కరోనాకు బలహీనులం కావొద్దు.. కర్ఫ్యూ ధ్యేయమిదే
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్. ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది. జనతా గ్యారేజ్. ఇచట అన్ని రిపేర్లూ చేయబడును. ఇదో సినిమా డైలాగ్ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే.......
ప్రజల కోసం ప్రజల చేత మహమ్మారి కట్టడికి వ్యూహం
ఇళ్లు దాటాలనిపిస్తే ఇటలీని గుర్తు తెచ్చుకోండి
మున్ముందు చర్యలకు దిక్సూచి ‘జనతా కర్ఫ్యూ’
‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్. ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది. జనతా గ్యారేజ్. ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ ఇదో సినిమా డైలాగ్ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే..
విశ్వం సంగతెందుకు గానీ ఈ భూమ్మీద మాత్రం అత్యంత బలవంతుడు మనిషే. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంది. ఆలోచించే తెలివితేటలూ ఉన్నాయి. కరోనా వైరస్ కంటికి కనిపించని ఓ సూక్ష్మక్రిమి. పరిమాణం ప్రకారం అత్యంత బలహీనం. ఇప్పుడా బలవంతుడినే బలహీనుడిగా మార్చేసిందది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది కొవిడ్-19. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే సంకల్పం, సంయమనం. ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి రిపేరు. ప్రధాని మోదీ సూచించిన ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే చేయాల్సిన ‘జనతా కర్ఫ్యూ’ వెనుక శాస్త్రీయత చాలానే ఉందంటున్నారు నిపుణులు. మున్ముందు తీసుకోబోయే చర్యలకూ ఇదో మేలి మలుపని అంటున్నారు.
నొక్కి చెబుతున్నా ప్రబలుతోంది
సబ్బుతో చేతులు కడుక్కోండి. సబ్బు, నీరు అందుబాటులో లేనిచోట శానిటైజర్ రాసుకోండి. చేతులతో కళ్లు, ముక్కు, నోరు, ముఖాన్ని తాకకండి. ఇవన్నీ సరిగ్గా చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అన్ని ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి. చాలా వరకు మేలు చేస్తున్నాయి. కానీ మరోవైపు కొవిడ్-19 కేసులు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలు దాటిపోయాయి. వారం రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలు దాటినా ఆశ్యర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైరస్ వ్యాప్తి గొలుసుకట్టులా ఉంది. ఇటలీలోనైతే మరణ మృదంగమే మోగుతోంది. వైరస్ పుట్టిన చైనాలో కన్నా ఎక్కువ మరణాలు అక్కడ నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
వయసు మళ్లిన వృద్ధులకు వైద్యం అందించలేమని ఇటలీ ప్రభుత్వమే చెప్తోందంటే పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ యువతి తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకింది. ఐసోలేషన్లో వేర్వేరుగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. తండ్రి చనిపోయాడు. ఈ సంగతి అతడి భార్యకూ తెలియదు. ఇంట్లో ఉన్న బిడ్డకు సమాచారం అందించారు. అయితే కనీసం తండ్రి ఆఖరి చూపునకూ నోచుకోలేని పరిస్థితి. పౌరులెవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ శాసనం. శ్మశాన వాటికకు తీసుకెళితే అక్కడా మృతదేహాల వరుస. ఏ సమయంలో విద్యుత్ దహనం చేస్తారో తెలియని ఆవేదన. అమ్మ బతుకుతుందో లేదోనన్న బెంగ. ఈ పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మన దేశం ఎంత భద్రంగా ఉందో తలచుకోండి. మనమిలాగే సురక్షితంగా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మనముందున్న ఏకైక మార్గం.
నెలల తరబడి ఐసోలేషన్
వైరస్పై విజయం సాధించేందుకు చైనా యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. కఠిన ఆంక్షలు విధించింది. వైరస్ పుట్టిన వుహాన్ను మొత్తం ఐసోలేట్ చేసింది. శక్తిమంతమైన శుభ్రకాలతో నగరాలన్నీ కడిగేసింది. భారీ యంత్రాలు, రవాణా సాధనలను ఇందుకు ఉపయోగించింది. సాంకేతికను సమర్థంగా వినియోగించింది. ఇంటర్నెట్, బిగ్డేటా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, క్లౌడ్.. ఇలా అన్ని సేవలను వాడుకొంది. వైద్యులు, వైద్య సిబ్బంది నిద్రలేని రాత్రులు గడిపారు. వారు ధరించిన వైద్య రక్షణ మాస్క్ల అచ్చులు పడి ముఖకవళికలే మారిపోయిన చిత్రాలు కలవరపరిచాయి. అయినా వారేమీ వెనుకడుగు వేయలేదు. నెలల తరబడి పౌరులను నిర్బంధంలోనే ఉంచారు. వ్యాపార సంస్థలేవీ నడవలేదు. కేవలం వైద్యం, ఔషధ తయారీ సంస్థలనే తెరిచారు. ఎవ్వరూ అడుగు బయటపెట్టిందే లేదు. చైనా అంతటా సోషల్ డిస్టెన్స్ పాటించారు. మరి అలాంటి పరిస్థితులను మన దేశంలో రోజుల తరబడి అనుభవించకూడదంటే చేయాల్సింది ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం. సామాజిక దూరం అనుసరించడం. పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవడం. ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం.
