాయర్లు, కాలువల నుంచి వచ్చే నీరు భూమిలోపలి జలవనరుల శాతాన్ని పెంచుతూ చెరువులు నింపే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి కేంద్రం అంగీకరించడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి