నియంత రాజ్యంలో కరోనా వస్తే కాల్చేస్తున్నారా?
నావెల్ కరోనా వైరస్ గతేడాది చివర్లో వుహాన్లో పురుడు పోసుకుంది. చైనాలోని ప్రధాన నగరాల్లో సంక్రమణ చెందింది. సరిహద్దులు దాటింది. విదేశాల్లో అడుగుపెట్టింది. దేశం మారినప్పుడల్లా దాడి చేసే పద్ధతిని మార్చుకుంది. ఇప్పుడు సమస్త భూమండలాన్నీ తన గుప్పిట బంధించింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలని లాక్డౌన్ చేయించింది....
కొవిడ్-19ను ఉత్తర కొరియా ఎలా కట్టడి చేసిందంటే..
జనవరిలోనే కఠిన చర్యలకు ఆదేశించిన కిమ్ జాంగ్ ఉన్
నావెల్ కరోనా వైరస్ గతేడాది చివర్లో వుహాన్లో పురుడు పోసుకుంది. చైనాలోని ప్రధాన నగరాల్లో సంక్రమణ చెందింది. సరిహద్దులు దాటింది. విదేశాల్లో అడుగుపెట్టింది. దేశం మారినప్పుడల్లా దాడి చేసే పద్ధతిని మార్చుకుంది. ఇప్పుడు సమస్త భూమండలాన్నీ తన గుప్పిట బంధించింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలని లాక్డౌన్ చేయించింది.
ఆధునిక వైద్య సదుపాయలకు పేరెన్నికగన్న అగ్రరాజ్యాలను వణికిస్తున్న కొవిడ్-19 వ్యాప్తిని చిన్న చిన్న దేశాలు సమర్థంగా అడ్డుకున్నాయి. తజికిస్థాన్, దక్షిణ సుడాన్, యెమెన్, బురుండి, మాలవి, లెసెథో వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి లేదు. ప్రపంచానికి ఓ కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాలోనూ కరోనా కేసులు నమోదు కాలేదు. చైనాకు పక్కనే ఉండే ఈ దేశం ఇంతకీ ఏం చేసిందో తెలుసా!?
కాల్చేయడం నిజమా?
ఉత్తర కొరియా అంటే గుర్తొచ్చేవి ఆ దేశ నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్, క్షిపణి ప్రయోగాలు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో సమాచారం ఉండదు. ప్రజల జీవిన విధానం, స్వేచ్ఛ, హక్కుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచ దేశాలతో ఉత్తర కొరియాకు ఉన్న దౌత్య సంబంధాలు అంతంత మాత్రమే. దాదాపుగా చైనాతోనే 90% వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. నేరుగా ఆ దేశానికి వెళ్లలేరు. చైనా నుంచే అక్కడికి చేరుకోవాలి. విదేశీ పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వీల్లేదు. స్థానికులతో మాట్లాడేందుకు అవకాశం ఉండదు. అక్కడి వ్యవస్థ గురించి ఆరాతీస్తే ఇక అంతే సంగతులు. మరి ఇలాంటి దేశం కొవిడ్-19 మహమ్మారిని అడ్డుకోవడం ఆశ్చర్యమే. అయితే.. ఎవరికైనా కరోనా సోకితే తుపాకీతో కాల్చి చంపేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న చిత్రాలు మాత్రం అవాస్తవమే.
సరిహద్దులు బంద్
చైనాలో గతేడాది చివర్లోనే నావెల్ కరోనా వైరస్ విజృంభించింది. ఈ విషయం తెలియగానే కిమ్ కఠిన చర్యలకు ఆదేశించారు. జనవరి నుంచే దేశ సరిహద్దులను మూసేయించారు. అంతర్జాతీయ విమాన, రైలు ప్రయాణాలను నిషేధించారు. వాస్తవంగా 90 శాతం ప్రయాణాలన్నీ చైనాకే ఉంటాయి. సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు బంద్ చేయించారు. విదేశాలకు వెళ్లేందుకు స్థానికులకు అనుమతి ఇవ్వలేదు. బయట నుంచి వచ్చేవారికి కఠిన వైద్య పరీక్షలు, తనిఖీలు నిర్వహించాకే అనుమతించారు. ఆ వచ్చేవారినీ ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. ఇక ఆ దేశానికి వెళ్లే విదేశీయులు ఎవ్వరైనా ప్రతి రోజూ అధికారుల వద్ద రిపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి సమస్య రాలేదు. జనవరిలో కొరియాలో పర్యటిస్తున్న విదేశీయుల్ని క్వారంటైన్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు.
ఎప్పట్నుంచో ఐసోలేషన్
ఉత్తర కొరియాలో నియంత ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఎవరైనా క్రమశిక్షణ తప్పినా, నిబంధనలు ఉల్లంఘించినా మెడపై కత్తి వేలాడటం ఖాయం. నిజానికి ఆ దేశంలో ఎప్పట్నుంచో సోషల్ డిస్టెన్స్ ఉంది! అవసరం లేకుండా ప్రజలెవ్వరూ వీధుల్లోకి రాకూడదు. అంటే ఉపాధి నిమిత్తం పనుల్లోకి వెళ్లేటప్పుడు తప్ప బయటెవరూ కనిపించరు. ఇతరులతో మాట్లాడేటప్పుడూ జాగ్రత్తలు, వ్యక్తిగత దూరం పాటించాల్సిందే. ఏ పనీ లేకుంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలి. అంటే ఇష్టంగానో అయిష్టంగానో ప్రజలెప్పట్నుంచో వీటిని పాటిస్తున్నారు. ఇవన్నీ కరోనా వ్యాప్తికి నిరోధాలే కదా మరి! ఇక ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఉత్తర కొరియాను ఎప్పుడో ఒంటరిని (ఐసోలేట్) చేశాయి. దాంతో ఇక్కడికి రాకపోకలు చాలా చాలా తక్కువ. అలాంటప్పుడు వైరస్ వచ్చే అవకాశాలూ తక్కువే.
కరోనా సోకితే కల్లోలమే
ఇక్కడి ప్రజలు ఎక్కువగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరంగానూ మెరుగ్గా లేరు. దేశంలో అత్యాధునిక వైద్యసదుపాయాలు లేవు. ఆ మధ్య కిమ్కు అనారోగ్యం సోకగా విదేశాల నుంచి వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సదుపాయాలు నగరాలు, పట్టణాలకే పరిమితం. అందులోనూ పేదలను పట్టించుకోరని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎలా చూసినా కరోనా వ్యాపిస్తే ఉత్తర కొరియా అల్లకల్లోలం కావాల్సిందే. అందుకే ఈ కరోనా విపత్తు ‘జాతి మనుగడ’కే ముప్పని కిమ్ అన్నట్టు సమాచారం. ఇప్పటికైతే అక్కడ ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని ప్రభుత్వ మీడియా చెప్పింది. ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు చేపట్టారని వెల్లడించింది. కరోనా లక్షణాలేంటో ప్రజలకు వివరించింది.
ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ దుస్తులు ధరించి బస్సులు, రైళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో రసాయాలను పిచికారీ చేసిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఆ దేశ ప్రధాని కిమ్ జే ర్యాంగ్ మాస్క్ ధరించి మహమ్మారి కట్టడి చర్యలు చేయిస్తున్న చిత్రాలూ వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పనులను చిత్రీకరించి ‘నావెల్ కరోనా వైరస్ను పూర్తిగా అడ్డుకుందాం’ అని కేసీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ప్రసారం చేసింది. ఏదేమైనప్పటికీ ఒక మహమ్మారిని కట్టడి చేసే శక్తియుక్తులు ఉత్తర కొరియాకు లేవని జాన్ హప్కిన్స్ తన గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ వెల్లడించడం గమనార్హం.
- ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!