జనతా కర్ఫ్యూతో తెగనున్న కరోనా గొలుసు
భారత్లో కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదేమీ కావడం లేదని నిర్లక్ష్యం వహించొద్దు. ఈ విశ్వ మహమ్మారి విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిందని, ఇక్కడున్న వారికెవరికీ సోకలేదని అప్రమత్తత వీడొద్దు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఇదే చెప్పారు. ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ అంటే ఎవరికి వారే ఇంటివద్ద ఐసోలేట్ కావడం. దీనివల్ల జరిగే లాభాలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్ గాల్లో 3 గంటలు, రాగి పాత్రలపై 4 గంటలు, కార్డ్బోర్డులపై 24 గంటలు, స్టీల్ పాత్రలపై 2-3 రోజులు, ప్లాస్టిక్ పాత్రలపై 3 రోజులు బతికుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో వచ్చిన పరిశోధన వెల్లడించింది. ఆదివారం రోజు 14 గంటలు అందరం ఇంట్లోనే ఉండటం వల్ల గాల్లోని వైరస్ ఎవరికీ సోకే ప్రమాదం ఉండదు. వైరస్ వ్యాప్తి గొలుసు తెగిపోతుంది. అంటే మూడో దశను దాదాపు అడ్డుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.
మున్ముందు చర్యలకు నాందీవాచకం
ఇంట్లో ఉన్న వారూ తమ ఇంటిని, పాత్రలను డిసిన్ఫెక్టెడ్ క్రిమి సంహారకాలతో శుభ్రం చేసుకొంటే మంచిది. పెద్దలు పిల్లలకు వైరస్లు సంక్రమించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించాలి. ఇక ఉద్యోగులు, ఇంటి యజమానులు తమ తల్లిదండ్రులు కష్టకాలంలో ఎలా నెట్టుకొచ్చారో వంటి వివరాలు తెలుసుకొంటే ప్రేరణ లభిస్తుంది. మున్ముందు ప్రభుత్వం తీసుకొనే కఠిన చర్యలను అమలు చేసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. రాత్రి 9 గంటల తర్వాత బయటకు వెళ్లడం తక్కువగానే ఉంటుంది. అవసరాలు ఏమీ లేకుంటే వెళ్లకపోవడమే మేలు. దాంతో ఉదయం వరకు ఐసోలేట్ అయినట్టు ఉంటుంది. మనం పాటించే ‘జనతా కర్ఫ్యూ’ ద్వారానే ప్రజలెంత సంకల్ప బలం, సంయమనంతో ఉన్నారో ప్రభుత్వాలకు అవగాహన లభిస్తుంది. పరిస్థితిని సమీక్షించి ఆంక్షలను ప్రకటించేందుకు విధించేందుకు ఆస్కారం ఉంటుంది. మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది. ఆ..! నేను బాగానే ఉన్నా. బయటకు ఎందుకెళ్లొద్దు అన్న నిర్లిప్తతకు తావివ్వొద్దు. ఇటలీలో ప్రభుత్వం చెప్పినా తమ సన్నిహితులను కలుస్తూ గుమిగూడుతూ పరిస్థితిని పీకలమీదకు తెచ్చుకున్నారు. గుర్తుంచుకోండి! మనం పాటించే స్వచ్ఛంద కర్ఫ్యూ కరోనాను అడ్డుకోవడానికి చేస్తున్న ఒక రిపేరు. ఇలాంటి రిపేర్లు మరిన్ని జరగకుండా ముందే కరోనా సూక్ష్మక్రిమిని పెద్దకర్రతో కొడదాం. మహమ్మారిపై భారత్ విజయం సాధించేలా చేద్దాం.
-ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా