CoronaVirus: వీటిని రోజూ శుభ్రం చేయాలి

కరోనా కలకలం మొదలయ్యాక వ్యక్తిగత శుభ్రతకు, పరిసరాల శుభ్రతకు ప్రజలు ప్రధాన్యత ఇస్తున్నారు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు మనం రోజు వాడే కొన్ని వస్తువులను తప్పని సరిగా శుభ్రం చేసుకోవాలి.

Published : 15 May 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కలకలం మొదలయ్యాక వ్యక్తిగత శుభ్రతకు, పరిసరాల శుభ్రతకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు మనం రోజు వాడే కొన్ని వస్తువులను తప్పని సరిగా శుభ్రం చేసుకోవాలి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం రోజూ శుభ్రం చేసుకోవాల్సిన వస్తువులేంటో.. వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం!

* రోజూ ఉపయోగించే కంప్యూటర్‌ కీబోర్డు మీద బోలెడన్ని క్రిములు వచ్చి చేరుతుంటాయి. వాటి ద్వారా వైరస్‌ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అందువల్ల సేఫ్‌ క్లీనర్‌ లేదా ఆల్కహాల్‌తో కీబోర్డు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. 

* మంచం, పరుపు, దుప్పటి, తలగడ మీద ఉండే బ్యాక్టీరియా వల్ల నిద్ర పట్టకపోవడమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల మంచాన్ని రోజూ రోజూ శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్క సారైనా బెడ్‌ షీట్లను ఉతుక్కోవాలి. 

* నీళ్లు తాగడానికి ఉపయోగించే బాటిల్‌ను రోజూ యాంటి బాక్టీరియల్‌ సబ్బు, వేడినీటితో కడగాలి. లేదా సహజంగా బ్యాక్టీరియాను చంపే గుణమున్న రాగి బాటిళ్లను ఉపయోగించడం మంచిది.

* వేళ్లకు పెట్టుకునే ఉంగరాల ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. వాటిని యాంటీ బాక్టీరియల్‌ సబ్బు, వేడినీరు, లేదా ఆభరణాలను శుభ్రం చేసుకునే లిక్విడ్‌తో శుభ్రం చేయాలి.

* మనం రోజూ కొన్ని వందల సార్లు ఫోన్‌ తెరను తాకుతూ ఉంటాము. దీని వల్ల హానికారక బ్యాక్టీరియా ఫోన్‌ మీదకు వచ్చి చేరుతుంది. అందువల్ల ఫోన్‌ను ఆల్కహాల్‌తో శుభ్రం చేసుకోవాలి. టీవీ, ఏసీ రిమోట్లను తరచూ తుడుస్తూ ఉండాలి.

* కాఫీ, టీ కప్పులను ఎప్పటి కప్పుడు శుభ్రపరచాలి. అలాగే ఇంట్లోని వంటగదిని, ఇతర గదులను, పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజిలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేడి నీటిలో మరిగించాలి. డోర్‌ హ్యాండిల్స్‌, బాత్‌రూం సింక్‌ యాంటి బ్యాక్టీరియల్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. 

* పళ్లు తోముకునే బ్రష్‌ను యాంటి బ్యాక్టీరియల్‌ మౌత్‌ వాష్‌ ద్రావణంలో నానబెట్టడం వల్ల బ్రష్‌ మీద ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు