మెడలో ఆభరణమైన కరోనా వైరస్
కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే.. రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్ ఆకృతిని ఆభరణంగా మార్చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ లభిస్తుందో.. విమర్శల వర్షం కూడా అంతే ఉంది.
రష్యాకి చెందిన డాక్టర్ వొరొబెవ్.. ఓ ‘మెడికల్ జ్యువెలరీ ’నగల వ్యాపారి. మెడికల్ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్ జ్యువెలరీని ధరిస్తున్నారు. అయితే ఇటీవల చైనాలో పుట్టిన కరోనా వైరస్పై పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని రూపాన్ని కనిపెట్టారు. గుండ్రంగా ఉండే ఈ వైరస్ చుట్టు కొమ్ములు ఉండి.. చివరన కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ఈ వైరస్ ఆకారం ఎలా ఉంటుందో ప్రకటించగానే డాక్టర్ వొరొబెవ్ వైరస్ ఆకృతితో వెండి పెండెంట్స్ తయారు చేయడం ప్రారంభించారు. 13 డాలర్లకు ఒక పెండెంట్ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. కొత్తగా ఉండే దేనినైనా స్వాగతించే యువత.. వీటిని కూడా కొనుగోలు చేసి ధరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది ఈ పెండెంట్ తయారీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే.. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. వైరస్తో వ్యాపారం చేస్తావా? అని వొరొబెవ్ను విమర్శిస్తున్నారు.
కాగా.. పెండెంట్ తయారు చేస్తున్న వొరొబెవ్ మాత్రం తనను తాను సమర్థించుకుంటోంది. తాను తయారు చేస్తున్నది మెడికల్ జ్యువెలరీ అని.. వైద్య సిబ్బంది మంచి కోసమే తాను వీటిని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్ నిలుస్తుందని వొరొబెవ్ అంటున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్ను కానుకగా ఇస్తున్నారని తెలిపారు. ఆమె.. కేవలం కరోనా వైరస్దే కాదు.. బ్యాక్టీరియా, డీఎన్ఏ, గుండె తదితర ఆకృతులతో పెండెంట్లు తయారు చేస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్