లాక్డౌన్.. ఏ దేశంలో ఏం జరుగుతోంది?
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్యను పెంచుతూ భయాందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. మన దేశంలోనూ ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ నిబంధనల
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీని ప్రకారం కాలేజీలు, కార్యాలయాలు, వ్యాపారాలు, దుకాణాలు మూతపడ్డాయి. నిత్యావసరాల దుకాణాలు, కూరగాయల మార్కెట్లు పరిమిత సమయంలో అందుబాటులో ఉంటున్నాయి. అత్యవసర పనులుంటే గానీ ఎవరూ బయటకు రావొద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు అన్ని దేశాల్లో లాక్డౌన్ అంటే ఇలాగే ఉంటుంది. అయితే కొన్ని దేశాలు లాక్డౌన్తోపాటు వినూత్న చర్యలు చేపట్టాయి. అవేంటో చూద్దాం పదండి.
రెండు గంటలు మాత్రమే.. అదీ ఒక్కసారే
పనామాలో రెండు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా లాక్డౌన్ విధించిన అక్కడి ప్రభుత్వం ప్రజలు బయటకు రావడంపై ఆంక్షలు విధించింది. మన దేశ రాజధాని దిల్లీలో సరి-బేసి విధానంలాగా.. లింగ భేదంతో ప్రజలను బయటకు వెళ్లేందుకు అక్కడ అనుమతిస్తున్నారు. స్త్రీలు, పురుషులు వేర్వేరుగా నిర్దేశించిన రోజుల్లో బయటకు వెళ్లాలి. ఒక్కరోజు ఒకేసారి రెండు గంటలు మాత్రమే బయట ఉండే అవకాశముంటుంది. రెండు గంటలు ముగిశాయంటే ఆ రోజు మళ్లీ బయటకు వెళ్లకూడదు. అదే ఆదివారం రోజున ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇది వచ్చే బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
జాతీయ గుర్తింపు కార్డు చివరి సంఖ్యను బట్టి..
కొలంబియాలో మరో విచిత్ర ఆంక్ష అమలు చేస్తున్నారు. ఆ దేశంలో 1500 మంది కరోనా బారిన పడ్డారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టాలని నిశ్చయించుకున్న కొలంబియా.. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ గుర్తింపు కార్డులో ఉండే సంఖ్యల్లో చివరి సంఖ్య ఆధారంగా ముఖ్యమైన నగరాల్లో ప్రజలను బయటకు వెళ్లడానికి అనుమతిస్తోంది. బరంకాబెర్మెజా నగరంలో ఐడీ నంబర్లో చివరి సంఖ్య 0, 7, 4 ఉన్నవాళ్లు సోమవారం రోజున.. 1, 8, 5 ఉన్నవాళ్లు మంగళవారం రోజున బయటకు వెళ్లొచ్చన్నమాట.. బొలివియా దేశంలోనూ ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారు.
శునకాల కోసం నిబంధన పెట్టారు.. తీసేశారు
సెర్బియాలో 1600 మందికిపైగా కరోనా బాధితులున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా.. దాదాపు ఆ దేశంలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. లాక్డౌన్ విధించిన మొదట్లో శునకాలను వాకింగ్ తీసుకెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సాయంత్రం పూట కాకుండా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య మాత్రమే శునకాలను వాకింగ్కు తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. దీనిపై శునకాల యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శునకాలను సాయంత్రం పూట బయటకు తీసుకెళ్లకపోతే.. వాటికి మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయని, పరిశుభ్రత లోపిస్తుందని పశు వైద్యులు చెబుతున్నారు. దీంతో ఈ ఆంక్షను ప్రభుత్వం ఎత్తేసింది.
యూరప్ అంతా ఒకలా.. స్వీడన్ మరోలా..
చైనా, అమెరికా తర్వాత యూరప్ దేశాలే అత్యధికంగా కరోనా బారిన పడ్డాయి. దీంతో యూరప్ ఖండం మొత్తం లాక్డౌన్లో ఉంది. స్వీడన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆ దేశంలో లాక్డౌన్ ఉన్నా.. చాలా ఆంక్షలను కుదించారు. అన్ని దేశాలు ఏ ఇద్దరు కలిసి ఉండకూడదంటుంటే.. స్వీడన్లో మాత్రం 50 మంది వరకు ఒకే చోట ఉండొచ్చని అంటోంది. 50 మందికి మించి గుమ్మిగూడటాన్ని నిషేధించింది. అదీ కేవలం ఆదివారాలు మాత్రమే. దాదాపు అన్ని దేశాలు విద్యా సంస్థలను మూసివేస్తే.. ఈ దేశంలో మాత్రం 16 ఏళ్ల వయసులోపు విద్యార్థుల కోసం పాఠశాలలను తెరిచే ఉంచారు. పబ్లు, రెస్టారెంట్లు తెరిచే ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
ఓ సూచన.. ప్రజలకు ఆగ్రహం తెప్పించింది
మలేసియాలో 3500 మందికిపైగా కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం పాక్షికంగానే లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కరోనా, క్వారంటైన్పై ప్రజలకు అవగాహన, సూచనలు ఇచ్చే క్రమంలో ఆ దేశ మహిళా సంక్షేమ శాఖ ప్రచురించిన ఓ కార్టూన్ పోస్టర్ వివాదస్పమైంది. ఇళ్లలో ఉండే భార్యలందరూ చక్కగా దుస్తులు ధరించండి.. మేకప్ వేసుకోండి.. భర్తలను మాత్రం ఇబ్బందులు పెట్టకండి అంటూ తీసుకొచ్చిన కార్టూన్ పోస్టర్ ఆన్లైన్లో వైరల్ అయింది. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. పోస్టర్ను తొలగించింది.
ఆరోగ్యంగా ఉన్నా మాస్కులు ధరించాలి
కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆసియా దేశాల్లోని ప్రజలు అందరూ మాస్కులు ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వాళ్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో యూరప్లో ప్రజలు పెద్దగా మాస్కులు ధరించట్లేదు. చెక్ రిపబ్లిక్, స్లోవకియా, బోస్నియా అండ్ హెర్జోగోవియా, ఆస్ట్రియా దేశాల్లో ఆరోగ్యంగా ఉన్నా మాస్కులు ధరించాల్సిందేనని ప్రభుత్వాలు నిబంధన పెట్టాయి. ఆస్ట్రియాలో ప్రస్తుతం 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఏకంగా ఎమర్జెన్సీ విధింపు
హాంగేరిలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి కూడా చేరలేదు. అయినా ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమై మార్చి 11వ తేదీనే దేశవ్యాప్తంగా నిరవధిక ఎమర్జెన్సీ విధించింది. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. కర్ఫ్యూ, క్వారంటైన్ను ఉల్లంఘించిన వారికి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు గుంపులుగా చేరకుండా తమ రోజువారీ విధులు నిర్వర్తించే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఉక్రెయిన్, చెక్ రిపబ్లిక్ దేశాలూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ విధించాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో