కరోనా ఎఫెక్ట్: కళ తప్పిన సందర్శక ప్రాంతాలు
పర్యాటకం.. మనసుకు ఉల్లాసానిచ్చే.. దేహానికి కొత్త శక్తినిచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే బ్యాగ్ సిద్ధం చేసుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్ వల్ల పర్యాటక
పర్యాటకం.. మనసుకు ఉల్లాసాన్ని.. శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు.. వైరస్ భయంతో పర్యటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ రాకముందు.. వచ్చిన తర్వాత సందర్శక ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే...
చైనా వాల్.. ఇప్పుడు నిల్
చైనా గోడ.. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. దీనిని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. రెండు నెలల క్రితం నూతన సంవత్సర వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. కానీ ఆ దేశంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చైనా గోడను మూసివేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.
ది టెంపుల్ ఆఫ్ హెవెన్.. ఇప్పుడు వెలవెలబోయెన్
చైనా రాజధాని బీజింగ్లో ‘ది టెంపుల్ ఆఫ్ హెవెన్’ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. చైనా సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటీవల ఆ దేశంలో విజృంభించిన కరోనా వైరస్ కారణంగా 3వేల మందికిపైగా చైనీయులు మృతి చెందారు. 80వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. నియంత్రణ చర్యలో భాగంగా ఆ దేశంలో పర్యాటకం మూతపడింది. సందర్శకుల రాక నిలిచిపోవడంతో ది టెంపుల్ ఆఫ్ హెవెన్ వెలవెలబోతోంది.
ఇటలీ.. సందర్శక ప్రాంతాలు ఖాళీ
అత్యధికంగా పర్యటకులు వెళ్లే ప్రాంతం ఇటలీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విషయంలోనూ అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశం కూడా అదే. కరోనా వ్యాప్తికి ముందు ఇటలీలోని ట్రెవి ఫౌంటెన్ వద్ద రోజుకు వేల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. ఇప్పుడు కరోనా వల్ల సందర్శకుల తాకిడి బాగా తగ్గింది. కొంతమంది మాస్కులు.. ముందస్తు జాగ్రత్తలు వహిస్తూ ఫౌంటెన్ను సందర్శిస్తున్నారు.
టైమ్స్ స్క్వేర్.. జీరో పీపుల్
ప్రపంచంలో అత్యధికంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఒకటి. అక్కడ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్స్, ఆఫీస్లు ఎక్కువగా ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కాలు పెట్టే సందు లేకుండా ప్రజలు నడుస్తూ కనిపిస్తారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకి ఆ ప్రాంతానికి మనుషులు రావడం మానేశారు. దీంతో రోడ్లన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో నిండిపోయే గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, సబ్వేలు కూడా కరోనా ప్రభావంతో కళ తప్పాయి.
డిస్నీపార్క్స్.. చడిచప్పుడు లేదు
పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీపార్కులు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా నార్త్ అమెరికాలో ఉన్న డిస్నీపార్కులు, హోటల్స్, స్టోర్స్ను మూసివేస్తున్నట్లు డిస్నీ యాజమాన్యం తెలిపింది. దీంతో రోజు పిల్లలతో సందడిగా ఉండే పార్కులు ఇప్పుడు మూగబోయాయి.
సందర్శకులు లేని తాజ్మహల్.. భక్తులు లేని తిరుమల
భారత్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పలు సందర్శక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ కూడా సందర్శకులు లేక బోసిపోతోంది. అలాగే నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా మూసివేశారు. శ్రీవారం దర్శనం నిలిపివేయడంతో భక్తులు లేక తిరుమల వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM