చైనా మహమ్మారిని వారి పద్ధతిలోనే తరిమేయాలి
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా వణికిస్తోంది. దేశాలన్నీ క్రమంగా లాక్డౌన్ అయిపోతున్నాయి. వైరస్పై సమగ్ర సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలన్నీ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భూ మండలమంతా విస్తరించిన కొవిడ్-19ను చైనా కేవలం వుహాన్ లాక్డౌన్తో కట్టడి చేసింది. ముల్లును....
అలా చేస్తేనే 21 రోజుల లాక్డౌన్ విజయవంతమవుతుందన్న నిపుణులు
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా వణికిస్తోంది. దేశాలన్నీ క్రమంగా లాక్డౌన్ అయిపోతున్నాయి. వైరస్పై సమగ్ర సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలన్నీ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భూ మండలమంతా విస్తరించిన కొవిడ్-19ను చైనా కేవలం వుహాన్ లాక్డౌన్తో కట్టడి చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు చైనా వైరస్ను చైనా పద్ధతుల్లోనే కట్టడి చేయాలని భారత వైద్యులు, నిపుణులు అంటున్నారు. అప్పుడే 21 రోజుల లాక్డౌన్ విజయవంతం అవుతుందంటున్నారు.
చైనా ఎలా చేసింది?
కొవిడ్-19తో ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్లో భయానక పరిస్థితి తలెత్తింది. అగ్రరాజ్యం అమెరికా ఏకంగా వైరస్కు కేంద్రమైన చైనాను దాటేసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ ఉనికి పెరుగుతోందని భావించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. కానీ చైనా 5.6 కోట్లున్న వుబెయ్ ప్రావిన్స్ను మాత్రమే లాక్డౌన్ చేసి విజయం సాధించింది. జనవరి 23 నుంచి అక్కడ 81,340 కేసులు నమోదవ్వగా ఒక్క వుహాన్లోనే 68వేలు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,292. అయితే అందరికీ అర్థం కానిది ఒకే ఒక్క సంగతి. తక్కువ జనాభా గల ఐరోపా దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటిస్తే వుహాన్కు మాత్రమే తాళమేసి మిగతా రాష్ట్రాల్లో వైరస్ను ఎలా కట్టడి చేసింది?
విదేశాలకు వెళ్లడంతోనే వ్యాప్తి
చైనా సంప్రదాయ కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందు వుహాన్ను లాక్డౌన్ చేశారు. కంటి వైద్యుడొకరు ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. దాంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమయంలోనే ఈ సూక్ష్మక్రిమి వుహాన్ మొత్తం వ్యాపించింది. ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించినా అక్కడి ఆస్పత్రులు పట్టించుకోలేదు. కొందరిలో ఈ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సెలవులు రావడంతో చాలామంది చైనీయులు విదేశాలకు వెళ్లారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలకు చేరుకున్నారు. ఇక వుహాన్లో చదువుకుంటున్న మన విద్యార్థులు కొందరు భారత్కు వచ్చారు. కేరళలో కేసులు నమోదు కాగా వైద్యులు విజయవంతంగా వారికి నయం చేశారు. దాంతో మనపై ప్రభావం ఉండదేమో అనుకున్నారు. మహమ్మారిగా ప్రకటించ ముందే విదేశాలకు వెళ్లిన చైనీయులు, స్థానికులు అక్కడ సమూహ వ్యాప్తితో విశ్వవ్యాప్తం చేసేశారు. చైనా మాత్రం ఇతర రాష్ట్రాలకు వుహాన్ నుంచి ఎవరినీ రానివ్వలేదు.
కృత్రిమ మేథ + మానవ మేథ
కరోనాను చైనా చక్కని ప్రణాళికతో కట్టడి చేసింది. ముందు వుహాన్కు తాళమేసింది. జనాలను బయటకు రానివ్వకుండా వైరస్ గొలుసు తెంపేసింది. యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించింది. కిట్లు, పరికరాలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. హుబెయ్ ప్రావిన్స్ లాక్డౌన్ అయినా ఆహార సరఫరా, ఈ-కామర్స్ సంస్థలు పనిచేసేలా చూసింది. కేసులు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను రప్పించింది. ఆర్మీని బరిలోకి దించి ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించేసింది. అన్ని రాష్ట్రాలు, నగరాల్లో కృత్రిమ మేథ, స్థానిక వైద్యసిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొంది. వుహాన్ నుంచి ఎవరెవరు ఎక్కడికి వెళ్లారో పక్కగా గుర్తించింది. వారు దేశంలో మరెక్కడైనా పర్యటించారో లేదో గుర్తించి ఎక్కడికక్కడ క్వారంటైన్ చేసింది. బీజింగ్, షాంఘై వంటి పెద్ద, చిన్న నగరాల్లో ప్రజల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించింది. సోషల్ డిస్టెన్స్ నిబంధనలు అమలు చేసి వైరస్ వ్యాప్తి లేకుండా చేసింది. రహస్య పద్ధతిలో వైద్యం చేసినట్లూ వార్తలు వస్తున్నాయి.
21 లాక్డౌన్ విజయవంతమే!
ప్రస్తుతం చైనాపై ఎన్నో అనుమానాలు ఉన్నా వారి పద్ధతిలోనే విపత్తును ఎదుర్కోవాలని నిపుణులు భారత్కు సూచిస్తున్నారు. చైనాలో ప్రధాని లీ కెకియాంగ్ నేతృత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు, అధికారులతో కమిటీలు వేసి ఎక్కడా పాలన, సేవా లోపాలు లేకుండా పనిచేశారు. వెంటవెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నారు. మనమూ ఇలాగే చేయాలని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమన్వయం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ అన్ని రాష్ట్రాల పరిస్థితిని ఆయన ఆరా తీస్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర మంత్రులను పర్యవేక్షకులుగా నియమించారు. మొదట చైనాలో సరైన వైద్య పరికరాలు, గ్లోవ్స్, రక్షణ దుస్తులు లేకపోవడంతో 3000 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వెంటనే వారు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి చక్కబడింది. మన దేశంలో అలాంటి కొరత రానీయకుండా చూడాలి. అక్కడ వైరస్ ప్రధాన కేంద్రం వుహాన్ ఒక్కటే. ఆ దేశమంతా దానిపైనే దృష్టిసారించింది. భారత్లో వుహాన్ తరహా కేంద్రాలేమీ లేవు. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే 21 రోజుల లాక్డౌన్ విజయవంతమై వైరస్ వ్యాప్తి దాదాపుగా అంతమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రజలెవ్వరూ బయటకు రావొద్దు.
-ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!