ఇక్కడే 11 లక్షలమందిని చంపేశారు..
చిన్నారి షెండికి ఏమీ అర్థం కావడం లేదు.. అందరూ ఇంట్లోని సామాన్లను సర్ధుకుంటున్నారు.. ఇంతలో తలుపులపై గట్టిగా శబ్దం.. త్వరగా రెడీ కావాలంటూ అధికారంతో నిండిన గొంతు హెచ్చరిక.. వెంటనే షెండి తల్లిదండ్రులు తమ వస్తువులను తీసుకొని కుమార్తెతో పాటు బయటకొచ్చేశారు..
చిన్నారి షెండికి ఏమీ అర్థం కావడం లేదు.. అందరూ ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్నారు.. ఇంతలో తలుపులపై గట్టిగా శబ్దం.. త్వరగా రెడీ కావాలంటూ అధికారంతో నిండిన గొంతు హెచ్చరిక.. వెంటనే షెండి తల్లిదండ్రులు తమ వస్తువులను తీసుకొని కుమార్తెతో పాటు బయటకొచ్చేశారు.. అది ఐరోపాలోని ఒక చిన్న పట్టణం.. నగరంలో ఉన్న 1200 మంది యూదు జాతీయులను బయలుదేరమని జర్మన్ నాజీలు ఆదేశించారు. అయితే తాము వెళ్లబోయేది మృత్యుకేంద్రానికి అని వారికి తెలియదు.. తమ దేశాన్ని ఆక్రమించిన నాజీలు తమను దూరంగా ఉండే కర్మాగారాల్లో పనిచేసేందుకు తీసుకువెళుతున్నారని వారు భావించారు. వెంటనేవారిని ఒక గూడ్సురైలులో పోలండ్లోని ఆష్విజ్కు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే వేలాదిమంది యూదులున్నారు.
ఆష్విజ్ లక్షలాది హత్యలకు వేదిక..
1939లో పోలండ్ను నాజీ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపాలోని యూదులతో పాటు నాజీ వ్యతిరేకమైన ఇతర జాతీయులను నిర్మూలించాలన్న హిట్లర్ యోచన కార్యరూపం దాల్చింది. పోలండ్లోని ఆష్విజ్లో ఒక కర్మాగారం లాంటి బందీఖానను నిర్మించారు. యూరప్లోని పలు దేశాలను ఆక్రమించిన నాజీలు అక్కడ ఉన్న యూదులను కుటుంబాలతో సహా ఇక్కడకు పంపించేవారు. అక్కడ వారిని గ్యాస్ ఛాంబర్లకు పంపించి సామూహికంగా హత్య చేసేవారు.
బలహీనంగా కనిపిస్తే చాలు..
అప్పటికే గూడ్సురైలు ప్రయాణంలో నీరసపడిన యూదులు ఇక్కడకు చేరుకోవగానే వైద్య పరీక్షలు నిర్వహించేవారు. బలహీనంగా ఉన్న వారిని గ్యాస్ ఛాంబర్లకు పంపించేవారు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఎలాంటి అంటురోగాలు రాకుండా పరీక్షలకని నమ్మించేవారు. ఒక వేళ దీన్ని ఎవరైనా పసిగట్టి పారిపోవాలని యత్నిస్తే జాగిలాలు వెంటపడేవి. వారిని సైనికులు కాల్చిచంపేవారు.
15 నిమిషాల్లోనే 2000 మందిని చంపేవారు..
గ్యాస్ ఛాంబర్లలోకి ఒక్కో దఫాలో 2 వేలమంది వరకు పంపించేవారు. వీరిని చంపేందుకు నాజీలు ప్రత్యేకమైన విషవాయువులను తయారుచేశారు. దాదాపు 15 నిమిషాల్లో ఈ వాయువులను పీల్చినవారు మృత్యు ఒడికి చేరుకునేవారు. అనంతరం శవాలపై బంగారు ఆభరణాలుంటే సైనికులు దోచుకునేవారు. ఇక్కడ దాదాపు 11 లక్షలమందిని చంపివేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒక నెల బిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఎలాంటి జాలి లేకుండా చంపివేశారు. వీరిలో యూదులతో పాటు 75 వేలమంది పోలిష్ జాతీయులు, 21 వేల రోమా జాతీయులు, 14 వేలమంది సోవియట్ యుద్ధఖైదీలు ఉన్నారు.
సోవియట్ ప్రవేశంతో విముక్తి..
1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. లక్షలాదిమంది మృతికి కారణమైన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యన్సేనలు ఇక్కడ ప్రవేశం చేసి బందీలను విముక్తి చేశారు. అయినవారు అందరూ చనిపోగా మిగిలి ఉన్న కొందరు జీవచ్ఛవాలుగా మిగిలారు.1945 జనవరి 27న ఆష్విజ్ను రష్యన్ సేనలు విముక్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఊచకోతలో బలైన లక్షలాదిమంది జ్ఞాపకార్థం యూరప్, అమెరికా, ఇజ్రాయెల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!