కరోనా ఆంక్షల తర్వాత ‘సరికొత్త సాధారణం’
అనుకోని ఉపద్రవమేదో సంభవించినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? జీవితం మళ్లీ ఎన్నాళ్లకు సాధారణ స్థితికి చేరుకుంటుందో అనే కదా! ఈ భూ ప్రపంచం ఇప్పటి వరకు ఎన్నో ఉత్పాతాలను చవిచూసింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, సునామీ తరహా ప్రకృతి విపత్తులను మానవాళి ధైర్యంగా ఎదుర్కొంది. కొన్ని రోజులకు జీవనం మునుపటి స్థాయికి చేరుకుంది....
సడలిస్తే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ: WHO
మన భవిష్యత్తు కోసం మన అలవాట్లు మార్చుకోక తప్పదు
అనుకోని ఉపద్రవమేదో సంభవించినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? జీవితం మళ్లీ ఎన్నాళ్లకు సాధారణ స్థితికి చేరుకుంటుందో అనే కదా! ఈ భూ ప్రపంచం ఇప్పటి వరకు ఎన్నో ఉత్పాతాలను చవిచూసింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, సునామీ తరహా ప్రకృతి విపత్తులను మానవాళి ధైర్యంగా ఎదుర్కొంది. కొన్ని రోజులకు జీవనం మునుపటి స్థాయికి చేరుకుంది.
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. సంఘజీవి అయిన మానవుడిపై లాక్డౌన్ తరహా ఎన్నో ఆంక్షలకు కారణమైంది. ఆర్థిక వ్యవస్థలను చిధ్రం చేసింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెంచింది. ఇంట్లోంచి బయటకు రాకుండా చేసింది. సన్నిహితులతో రాకపోకలు బందు పెట్టింది. ఎప్పుడో అప్పుడు ఈ ఆంక్షలు సడలించక తప్పదు. అయితే గత విపత్తుల తర్వాత ఉన్నట్టు జీవితం వెంటనే మారిపోదట. అసాధారణంగానే ఉండనుంది.
కొమ్ములు విరిచేందుకు
కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు కొమ్ములు విరిచేందుకు ప్రపంచమంతా ఏకధాటిగా యుద్ధం చేస్తోంది. ప్రభుత్వాలు ఆంక్షలు విధించి ప్రజలను కాపాడుకొంటున్నాయి. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాధికారులు, పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విరామమెరుగని వైద్యులు రోగులకు సేవ చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, ఫార్మా పరిశ్రమ టీకామందు కనుగొనేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి! లాక్డౌన్ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సంస్థల రాబడి తగ్గింది. ఉద్యోగాలు పోతాయన్న భయం మొదలైంది. భర్త, పిల్లలకు సేవచేస్తూ గృహిణులకు భారం పెరిగింది. ఏదేమైనప్పటికీ వైరస్ను కట్టడి చేసేందుకు చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటివి అలవాటయ్యాయి. అయితే లాక్డౌన్ ఆంక్షలు ఎలా సడలించాలి? ఆ తర్వాత సాధారణ జీవితం అసాధారణంగా ఎలా ఉంటుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
వ్యూహాత్మకంగా సడలింపు
ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయొద్దని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కొవిడ్-19 కేసులు తక్కువగా నమోదవుతున్న దేశాలు ఆంక్షల్ని వ్యూహాత్మకంగా, మెల్లమెల్లగా సడలించాలని తెలిపింది. ఇంకొన్నాళ్లు ఇంట్లోనే ఉండటం మంచిదని వెల్లడించింది. ప్రజలు సుదీర్ఘ కాలం వ్యక్తిగత దూరం పాటించేలా, సబ్బు నీటితో చేతుల్ని తరచూ కడుక్కొనేలా చూడాలంది. ‘దాదాపుగా సగం ప్రపంచం లాక్డౌన్లో ఉంది. ఎప్పుడెప్పుడు ఆంక్షలు సడలిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పక్కాగా నియంత్రించిన, కేసులు అతిగా నమోదు కాని దేశాలు ఇందుకు పూనుకోవచ్చు. సహనం, నిఘా, అప్రమత్తత మాత్రం ఎప్పటికీ అవసరమే. అన్ని ఆంక్షలూ ఒకేసారి కాకుండా ప్రజలను నిదానంగా ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించడం కీలకం’ అని ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ అంటున్నారు.
ఈ నిబంధనలకు లోబడే
ఆంక్షలను ఎలా సడలించాలి? లాక్డౌన్ను ఎలా ఎత్తివేయాలి? అందుకు వేటిని కొలమానంగా తీసుకోవాలి?తదితర మార్గదర్శకాలను అతిత్వరలో విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రియేసస్ అంటున్నారు. లాక్డౌన్ సడలించే దేశాలు దిగువ నిబంధనలకు లోబడి ఉండాంటున్నారు.
1) కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండాలి.
2) వైద్య వ్యవస్థకు కొవిడ్-19 కేసుల్ని గుర్తించి, పరీక్షించి, ఏకాంతంలోకి పంపించి, చికిత్స చేయలిగే సామర్థ్యం ఉండాలి. బాధితుడు కలిసిన వారందరినీ పట్టుకొని పరీక్షించగలగాలి.
3) ఆస్పత్రులు, నర్సింగ్హోమ్స్ వంటి కేంద్రాల్లో వైరస్ ఎవరికీ సోకుండా చూడాలి.
4) పాఠశాలలు, కార్యాలయాలు, జన సంచారం ఉండే బహిరంగ ప్రదేశాల్లో కట్టడి, నియంత్రణ చేసే వ్యవస్థ ఉండాలి.
5) ప్రమాదాల (రిస్క్)ను మేనేజ్ చేయగలగాలి.
6) అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలి. కొత్త నిబంధనలు పాటించేలా, సాధికారతతో నడుచుకొనేలా చేయాలి.
విఫలమయ్యేది ఇక్కడే
కొవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గినంత మాత్రాన హీనదశను దాటేశామని దేశాలు విశ్వసించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిరంతర నిఘా అవసరమని వెల్లడించింది. లాక్డౌన్ ఎత్తేసినా వ్యక్తిగత దూరం పాటించడం, చేతులు కడగడం వంటివి సుదీర్ఘ కాలం అనుసరించాలంది. ‘భవిష్యత్తు కోసం మనం మన అలవాట్లు, ప్రవర్తనను మార్చుకోవాలి’ అని డబ్ల్యూహెచ్వో అత్యయిక కార్యక్రమ చీఫ్ మైకేల్ జే రియాన్ అంటున్నారు. ఆంక్షలు సడలించినా ఆస్పత్రుల్లో పెంచిన సామర్థ్యాన్ని తగ్గించొద్దని సూచించారు. రక్షణ వస్తువులు, ఐసీయూ పడకలు అలాగే ఉంచాలన్నారు. ‘లాక్డౌన్ సడలించాక కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదలను చూడొచ్చు. లాక్డౌన్ ఫలితాలను వృథా చేయొద్దు. మనం మరింతగా విఫలమయ్యేది ఇక్కడే. మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే’ అని రియాన్ పేర్కొన్నారు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!