James wilson-Budget : బ్రిటిష్ ఖజానాకు గండి .. బడ్జెట్ రూపకల్పనకు జేమ్స్ విల్సన్ నాంది
భారత్లో తొలిసారి బ్రిటిష్ వలస పాలకులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సిపాయిల తిరుగుబాటు అందుకు కారణమైంది. బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అప్పటి ఆర్థిక నిపుణుడు జేమ్స్ విల్సన్ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో తెలుసుకోండి.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి భారత్లో బడ్జెట్(Budget) ప్రవేశపెడుతున్నారు. అయితే బ్రిటిష్ హయాంలో(british rule) దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని రూపకర్త ఎవరు? ఆయన ఎలాంటి విధానాలతో భారత తొలి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారో చదివేయండి మరి.
1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. సాఫీగా సాగిపోతున్న బ్రిటిష్ పాలనకు అదో కంటగింపు చర్యగా మారింది. ఆ తర్వాత నుంచి తిరుగుబాటుదారులను అణచివేయడానికి బ్రిటిష్ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయానికి బాగా గండి పడింది. ఈ నేపథ్యంలో భారత(india) ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి 1859వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా(queen victoria).. జేమ్స్ విల్సన్(james wilson) అనే ఆర్థిక నిపుణుడిని నియమించింది. అప్పటికే ఆయన ఎకనామిస్ట్ పత్రికను నడిపేవాడు. ఆర్థిక సిద్ధాంతాలు, పాలసీలపై ఆయనకు బాగా పట్టు ఉండేది. వాణిజ్య వ్యవహారాలపై విల్సన్కు అపార జ్ఞానం ఉందని ఇంగ్లాండ్(england) విశ్వసించేది. కారల్ మార్క్స్ తాను రచించిన ‘క్యాపిటల్’ గ్రంథంలో విల్సన్ను ‘యాన్ ఎకనామిక్ మాండరిన్ ఆఫ్ హై స్టాండింగ్’గా అభివర్ణించాడు.
ఎవరీ జేమ్స్ విల్సన్?
జేమ్స్ విల్సన్ స్కాట్లాండ్లోని హావిక్ పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. కుటుంబం మొత్తం టోపీలు తయారు చేసి విక్రయించేవారు. జేమ్స్కు న్యాయశాస్త్రం చదవాలని ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా టోపీల వ్యాపారానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తూనే జేమ్స్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. వ్యాపార నిమిత్తం 1824లో లండన్కు మకాం మార్చాడు. అక్కడ వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ.. కార్న్ చట్టాలను తొలగించాలని కరపత్రాల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించేవాడు. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకులు ఉండకూడదని అనేక వ్యాసాలను రచించాడు. ఆ క్రమంలోనే ఎకనామిస్ట్ పత్రికను స్థాపించాడు. వ్యాపారాన్ని వీడి పూర్తి సమయం పత్రికను నడిపేందుకు కేటాయించాడు. తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. హౌస్ ఆఫ్ కామన్స్కు ఎంపికయ్యాడు. జేమ్స్ పనితీరు నచ్చడంతో బ్రిటిష్ ప్రధాని జాన్ రస్సెల్ ఆయన్ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగాడు.
భారత్లో ఆర్థిక పరిస్థితులు గతి తప్పిన నేపథ్యంలో జేమ్స్ విల్సన్ను వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆర్థిక సభ్యుడిగా నియమించారు. దాంతో అయిష్టంగానే విల్సన్ భారత్లోకి అడుగుపెట్టాడు. కోల్కతా నుంచి లాహోర్ వరకు ప్రయాణించి రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి భారత పరిస్థితులను అవగతం చేసుకున్నాడు. ఆర్థిక రంగం పురోగతి సాధించి.. పరిపాలన సాఫీగా సాగాలంటే ఐదు సంస్కరణలు చేయాలని భావించాడు.
అవేంటంటే.. 1. వ్యాపార వర్గాలపై పన్ను(tax) వేయడం 2. పేపర్ కరెన్సీ తీసుకురావడం 3. బడ్జెట్, అంచనాలను సిద్ధం చేయడం 4. సివిల్ పోలీసుల నియామకం 5. ప్రజా పనులు, రోడ్లు వేయడం. ఇవే కాకుండా మిలిటరీ ఫైనాన్స్ కమిషన్, సివిల్ ఫైనాన్స్ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని.. దాంతో నిధుల కేటాయింపు, ఖర్చులపై ఓ స్పష్టత వస్తుందని ఆశించాడు.
అప్పుడే తొలి బడ్జెట్
భారత దేశ వైవిధ్యం, ప్రజలు, ప్రాంతాల అవసరాలపై పట్టు సాధించిన జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో వివిధ డ్యూటీలను హేతుబద్ధీకరణ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్, లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీ ఉంటాయని చెప్పాడు. ఐదేళ్లపాటు ట్యాక్సుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. అయితే జేమ్స్ ప్రతిపాదనలను అప్పటి మద్రాస్ గవర్నర్ ఛార్లెస్ ట్రెవెలియన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీలపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అలా భారత్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విల్సన్ 1860 ఆగస్టు 11వ తేదీన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు. కోల్కతాలోని ముల్లిక్ బజార్లోనే ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. భారత్లో ఆయన ఉన్నది ఎనిమిది నెలలే అయినప్పటికీ అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యారు. విల్సన్ సేవలను కీర్తిస్తూ కోల్కతాలోని వ్యాపార వర్గాలు డల్హౌసీ ఇన్స్టిట్యూట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత తొలి ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి బడ్జెట్ను రూపొందించారు. 1947 నవంబర్ 26న ఆయన బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రూ.197 కోట్లతో బడ్జెట్ తయారు చేయగా.. దాదాపు రూ.92.74 కోట్లను రక్షణ రంగానికి కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా