అసలు క్వారంటైన్ అంటే.. ఏంటి?
క్వారంటైన్ ఇటీవల అందరిని నోట నానుతున్న పదం. కానీ ఈ క్వారంటైన్ ఇప్పుడు పుట్టింది కాదు.. మధ్యయుగంలోనే ఆనాటి మనుషులు దీన్ని పాటించారు. 14వ శాతబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ఇటలీ ముందుగా ముందస్తు జాగ్రత్తలు
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా కరోనా బాధితులు.. అనుమానితులు అందరూ క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందిస్తున్నారు. అంతా సరే.. అసలు క్వారంటైన్ అంటే ఏమిటి? ఈ విధానం ఎక్కడ పుట్టింది? ఎవరు పాటించారు? ఇలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో..
క్వారంటైన్ ఇటీవల అందరిని నోట నానుతున్న పదం. కానీ ఈ క్వారంటైన్ ఇప్పుడు పుట్టింది కాదు.. మధ్యయుగంలోనే అప్పటివారు దీన్ని పాటించారు. 14వ శాతబ్ధంలో ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ఇటలీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ఓడల ద్వారా తమ దేశంలోనూ ప్లేగు వ్యాపిస్తుందని భావించిన ఇటలీ.. వెంటనే వారిని కట్టడి చేయాలని భావించింది. ఈ క్రమంలో 40 రోజులపాటు విదేశాల నుంచి వచ్చిన వారిని ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక గది(ఐసోలేషన్)కి తరలించాలని నిర్ణయించింది. దీనినే ఐసోలేషన్ ఇటలీ భాషలో ‘క్వారంట జోర్ని’ అంటే ‘ 40 రోజులు’ అని అర్థం. ఆ తర్వాత ఈ పదాలు కాస్త ‘క్వారంటినో’, ‘క్వారంటైన్’గా రూపాంతరం చెందాయి. ఈ విధానం వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా బాగా పనిచేసేది.
* 1665లో బ్రిటన్లోనూ ప్లేగు వ్యాధి 14 నెలలపాటు తన ప్రభావం చూపించింది. అయితే ఇయమ్ అనే గ్రామంలో ప్రజలు ప్లేగు ఇతరులకు సోకకూడదని నిర్ణయించుకున్నారు. గ్రామం మొత్తం క్వారంటైన్లోని వెళ్లింది.
* 1793లో అమెరికాలో పచ్చకామెర్లు సోకడం మొదలైంది. దీనివల్ల యూఎస్ మొత్తంగా 5వేల మంది మరణించారు. ఈ అనుభవాన్ని దృష్ట్టిలో పెట్టుకొని కామన్వెల్త్ ఆఫ్ ఫిలడెల్ఫియా ఏకంగా దెలావర్ నదిపై క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించింది.
* 1814లో ఆస్ట్రేలియా తొలిసారి క్వారంటైన్ను పాటించింది. జులై 28న ఇంగ్లాండ్ నుంచి సుర్రీ అనే ఓడ సిడ్నీ ఓడరేవుకు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో ఆ ఓడలో 46 మంది టైఫాయిడ్ జ్వరంతో మరణించారు. దీంతో సిడ్నీకి చేరుకున్న వెంటనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ ఓడను.. ఓడలో ఉన్న వారిని క్వారంటైన్ చేసింది.
* 1830లో అమెరికాలో కలరా ప్రబలింది. దీనికి అరికట్టేందుకు అప్పటి న్యూయార్క్ మేయర్ క్వారంటైన్ను తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓడలు, వాహనాలపై న్యూయార్క్లోకి వచ్చే వారిని కచ్చితంగా క్వారంటైన్లో ఉంచాలన్నారు. అయితే ఈ క్వారంటైన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చాలా మంది వలసదారులు క్వారంటైన్ నుంచి తప్పించుకొని న్యూ ఇంగ్లాండ్లోని ప్రధాన నగరాల్లోని ప్రవేశించారు.
* ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చిన స్పానిష్ ఫ్లూ సమయంలోనూ అమెరికా, యూరప్ దేశాలు క్వారంటైన్ విధానాన్ని అమలు చేశాయి. 1918లో వచ్చి స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల మందిని బలితీసుకుంది. దీనిని నియంత్రించేందుకు అమెరికా, యూరప్ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. వైరస్ సోకిన వ్యక్తులను క్వారంటైన్ చేశాయి.
* యూరప్లో స్మాల్పాక్స్ వచ్చి.. దాదాపు తగ్గిపోతున్న సమయంలో 1972లో యూగోస్లేవియాలో స్మాల్పాక్స్ను గుర్తించారు. సీరియస్గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దీనిపై తీవ్రంగా పోరాడింది. యూగోస్లేవియా ప్రభుత్వం మిలటరీ సాయంతో దేశవ్యాప్తంగా క్వారంటైన్ను విధించింది.
ఈ క్వారంటైన్ వైరస్ను మొత్తంగా తరిమికొట్టలేకపోయినా.. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాత్రం ఆపుతోంది. తాజాగా కరోనా వైరస్ విషయంలోనూ ప్రపంచదేశాలన్నీ ఈ క్వారంటైన్నే పాటిస్తున్నాయి. అయితే మారిన పరిస్థితులు, వైద్యశాస్త్రంలో వచ్చిన సాంకేతిక మార్పులు, వైరస్ లక్షణాల దృష్ట్యా క్వారంటైన్ సమయం 14 రోజులకు తగ్గించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు