‘జాతీయ పార్టీ’ హోదా సాధించాలంటే...!
దేశంలో మొన్నటి వరకు ఎనిమిది జాతీయ పార్టీలుండేవి. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ పార్టీగా అవతరించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(భారాస) కూడా జాతీయ పార్టీగా మారేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరి జాతీయ పార్టీగా మారాలంటే.. కావాల్సిందేంటి?
ప్రతి రాజకీయ పార్టీ దేశస్థాయిలో సత్తా చాటాలని ఆశ పడుతుంది. కొన్ని పార్టీలు ఆ దిశగా అడుగులూ వేస్తాయి. ఈ కల నెరవేరాలంటే నాయకత్వం, దేశ వ్యాప్తంగా ఆ పార్టీ సిద్ధాంతాలను మెచ్చే సంఘాలు కలిసి రావాలి. అంతటితో అయిపోలేదు.. పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికలం సంఘం నిర్దేశించిన కొన్ని అర్హతలను అందుకోవాలి..
దేశంలో మొన్నటి వరకు ఎనిమిది జాతీయ పార్టీలుండేవి. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ పార్టీగా అవతరించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(భారాస) కూడా జాతీయ పార్టీగా మారేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)ని దేశవ్యాప్తం చేసేందుకు భారత రాష్ట్ర సమితి(భారాస)గా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మార్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు భారాస నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో భారాస రాష్ట్ర అధ్యక్షుడిగా ఐఏఎస్ మాజీ అధికారి తోట చంద్రశేఖర్ను కేసీఆర్ నియమించారు. సంక్రాంతికి ఏపీలో భారాస క్రియాశీలకంగా మారుతుందన్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టబోతున్నారు.
అయితే.. ఓ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీగా మారడం అంత సులువేం కాదు. దానికి ఎన్నికల సంఘం కొన్ని నియమనిబంధనలు విధించింది.
ఒక పార్టీ.. జాతీయ పార్టీ కావాలంటే ముందుగా రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలి. మరి ఆ హోదా పొందాలంటే..
* ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి.
లేదా
* లోక్సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి.
లేదా
* గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు(ఏది ఎక్కువగా అయితే అది)గెలవాల్సి ఉంటుంది.
లేదా
* అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి.
ఇలా ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హత సాధిస్తే ఆ పార్టీ రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
ఇక రాష్ట్రంలో క్రియశీలంగా ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే.. ఎన్నికల సంఘం పేర్కొన్న అర్హతలను అందుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
* కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి.
లేదా
* దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి.
లేదా
* సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని 2012లో స్థాపించారు. మొదట దిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ కొన్నాళ్లకు అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ తర్వాత సమీప రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలోకి దిగుతూ పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొంది. గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు.. 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతను అందుకుంది. దీంతో ఎన్నికల సంఘం ఆప్ను జాతీయ పార్టీగా గత డిసెంబర్లో ప్రకటించింది.
రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీపార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. వాటికంటే ముందే.. పార్టీ పెట్టిన పదేళ్లకే ఆప్ జాతీయ పార్టీ గుర్తింపు పొందడం విశేషం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసి జాతీయ పార్టీగా ఎదగాలని భారాస ఆశిస్తోంది
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం