Nato : విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..
రష్యాతో (Russia) ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేని ఫిన్లాండ్ (Finland) తాజాగా 31వ సభ్య దేశంగా నాటోలో (Nato) చేరింది. ఈ నేపథ్యంలో నాటో అంటే ఏంటీ? దాని ఉనికి ఏ విధంగా మొదలైందో తెలుసుకోండి.
ఉక్రెయిన్ (Russia-ukraine)పై రష్యా దండయాత్ర కారణంగా ఈ మధ్య కాలంలో నాటో (Nato) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉక్రెయిన్ (Ukraine) నాటోలో చేరడానికి ఆసక్తి చూపడమే యుద్ధానికి అసలు కారణం. ఈ యుద్ధం కొనసాగుతుండగానే రష్యా (Russia) సరిహద్దు దేశం ఫిన్లాండ్ (Finland) నాటోలో (Nato) సభ్యత్వం పొందింది. సభ్యత్వం కోసం మరో దేశం స్వీడన్ (Sweden) ఎదురు చూస్తోంది. ఐరోపా సమాఖ్యలోని (European union) కీలక దేశం ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో చేరడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది.
నాటో ఎలా ఏర్పాటైంది?
రెండో ప్రపంచ యుద్ధం (1939-45) అనంతరం తూర్పు యూరప్లోని చాలా ప్రాంతాల నుంచి సోవియట్ సేనలు వైదొలగేందుకు నిరాకరించాయి. 1948లో బెర్లిన్ను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో సోవియట్ను కట్టడి చేయడానికి కూటమిగా ఏర్పడాలని 12 దేశాలు భావించాయి. ఇదిలా ఉంటే.. యుద్ధంతో చితికిపోయిన చాలా ఐరోపా దేశాలు ఆర్థికంగా, భద్రతాపరంగా నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతున్నాయి. పరిశ్రమలు స్థాపించడానికి, ఆహారోత్పత్తి పెంపొందించడానికి వాటికి భారీగా నిధుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐరోపాను బలోపేతం చేసి కమ్యూనిస్టు పాలన విస్తరించకుండా చేయాలని అమెరికా పావులు కదిపింది. 1948లో అమెరికా మార్షల్ ప్లాన్ను రూపొందించింది. సెక్రటరీ జార్జ్ మార్షల్ ప్రతిపాదించిన మేరకు భారీ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ చర్య అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాల మధ్య బంధాన్ని బలపరచింది. మరో వైపు సోవియట్ యూనియన్ ఈ సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తూర్పు ఐరోపాలో తన ఆధీనంలో ఉన్న దేశాలను ఈ సహాయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య తూర్పు, పశ్చమ ఐరోపా విభజనకు కారణమైంది. సోవియట్ యూనియన్ నుంచి పశ్చిమ ఐరోపా దేశాలకు సామూహిక భద్రత అందించడానికి యునైటెడ్ స్టేట్స్ చొరవతో 1949లో ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ నాటో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంటుంది. అప్పటి నుంచి ఇది రాజకీయ, సైనిక మార్గాల ద్వారా తమ సభ్య దేశాల స్వేచ్ఛ, భద్రతను కాపాడుతోంది.
సభ్య దేశాలివీ..
నాటోలో తొలుత బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యూఎస్ సభ్య దేశాలుగా చేరాయి. తరువాత దశల వారీగా గ్రీస్, టర్కీ, వెస్ట్ జర్మనీ(1990 తరువాత నుంచి జర్మనీ), బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా, అల్బేనియా, క్రొయేషియా, మాంటెనిగ్రో, నార్త్ మాసిడోనియా, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలండ్, స్పెయిన్, చేతులు కలిపాయి. ఫ్రాన్స్ సభ్యదేశంగా ఉంటూనే సమీకృత మిలటరీ కమాండ్ నుంచి 1966లో వైదొలిగింది. 2009లో మళ్లీ పూర్తి స్థాయిలో భాగమైంది. తాజాగా నాటో జాబితాలోకి ఫిన్లాండ్ చేరింది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అన్ని సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అంతా కలిసి ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతారు.
