‘నకిలీ కరోనా’పై యుద్ధభేరి
కరోనా వైరస్ ఎలా సోకుతుంది?మద్యం సేవిస్తే అదేం చేయలేదా? ఏసీ గదుల్లో కొవిడ్ సోకుతుందా? ఒకరి నుంచి ఎందరికి సోకుతుంది? ఇటలీలో ఏమైంది? అమెరికాలో ఏం జరగబోతోంది? సోషల్ మీడియాలో ఇలాంటి సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇందులో 50% నకిలీ సమాచారమే కావడం కలవరపెడుతోంది...
ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు కృషి
నకిలీ వార్తలపై 500+ భారతీయ శాస్త్రవేత్తల పోరాటం
కరోనా వైరస్ ఎలా సోకుతుంది?మద్యం సేవిస్తే అదేం చేయలేదా? ఏసీ గదుల్లో కొవిడ్ సోకుతుందా? ఒకరి నుంచి ఎందరికి సోకుతుంది? ఇటలీలో ఏమైంది? అమెరికాలో ఏం జరగబోతోంది? సోషల్ మీడియాలో ఇలాంటి సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇందులో 50శాతం నకిలీ సమాచారమే కావడం కలవరపెడుతోంది. ఎంత ప్రయత్నిస్తున్నా దాని వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అందుకే ఈ నకిలీ కరోనాపై సమర భేరీ మోగించేందుకు ముందుకొచ్చింది ‘500’ యోధుల బృందం. ఇంతకీ వీరేం చేశారంటే..
శాస్త్రవేత్తల స్వచ్ఛంద వేదిక
ఎక్కువ సార్లు సబ్బునీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. చేతులతో ముఖాన్ని తడుముకోవడాన్ని మానేయాలి. ఒకరికొకరు వ్యక్తిగత దూరం పాటించాలి. మాస్క్ లేకుండా బయటకు రావొద్దు. ఇవన్నీ పాటిస్తే వైరస్తో ఇబ్బంది ఉండదని ప్రభుత్వం, అధికారులు, వైద్యులు ఎంత చెబుతున్నా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వుహాన్లో ఓ వైద్యుడు ఇలా చేయమని చెప్పారు. ఫలానా మత పెద్ద ఇలా చేస్తే కరోనా మనల్ని ఏమీ చేయలేదని నొక్కి చెప్పారు. ఇవన్నీ సైంటిఫిక్ వంటి సందేశాలు నిజమేనేమోనని భ్రమింపజేస్తున్నాయి. వాస్తవంగా వీటి వెనక శాస్త్రీయత ఉందా? లేదా? లేకుంటే ఎలా? వైరస్ ఏ రేటుతో వ్యాపిస్తోంది? ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో సలహాలిస్తోంది ‘కొవిడ్-19 భారతీయ శాస్త్రవేత్తల స్పందన బృందం’ (ఐఎస్ఆర్సీ). ఇది పూర్తిగా స్వచ్ఛందమే.
500+ యోధులు
స్పందనా బృందంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, వైద్యులు, ప్రజా ఆరోగ్య పరిశోధకులు, సైన్స్ కమ్యూనికేటర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు కలిపి 500+ ఉన్నారు. వీరంతా ఎన్సీబీఎస్, ఐఐఎస్సీ, టీఐఎఫ్ఆర్, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, నిమ్హన్స్ వంటి ప్రఖ్యాత సంస్థలకు చెందినవారే కావడం గమనార్హం. పాలకులు, వైద్యులు, పోలీసులు, ఇంకా మరెందరో కొవిడ్-19పై ప్రత్యక్షంగా పోరు సలుపుతున్నారు. ఈ క్రమంలో సమాజానికి ఏమైనా చేయగలమా అనే సదుద్దేశంతో వీరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కృష్ణస్వామి (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం- చెన్నై), సంధ్యా కౌశిక (టీఐఎఫ్ఆర్-ముంబయి), గౌతమ్ మేనన్ (ఐఎంఎస్సీ-చెన్నై), నిరుజ్ మోహన్ రామానుజన్ (ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా), రీతికా సుద్ (నిమ్హన్స్-బెంగళూరు) వంటి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల చొరవతో ఈ మిషన్ ఏర్పాటైంది. సైన్స్ ప్రాముఖ్యం, అపోహల నివారణ, భారతీయ భాషల్లోకి అనువాదం, మేథమేటికల్ మోడలింగ్, యాప్స్-టెక్నాలజీ అభివృద్ధి, హార్డ్వేర్, డిజైన్-ఇలస్ట్రేషన్, వెబ్-మీడియా బృందాలుగా విడిపోయి వీరు పనిచేస్తున్నారు. నకిలీ సమాచారంపై పోరాడుతున్నారు.
ఆధార సహితంగా వివరణ
వైరస్ పుట్టుక, వ్యాప్తి, కట్టడి, నివారణపై అందుబాటులో ఉన్న సమాచారంతో నకిలీలపై పోరాడుతున్నామని హోమీబాబా కేంద్రానికి చెందిన సైన్స్ కమ్యూనికేటర్ అనికెత్ సూలె అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిగా తాను చేయగలిగిన సాయం ఇదేనని పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే ఐఎస్ఆర్సీలో అపోహల నివారణ బృందం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని వీరు విశ్లేషిస్తున్నారు. అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఆధారాల సహితంగా వివరిస్తున్నారు. వ్యాధి ఎలా సోకుతుంది? ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పేందుకు మేథమేటికల్ మోడలింగ్ను ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని బృందాలూ ఆన్లైన్ ద్వారానే చర్చలు, సంభాషణ కొనసాగిస్తున్నాయి. ‘వైరస్ ఎలా సోకుతుందన్నది జీవశాస్త్ర సమస్య. కానీ సమాజంలోని ఎందరికి సోకుతుంది? ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో తెలుసుకొనేందుకు మేథమేటికల్ మోడలింగ్ ఉపయోగపడుతుంది’ అని కంప్యూటేషనల్ బయాలజిస్ట్ రాహుల్ సిద్ధార్థన్ అన్నారు.
ప్రభుత్వాలకూ సలహాలు
కొవిడ్-19పై విజయం సాధించేందుకు శాస్త్రవేత్తలు, విశ్లేషకులు ఎలా ఆలోచిస్తున్నారు? ఏం చేయాలని భావిస్తున్నారు? తమ చర్చల సారామేంటో ప్రభుత్వానికి ఐఎస్ఆర్సీ తెలియజేస్తోంది. అట్నుంచి సైతం మంచి స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని ఇంగ్లిష్ నుంచి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, పంజాబి సహా 16 భాషల్లోకి అనువదిస్తున్నారు. క్లిష్టంగా అనిపించిన విషయాన్ని కొంత హాస్యాన్ని జోడించి వివరిస్తున్నారు. వ్యక్తిగత దూరం, వ్యక్తిగత పరిశుభ్రతపై కథలు రాసి అందులో శాస్త్రీయతను జోడిస్తున్నారు. అందరినీ ఇవన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. వైరస్కు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని శాస్త్రవేత్తలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవచ్చు. అందుకని భాషా నిపుణులు, సైన్స్ కమ్యూనికేటర్లు ఆ పనిని నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం ఐఎస్ఆర్సీ కృషి మంచి పేరు లభిస్తోంది.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM