జామ్-చాక్లెట్సే రంగులు.. చెంచాలే కుంచెలు!
మీకు జామ్.. చాక్లెట్స్.. తేనె వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా..! కానీ, ఈజిప్ట్కు చెందిన సల్లీ మాగ్డి మురాద్ వాటితో అందమైన చిత్రాలు గీస్తు ఆకట్టుకుంటోంది. పాతికేళ్ల మురాద్ తండ్రి పెయింటర్.. ఆయన కళనే కూతురుకు అబ్బింది. చిన్నతనం నుంచి
ఇంటర్నెట్ డెస్క్: మీకు జామ్.. చాక్లెట్స్.. తేనె వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా..! కానీ, ఈజిప్ట్కు చెందిన సల్లీ మాగ్డి మురాద్ వాటితో అందమైన చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటోంది. పాతికేళ్ల మురాద్ తండ్రి పెయింటర్.. ఆయన కళ కూతురుకు అబ్బింది. చిన్నతనం నుంచి కుంచె పట్టుకొని చిత్రాలు గీయడం మొదలుపెట్టిన మురాద్.. పాఠశాల, కాలేజీ స్థాయిలో అనేక పోటీల్లో చిత్రలేఖనంలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. అయితే, ఇటీవల కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో రంగులు.. కుంచెలతో పెయింటింగ్ కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని భావించింది. అలా జామ్.. సాస్.. చాక్లెట్స్నే రంగులుగా మలిచి, చెంచాలనే కుంచెలుగా చేసి ప్లేట్పై బొమ్మలు గీయడం ప్రారంభించింది. ఈజిప్ట్లో పేరొందిన ప్రముఖుల ముఖాలు.. అందమైన అమ్మాయిల ముఖాలు.. ప్రకృతి అందాలు ఇలా అన్నింటిని ఆవిష్కరిస్తోంది. ఈ వినూత్న చిత్రాలను ఎప్పటికప్పుడు మురాద్ సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తుండటంతో వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ చిత్రాలను మీరూ చూసేయండి..
(ఫొటోలు: సల్లీ మాగ్డి ఫేస్బుక్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?