కరోనాతో చైనాకు కలవరమే!
‘కరోనా’.. చైనా సహా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ వల్ల 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ నగరం గుండా....
‘కరోనా’.. చైనా సహా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ వల్ల 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ నగరం గుండా ప్రయాణాలపై చైనా నిషేధం విధించింది. కరోనాపై పోరాడేందుకు శతవిధాలా పోరాడుతోంది. ఒకవేళ ఈ వైరస్ మరింత వృద్ధి చెందితే చైనా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందన్నది కాదనలేని వాస్తవం. కారణం.. వుహాన్ నగరం. అభివృద్ధిలో దూసుకుపోతూ.. దేశ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండడమే ఇందుక్కారణం. మోదీ-జిన్పింగ్ భేటీకి ఇదే నగరం వేదిక అయ్యింది. దీనిబట్టి ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వుహాన్కు ఎందుకు అంత ప్రాధాన్యం? ఆ దేశ ఆర్థికంలో దాని పాత్ర ఎంత?
* చైనాకు మధ్యలో ఉన్న హుబెయ్ ప్రావిన్స్ రాజధాని నగరం వుహాన్. యాంగ్టేజే నదీ తీరంలో ఉన్న విస్తరించిన ఉన్న అతి పెద్ద నగరం. సుమారు 1.1కోట్ల మంది నివసిస్తున్నారు.
* 1927లో చైనాకు ఈ నగరం రాజధానిగానూ ఉంది. రోడ్లు, రైల్వే, నౌకాయానం కలిగి చైనాలోని అన్ని నగరాలతోనూ ఈ నగరం అనుసంధానమై ఉంది. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ట్రాన్స్పోర్ట్ హబ్గా నిలుస్తున్న ఈ నగరానికి ‘చికాగో ఆఫ్ చైనా’ అని కూడా పేరుంది.
* ఉత్తర- దక్షిణంగా ఉండే బీజింగ్-గాంగ్జౌ, తూర్పు-పశ్చిమంలో ఉండే షాంగై-చెంగ్డూ మధ్య నడిచే అతి పొడవైన హైస్పీడ్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నగరం సొంతం. మధ్య చైనా నుంచి ఐదు ఖండాలకు ఇక్కడి నుంచి విమాన సదుపాయం ఉంది. లండన్, మాస్కో, రోమ్, న్యూయార్క్ వంటి సుమారు 109 నగరాలకు ఇక్కడి నుంచి నాన్స్టాప్ విమాన సర్వీసులు ఉన్నాయి.
* ప్రపంచంలో టాప్-500 కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, ఎస్ఏపీ, ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ పీఎస్ఏ వంటి సుమారు 300కు పైగా కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయంటే.. ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.
* 53కు పైగా యూనివర్సిటీలు ఈ నగరంలో ఉన్నాయి. వుహాన్ యూనివర్సిటీ అందులో అతిపెద్దది. ఈ ఒక్క యూనివర్సిటీలోనే సుమారు 60వేలమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వుహాన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా.
* అందుకే రాజధాని బీజింగ్ నగరం అయినప్పటికీ.. 2018లో వుహాన్లో మోదీ-జిన్పింగ్ ఇక్కడ సమావేశమవ్వడం గమనార్హం. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు కూడా ఇక్కడ కొలువుదీరుతున్నాయి.
ఆర్థికంగా ప్రభావం..
* రెండో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయికి చేరిన వృద్ధిరేటుపై కరోనా తాటి పండు రూపంలో మూలిగే నక్కపై పడడమనే చెప్పాలి. 2019లో వుహాన్ జీడీపీ 7.8గా నమోదైంది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 1.7శాతం అధికం. వైరస్ ప్రభావం వల్ల దేశ జీడీపీలో 0.5 నుంచి 1 శాతం కోత పడే అవకాశం ఉందని వృద్ధి రేటు అంచనాల సంస్థ ‘ద ఎకనామిస్ట్’కు చెందిన ఇంటిలిజెన్స్ విభాగం అంచనా వేసింది.
* ఈ వైరస్ మరింత విస్తరిస్తే వైద్యంపై ఆ దేశం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి తలకుమించిన భారం కానుంది.
* ప్రయాణాలపై నిషేధం ఆర్థికంగా ప్రభావం పడుతుంది. ఈ నగరానికి దేశం, ప్రపంచంలోని చాలా నగరాలతో రవాణా అనుసంధానం కలిగి ఉండడమే ఇందుకు కారణం.
* ఒక్క లూనర్ నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యేందుకు ఈ నగరం గుండా సుమారు 1.5 కోట్ల మంది ప్రయాణించాల్సి ఉండగా.. ప్రయాణాలపై నిషేధం విధించడంతో వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వెలవెలబోయాయి.
* 2013లో కరోనా తరహాలో అప్పట్లో సార్స్ పడగ విప్పడంతో చైనాలో రిటైల్ వ్యాపారంపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది. వృద్ధి సగానికి పడిపోయింది. అయితే, ఇది తాత్కాలికమేనని ఆ దేశ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం