రూ. కోట్ల ఖర్చు.. బూడిదలో పోసిన పన్నీరై..
అవసరానికో.. ఆర్భాటానికో, ఆకర్షణకో.. ఆదాయానికో ఉద్దేశం ఏదైనా ప్రభుత్వాలు.. నిర్మాణ సంస్థలు.. తాము చేపట్టిన భారీ నిర్మాణాలు వైవిద్యంగా ఉండాలని కోరుకుంటాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇందుకోసం కోట్ల రూపాయిలు వెచ్చిస్తాయి. మరి అలాంటి
అవసరానికో.. ఆర్భాటానికో, ఆకర్షణకో.. ఆదాయానికో ఉద్దేశం ఏదైనా ప్రభుత్వాలు.. నిర్మాణ సంస్థలు.. తాము చేపట్టిన భారీ నిర్మాణాలు వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. మరి అలాంటి భారీ నిర్మాణాలు అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతే.. వాటికి ఎంత నష్టం.. ఎంత కష్టం. అలా ప్రపంచవ్యాప్తంగా భారీ ఖర్చుతో చేపట్టి అర్ధాంతరంగా నిలిచిపోయిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందామా..?
ఖర్చు భారం పెరిగి.. మధ్యలో ఆగి
విద్యుత్ రంగానికి సంబంధించి టెక్సాస్ ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. స్విట్జర్లాండ్ వద్ద ఉన్న లార్జ్ హైడ్రాన్ కొల్లైడర్కి దీటుగా ఉండాలని 1980లో టెక్సాస్లో ‘సూపర్ కండక్టింగ్ సూపర్ కొల్లైడర్’ నిర్మాణం ప్రారంభించింది. 1990 నాటికి ప్రాజెక్టులో భాగంగా 15 మైళ్ల సొరంగం తవ్వారు. సొరంగం తవ్వే క్రమంలో 17 యంత్రాలు భూగర్భంలో కూలిపోయాయి. దీంతో ప్రాజెక్టు భారం మరింత పెరిగింది. ఏకంగా 4.4 బిలియన్ డాలర్లు (సుమారు ₹31.3వేల కోట్లు) నుంచి 11 బిలియన్ డాలర్లు (సుమారు ₹78.3వేల కోట్లు)కు చేరింది. ప్రాజెక్టు నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయి. దీంతో ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారు. ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల దాదాపు రూ.26.3 వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది.
ఆ హోటల్ది మేకపోతు గాంభీర్యం
1987లో ఉత్తర కొరియా ఒక హోటల్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఆ దేశ రాజధాని ప్యోగ్యాంగ్లో పిరమిడ్ ఆకారంలో 1,080 అడుగుల ఎత్తు ఉండేలా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ర్యోగ్యాంగ్ హోటల్గా నామకరణం చేసిన ఈ భవనంలో 105 అంతస్తులు ఉండేలా నిర్మాణం మొదలుపెట్టారు. అయితే సోవియట్ యూనియన్ విడిపోవడంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తి 1992లో ఈ నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. రూ.వేలకోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టు పనులు 2008లో ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. భవనం వెలుపల అద్దాలను అమర్చారు. అయితే భవనం లోపల నిర్మాణం మాత్రం జరగలేదు. అప్పట్లో దేశంలో భవన నిర్మాణానికి కావాల్సిన ముడి సరకులు లేకపోవడంతో నిర్మాణం మళ్లీ ఆగిపోయింది. 2017లో హోటల్వైపు రోడ్డు.. 2018లో అద్దాలపై ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంతే.. ఇప్పటికీ హోటల్ లోపల అంతా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అది కేవలం సందర్శక కట్టడంలాగే ఉంటోంది. భవిష్యత్తులో అయినా నిర్మాణం పూర్తి చేసే అవకాశం తక్కువే అని నిపుణులు చెబుతున్నారు.
ఎస్కలేటర్ నుంచి టేబుల్ వరకు అన్ని కొలతలు తప్పే
బెర్లిన్లో ఎయిర్పోర్టు నిర్మించాలని 1989లో ప్రణాళిక సిద్ధం చేసినా.. దానికి 2006లో అనుమతి లభించింది. వెంటనే పనులు ప్రారంభించారు. 2011 అక్టోబర్ నాటికి ఎయిర్పోర్టును అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2.7 బిలియన్ డాలర్లు(దాదాపు ₹19.2వేల కోట్లు) వ్యయం అంచనా వేశారు. అయితే అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం పడుతుందని భావించి 2012 జూన్లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. అప్పటికే ఎయిర్పోర్టు నిర్మాణంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఎస్కలేటర్స్ నుంచి టేబుల్స్ వరకు ఏవీ కొలతలకు తగ్గట్టుగా లేవు. దీంతో వ్యయభారం 6 బిలియన్ డాలర్ల(సుమారు ₹42వేల కోట్లు)కు పెరిగింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. అవుతుందన్న నమ్మకం లేదంటున్నారు అక్కడి ప్రజలు.
ఎంతో ఊహించి.. ఆఖరికి చతికిల పడి
మాడ్రిడ్ ఎయిర్పోర్టులో ప్రయాణీకుల రద్దీకి పరిష్కారంగా సియూడాడ్ రియల్లో మరో ఎయిర్పోర్టు నిర్మించాలనుకుంది స్పెయిన్. దీంతో ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. 1 బిలియన్ డాలర్లు (₹7.1వేల కోట్లు) వ్యయంతో ‘సియూడాడ్ రియల్ సెంట్రల్’ ఎయిర్పోర్టును అద్భుతంగా నిర్మించి 2009లో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఏడాదికి కోటి మంది ప్రయాణీకులు వస్తారనుకుంటే.. వేల సంఖ్యలో ప్రయాణికులే ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణం సాగించారు. దీంతో ఎయిర్పోర్టు నిర్వహణ చూస్తున్న కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది. దివాలా తీసే పరిస్థితి రావడంతో 2012లో ఎయిర్పోర్టును మూసివేశారు. ఆ ఎయిర్పోర్టును చైనాకు చెందిన ఓ కంపెనీకి అమ్మేశారు. దాన్ని పునఃప్రారంభిస్తారో.. పూర్తిగా మూసివేస్తారో అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఆ ప్రాజెక్టులో అన్నీ లోపాలే
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్.. ఫ్లేమన్విల్లేలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ను నిర్మించాలనుకుంది. ఈ మెగా ప్రాజెక్టు ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ విద్యుత్రంగ సంస్థ ‘ఈడీఎఫ్’కు దక్కింది. 3.3బిలియన్ డాలర్లు (₹23.5వేల కోట్లు)వ్యయంతో 2007లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2012నాటికి నిర్మాణం పూర్తయి పనులు ప్రారంభించాలని నిర్దేశించుకున్నారు. కానీ, ఇప్పటికీ అది పూర్తి కాలేదు. నిర్మాణ లోపాలు, పేలుళ్ల కారణంగా అనేక సార్లు పనులు నిలిచిపోయాయి. అలా ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 12 బిలియన్ డాలర్ల(₹85వేల కోట్లు)కు చేరింది. ఎప్పటికి పూర్తవుతుందో మాత్రం చెప్పలేమంటున్నారు అక్కడి నిపుణులు.
కట్టేస్తామన్నారు.. కోర్టు కేసులో చిక్కుకున్నారు
1906లో వచ్చిన భూకంపంతో చెల్లాచెదురైన శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతాన్ని బాగుచేసి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు అక్కడి అధికారులు. ఆ ప్రాంతాన్ని నివాస సముదాయాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, ఆఫీసులు పెట్టుకునేలా తీర్చిదిద్దాలని భావించారు. ఇందుకోసం 8 బిలియన్ డాలర్లు (₹56.9వేల కోట్లు)వ్యయంతో 2030లోపు ఇవ్వాలని ప్రణాళిక చేశారు. అనుకున్నట్టుగానే ప్రాజెక్టును 2013వ సంవత్సరంలో ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభంలోనే కొందరు ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న ప్రాంతం గురించి అసలు విషయం బయటపడటంతో అందరూ షాక్కి గురయ్యారు. ఆ ప్రాంతం 1940 - 1960 మధ్య కాలంలో అమెరికా సైన్యం అక్కడ న్యూక్లియర్ ప్రయోగాలు జరిపిందని, ఆ ప్రాంతమంతా విషపూరితంగా మారిందని తేలిందట. నకిలీ ధ్రువపత్రాలతో ప్రాజెక్టును ప్రారంభించారని కంపెనీపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఆగిపోయి.. ఆ కేసు కోర్టులో ఉంది.
₹64వేల కోట్లు రియాకర్ట్లో పోసిన పన్నీరు
న్యూక్లియర్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. అందుకే యూఎస్లోని మూడు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు న్యూక్లియర్ రియాక్టర్ల ప్రాజెక్టును ప్రారంభించాలనుకున్నాయి. సౌత్ కరోలినా ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్, శాంటీ కూపర్, వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీలు కలిసి 2013లో సౌత్ కరోలినాలోని విర్గిల్ సి. సమ్మర్ న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్లో రెండు ఏపీ1000 న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం ప్రారంభించాయి. ఇందుకోసం 11.5 బిలియన్ డాలర్లు (₹82వేల కోట్లు) కేటాయించాయి. అయితే అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. ఎలాగైనా 2020లో ప్రారంభించాలని నిర్దేశించుకున్నాయి. కానీ, అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా.. 2017లో వెస్టింగ్హౌస్ కంపెనీ రుణ ఊబిలో చిక్కుకొని దివాలా తీసింది. దీంతో మూడు సంస్థల మెగా ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పటివరకు నిర్మాణం కోసం ఖర్చు చేసిన 9 బిలియన్ డాలర్లు(₹64.1వేల కోట్లు) బూడిదలో పోసిన.. కాదు కాదు రియాక్టర్లో పోసిన పన్నీరైంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు ఆ రెండు రియాక్టర్లను కొని ప్రాజెక్టును కొనసాగించేందుకు ఆసక్తి చూపించాయి. కానీ అది కార్యారూపం దాల్చడం కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు