ప్రయోగం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు
కొత్తగా ఏ వ్యాధి సోకినా.. దానికి ఔషధం కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగుతారు. వ్యాధికి తగిన విరుగుడు కనిపేట్టేందుకు పరిశోధనలు చేస్తారు. ఇందులో భాగంగా ఔషధం పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి మొదట ఎలుకలు, కోతులు
కొత్తగా ఏ వ్యాధి సోకినా.. దానికి ఔషధం కనిపెట్టేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగుతారు. వ్యాధికి తగిన విరుగుడు కనిపేట్టేందుకు పరిశోధనలు చేస్తారు. ఇందులో భాగంగా ఔషధం పనిచేస్తుందా? లేదా? అని తెలుసుకోవడానికి మొదట ఎలుకలు, కోతులు తదితర జంతువులపై ప్రయోగాలు జరుపుతారు. కానీ, కొందరు శాస్త్రవేత్తలు, డాక్టర్లు తమ మీదే తాము ప్రయోగాలు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాళ్లెవరు? ఏం చేశారో మీరే చదవండి.
బ్యాక్టీరియాలున్న రసం తాగిన శాస్త్రవేత్త
బవేరియాకు చెందిన రసాయన శాస్త్రవేత్త మ్యాక్స్ జోసెఫ్ వొన్ పెట్టెంకొఫర్. పరిశుభ్రతపై ఎంతో కృషి చేసిన ఆయన.. బ్యాక్టీరియా వల్లే వ్యాధులు వస్తాయని నమ్మేవారు కాదు. కలరా వ్యాధిపై పరిశోధన చేసి... విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్లనే వ్యాధి సోకుతుందని రాబర్ట్ కోచ్ అనే జర్మన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే ఆ సిద్ధాంతాన్ని జోసెఫ్ నమ్మలేదు. రాబర్ట్ కోచ్ చెప్పింది తప్పని నిరూపించేందుకు ఓ ప్రయోగం చేశారు. ఆయన ముందే విబ్రియో కలరా బ్యాక్టీరియాలను పెద్ద మొత్తంలో రసంలో కలుపుకొని తాగేశారు జోసెఫ్. కడుపులో ఇబ్బంది కలగకూదని రాబర్ట్ సలహా మేరకు సోడా కూడా తాగారు. ఆ తర్వాత కలరా లక్షణాలతో జోసెఫ్ ఆస్పత్రిలో చేరి వారం పాటు చికిత్స తీసుకున్నారు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. అయినా జోసెఫ్ కలరాకు బ్యాక్టీరియా కారణం కాదని వాదించడం విడ్డూరం.
ప్రాణాలు పణంగా పెట్టారు
యల్లో ఫీవర్ రావడానికి దోమలే కారణమని ఇప్పుడు అందరికి తెలుసు. 1881లో డాక్టర్ కార్లోస్.. దోమల కారణంగా యల్లో ఫీవర్ వస్తుందని తేల్చారు. కానీ దాన్ని మరోసారి నిరూపించేందుకు అమెరికా ఆర్మీకి చెందిన ముగ్గురు డాక్టర్లు సాహసం చేశారు. 1900లో యల్లో ఫీవర్పై వాల్టర్ రీడ్ అనే వైద్య శాస్త్రవేత్త వద్ద జేమ్స్ కరోల్, అరిస్టైడ్స్ అగ్రామోంటె, జెస్సీ లేజర్ పరిశోధనలు చేసేవారు. ఈ క్రమంలో దోమల ద్వారానే ఈ జ్వరం వస్తుందని నిరూపించడానికి కరోల్, లేజర్ దోమలతో కాటు వేయించుకున్నారు. దీంతో ఇద్దరికి యల్లో ఫీవర్ వచ్చింది. కొన్ని రోజులకే లేజర్ మృతి చెందగా.. కరోల్ వ్యాధి నుంచి కోలుకున్నాడు. కానీ ఏడేళ్ల తర్వాత అదే వ్యాధితో కన్నుమూశాడు. వారి త్యాగం వల్లే యల్లో ఫీవర్ దోమల వల్ల వస్తుందని నిరూపితమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆధారం లభించింది.
తనకు తానే ఆపరేషన్ చేసుకొని..
అప్పట్లో ఆపరేషన్ చేయాలంటే శరీరం మొత్తానికి మత్తు ఇచ్చేవారు. కానీ శరీరమంతా అనస్తీషియా ఎక్కించాల్సిన అవసరం లేదని నిరూపించాడో వృద్ధ వైద్యుడు. యూఎస్లోని పెన్సిల్వేనియాకు చెందిన డాక్టర్ ఒనీల్ కేన్ ఆపరేషన్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. ఆపరేషన్ సమయంలో శరీరమంతా అనస్తీషియా ఇవ్వక్కర్లేదని నిరూపించడం కోసం ఇన్ఫెక్షన్ వచ్చిన వేలుకు దగ్గర్లో మాత్రమే అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత 1921 ఫిబ్రవరి 15న కడుపు వద్ద అనస్తీషియా ఇచ్చుకొని అపెండెక్స్ ఆపరేషన్ను విజయవంతంగా చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు. పదేళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల వయసులోనూ మూడోసారి ఆపరేషన్ చేసుకొని 36 గంటల్లో మళ్లీ విధుల్లో చేరారు. ఆపరేషన్ విజయవంతమైంది కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోయేవి.
పునరుజ్జీవనం కల్పించాలనుకున్నాడు.. ప్రాణాలు కోల్పోయాడు
రష్యాకి చెందిన అలెగ్జాండర్ బొగ్డానొవ్ వైద్యుడే కాదు.. శాస్త్రవేత్త, ఆర్థిక, రాజకీయవేత్త కూడా. రచయితగానూ పేరుంది. అయితే ఆయనకో విచిత్రమైన ఆలోచన వచ్చింది. ముసలివారికి యువకుల రక్తం ఎక్కించి పునరుజ్జీవనం కల్పించాలనుకున్నారు. ఇందుకోసం హిమాటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ పేరుతో ఓ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. యువకుల నుంచి స్వచ్ఛందంగా రక్తం సేకరించడం మొదలుపెట్టారు. అయితే 1924లో ఓ యువకుడి నుంచి సేకరించిన రక్తాన్ని అలెగ్జాండర్ తన శరీరంలోకి ఎక్కుంచుకొని ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి కారణం ఆ రక్తం ఇచ్చిన యువకుడికి మలేరియా, టీబీ వ్యాధులు ఉండటమేనని తేలింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికే అలా చేశారని కొందరు, రక్తంలో ఉండే రకాల గురించి తెలియక అలా జరిగిందని మరికొందరు వాదిస్తుంటారు.
సాలె పురుగుతో కుట్టించుకున్నారు
కొన్ని రకాల సాలె పురుగులు కుడితే విపరీతమైన నొప్పి పుడుతుంది. కొన్నింటిలో ఉండే విషం మనిషి ప్రాణాలు సైతం తీయగలదని కొందరు.. అంత ప్రమాదకరం కాదని మరికొందరి వాదన. ఈ అంశంపై కొన్ని ప్రయోగాలు జరిపినా ఫలితం రాలేదు. 1933లో అలెన్ వాకర్ బ్లెయిర్ అనే వైద్యశాస్త్ర అధ్యాపకుడు సాలెపురుగు సంగతేంటో తేలుద్దామని నిర్ణయించుకున్నారు. సాలెపురుగు విషం మనిషి ప్రాణాలు తీస్తుందా లేదా తెలుసుకునేందుకు స్వయంగా తానే బ్లాక్ విడో స్పైడర్ రకానికి చెందిన సాలెపురుగుతో కుట్టించుకున్నారు. ఒక్కసారి కుట్టగానే బ్లెయిర్కు తీవ్ర నొప్పి వచ్చింది. రెండోసారి కుట్టించునే సాహసం చేయలేక ప్రయోగాన్ని మధ్యలోనే వదిలేసి ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజులపాటు నొప్పితో బాధపడ్డ బ్లెయిర్ క్షేమంగానే బయటపడ్డారు.
బ్యాక్టీరియా కారణమంటే వినలేదు.. తాగి చూపించారు
బెర్రీ మార్షల్, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్. మైక్రోబయాలజీ ప్రొఫెసర్. రాయల్ పెర్త్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో బెర్రీ.. తోటి వైద్యుడు రాబిన్ వారెన్తో కలిసి హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాపై పరిశోధనలు జరిపారు. కడుపులో అల్సర్, కేన్సర్ రావడానికి హె.పైలోరీ బ్యాక్టీరియానే కారణమని నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే కడుపులో విడుదలయ్యే రసాయనాలకు బ్యాక్టీరియా బతికే అవకాశమే లేదని ఇతర శాస్త్రవేత్తలు, వైద్యులు వీరి వాదనను కొట్టిపారేశారు. దీంతో తన వాదన వాస్తవమని నిరూపించడం కోసం బెర్రి మార్షల్.. హె.పైలోరీ బ్యాక్టీరియాను కలిపిన రసాన్ని తాగేశారు. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. బాక్టీరియా కడుపులో స్థిరపడిందని, వాటి వల్లే అల్సర్ వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియా మందులు వేసుకొని బెర్రీ సమస్య నుంచి కోలుకున్నారు. 1984లో బెర్రీ చేసిన ఈ ప్రయోగం వల్ల కడుపులో అల్సర్, కేన్సర్కు హె.పైలోరీ బ్యాక్టీరియా కారణమని తేలింది. బెర్రీతోపాటు అతని తోటి వైద్యుడు వారెన్కు కూడా 2005లో నోబెల్ బహుమతి లభించింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్