పరిపాలన-మిలటరీ
నాటో ఏర్పాటైన తరువాత పరిపాలన వ్యవహారాలు, మిలటరీ వ్యవహారాలు చూడటానికి వేర్వేరు విభాగాలు ఏర్పడ్డాయి. నాటో ప్రతినిధులతో నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్, న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్ ఏర్పాటైంది. కౌన్సిల్ సూచన మేరకు ‘సుప్రీం అలైడ్ కమాండర్ యూరప్’ ఏర్పాటైంది. ఇది నాటోలో రెండవ అత్యున్నత సైనిక స్థానం. దీనికి అమెరికన్ నేతృత్వం వహిస్తారు. సెక్రటరీ జనరల్గా యూరోపియన్ కొనసాగుతారు. నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్లో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు మంత్రివర్గ సభ్యులుగా ఉంటారు. వీరంతా ఏడాదికి రెండు సార్లు తప్పకుండా సమావేశమవుతారు. ఇతర సమాయాల్లో నాటో సెక్రటరీ జనరల్ అధ్యక్షత వహిస్తూ రాయబారుల స్థాయిలో శాశ్వత సమావేశాలు నిర్వహిస్తుంటారు.
మిలటరీ వ్యవహారాల కమిటీలో సభ్యదేశాల మిలటరీ ఉన్నతాధికారులు ఉంటారు. ఇందులోనూ రెండు విభాగాలున్నాయి. ఒకటి అలైడ్ కమాండ్ ఆపరేషన్స్(ఏసీవో), రెండోది అలైడ్ కమాండ్ ట్రాన్స్ఫార్మేషన్(ఏసీటీ). ‘ఏసీవో’కు ‘సుప్రీం అలైడ్ కమాండర్ యూరప్’ అధ్యక్షుడిగా ఉంటారు. ఇది బెల్జియంలోని ‘సుప్రీం హెడ్ క్వార్టర్స్ అలెడ్ పవర్స్ యూరప్(షేప్)లో ఉంటుంది.
అపారమైన సైనిక శక్తి
నాటోకు అపారమైన సైనికశక్తి ఉంది. మొత్తం సైనికుల సంఖ్య 33 లక్షలు. వీరిలో 8లక్షల మంది యాక్టివ్ దళాలు. ఇందులో అమెరికా సైనికులు 13 లక్షల దాకా ఉన్నారు. నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్ 1,106 బిలియన్ డాలర్లుగా ఉంది. దాదాపు 40 వేల నాటో సైనికులు ఎల్లవేళలా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు.
రష్యా ‘వార్సా ఒప్పందం’
1950లో జరిగిన పారిస్ ఒప్పందం ద్వారా పశ్చిమ జర్మనీకి సభ్యత్వం ఇచ్చేందుకు నాటో అంగీకరించింది. ఈ చర్య సోవియట్ యూనియన్కు మింగుడుపడలేదు. దాంతో మధ్య, తూర్పు ఐరోపా దేశాలతో కలిసి ‘వార్సా ఒప్పందం’ కూటమిని తయారు చేసింది. దీన్ని అధికారికంగా ‘వార్సా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అని పిలుస్తుంటారు. ఇందులో అల్బేనియా, బల్గేరియా, చెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలండ్, రొమేనియా సభ్య దేశాలుగా చేరాయి. 1968లో అల్బేనియా, 1990లో తూర్పు జర్మనీ ఇందులో నుంచి బయటకు వచ్చాయి. 1989 నాటికి తూర్పు ఐరోపాలో ప్రజాస్వామ్య విప్లవాలు ఊపందుకున్నాయి. దాంతో 1991 జులై 1 నాటికి వార్సా ప్రస్థానం ముగిసిపోయింది. అదే ఏడాది డిసెంబర్ 26న సోవియట్ పతనమైంది. మొత్తం 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. అందులో ఉక్రెయిన్ కూడా ఒకటి. కొన్ని దేశాలు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మరికొన్ని అమెరికా ప్రోద్బలంతో నాటోలో చేరాయి. అప్పటి నుంచి రష్యా ఒంటరైపోయింది.
నాటో-రష్యా కస్సుబుస్సులు
నాటో చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా రష్యాకు కంటగింపుగా ఉంటుంది. ముఖ్యంగా నాటో తూర్పు దిశగా విస్తరించడాన్ని రష్యా అంగీకరించడం లేదు. తమ సరిహద్దు దేశాలను నాటోలో చేర్చుకోవడం కూడా రష్యా, నాటోకు మధ్య శత్రుత్వం పెంచుతోంది. నాటో-రష్యాకు మధ్య జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలివి..
- 1994లో రష్యా, నాటోతో శాంతి స్థాపన కార్యక్రమంలో చేతులు కలిపింది.
- 2002లో రష్యా-నాటో కౌన్సిల్ ఏర్పాటైంది. భద్రతాపరమైన సవాళ్లు, ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
- 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకోవడంతో నాటో.. రష్యాకు ఇతర సహకారాలను నిరాకరించింది. కానీ, రష్యా-నాటో కౌన్సిల్ మాత్రం రద్దు కాలేదు.
- 2021లో బ్రసెల్స్ నుంచి 8 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు.
- 2022లో ఉక్రెయిన్ను నాటోలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేయడం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా