Cuba : వైద్యుల దేశం.. పాల కోసం అలమటిస్తోంది!
వైద్య రంగంలో క్యూబా సాధించిన అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం పాల కొరత పట్టి పీడిస్తోంది. అమెరికా ఆంక్షలు, దేశీయ పరిస్థితులు క్షీర సంక్షోభానికి ఎలా కారణమయ్యాయో చదివేయండి.
ఏడేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులందరికీ సబ్సిడీలో రోజుకు లీటర్ చొప్పున పాలను అందిస్తాం- క్యూబా(Cuba)లో కమ్యూనిజం పాలన మొదలైనప్పుడు అప్పటి అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో(Fidel Castro) ఇచ్చిన హామీ ఇది!
ద్వీప దేశమైన క్యూబాలో ప్రస్తుతం అందరి ఆకలి తీరే స్థాయిలో పాలు(milk) లభించడం లేదు. అక్కడ నిత్యం ‘పాలు లేవు.. అయిపోయాయి’ అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. గత ముప్ఫై ఏళ్లుగా క్యూబాలో పాల ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. అక్కడ ఏడాది మొత్తం కలిపి ఒక వ్యక్తికి 39.5లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే రోజుకు సగం గ్లాసు పాలు కూడా అందవు. క్యూబా ప్రధానంగా పాల సరఫరా కోసం న్యూజిలాండ్పై ఆధార పడుతోంది. బెల్జియం, ఉరుగ్వే దేశాలు కూడా క్యూబాకు పాలు ఎగుమతి చేస్తున్నాయి.
చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా.. ఆశించిన మేర ఫలితం కనబడటం లేదు. మిగతావారు అందుబాటులో ఉన్న కొన్ని స్టోర్లలో అత్యధిక ధర చెల్లించి పాలను కొనుగోలు చేస్తుంటారు. 2022 ప్రారంభంలో ఒక కేజీ పాలపొడి ధర అచ్చంగా ఆరు నుంచి ఎనిమిది డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ.450 నుంచి రూ.600 అన్నమాట.
బలహీనమైన ఆవులు.. వధిస్తే కఠిన శిక్షలు
క్యూబా ప్రజలకు ఆవు(cow) పాలే ప్రధాన ఆధారం. అక్కడి ఆవులు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని మేపడానికి, పోషించడానికి సరిపడా వనరులు లేకున్నా.. కొంత మంది రైతులు పాల ఉత్పత్తి ఇన్ని రోజులు చేస్తామని దళారీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. ఆ గడువు తీరగానే ఆవులను వధ చేయడానికి అమ్మేస్తుంటారు. అయితే అక్రమ వధను అక్కడి ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే మూడు నుంచి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తుంది. ఆవులను అమ్మిన వ్యక్తులకు, రవాణా చేసిన వారికి రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయి. ఇక ఆహార సంక్షోభం కూడా పశు వధలకు కారణమవుతోంది. చిన్నాచితకా రైతులు తమ పాడి ఆవులను ఎక్కడ దొంగలు ఆహారం కోసం ఎత్తుకెళ్తారోనని రాత్రుళ్లు నిరంతరం కాపలా కాస్తుంటారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరవు
క్యూబా ప్రభుత్వం తమకు ఇస్తున్న నగదు ఎంత మాత్రం సరిపోవడం లేదని పాల ఉత్పత్తిదారులు ఆరోపిస్తున్నారు. ఆ నగదు కూడా సకాలంలో అందడం కష్టమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఒక్కో లీటరుకు 0.71 డాలర్లు మాత్రమే ఇస్తుంది. అదే బ్లాక్ మార్కెట్లో అయితే 1.46 డాలర్ల వరకు వస్తాయి. ఇక పాలను చీజ్, పెరుగుగా మార్చి బ్లాక్ మార్కెట్లో అమ్మితే 7.26 డాలర్ల వరకు ఆదాయం లభిస్తుంది. అత్యధిక మంది పాడి రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య రవాణా. ఇప్పటికీ అక్కడి రైతులు మోటారు వాహనాలపై కాకుండా గాడిద బండ్లతో పాలను రవాణా చేస్తుంటారు.
అమెరికాతో వైరం.. ఆంక్షల పర్వం
అమెరికా(america), క్యూబాకు కొన్ని దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ దేశానికి ఎగుమతులను అమెరికా ఎంత మాత్రం ప్రోత్సహించదు. ముందస్తు చెల్లింపులు చేసిన తరువాతే ఏ సరుకైనా పంపించాలని 2000 సంవత్సరంలో అమెరికా తమ కంపెనీలను ఆజ్ఞాపించింది. దీంతో అమెరికా మిత్ర దేశాలు కూడా క్యూబాకు సహాయం చేయడానికి వెనకాడుతుంటాయి. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో అగ్రరాజ్యం ఆంక్షలతో క్యూబాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫలితంగా క్యూబాకు చేరాల్సిన ఆహార పదార్థాలు, మిల్క్ కంటెయినర్లు, ప్యాకేజింగ్ వస్తువులు సముద్రంలోనే ఓడల్లో నిలిచిపోయాయి.
ద్వీపాల సమూహమైన క్యూబాకు రవాణా కూడా ఒక సవాలుగా మారుతోంది. దానిని ఎదుర్కొనేందుకు నిధులు కేటాయించడం, పడవలు, ఓడలు అందుబాటులో ఉంచడం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్యూబా ప్రజలు ఆశిస్తున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన క్యూబాలో తక్షణమే క్షీరవిప్లవం రావాలని ఎదురు చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు